India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ పీసీ ఘోష్ ఎల్లుండి HYD రానున్నారు. తొలుత ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన అధికారులు ఎస్కే జోషి, సోమేశ్కుమార్, రజత్కుమార్, స్మితా సబర్వాల్, రామకృష్ణారావును క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఆ తర్వాత ఈనెలాఖరున లేదా DEC తొలివారంలో KCR, హరీశ్ రావును విచారణకు పిలవనున్నట్లు సమాచారం. అయితే KCR విచారణకు వెళ్తారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.
BSNLలో 5G అందుబాటులోకి వస్తుండటంతో ప్రజలు ఈ నెట్వర్క్లోకి మారేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో రోజురోజుకీ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతోంది. అలాగే భారత్ ఫైబర్ (తక్కువ ధరకే WiFi)పైనా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దేశంలో మొత్తం 28.8 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కేరళ, తమిళనాడులోనే దాదాపు 9లక్షల కనెక్షన్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక APలో 1.7లక్షలు, TGలో 0.9లక్షల కనెక్షన్లున్నాయి.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి అర్పించారు. అలాగే రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగానూ ఆయన ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆమె చూసిన ధైర్యసాహసాలు ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకమని మోదీ కొనియాడారు. కష్టకాలంలో ఆమె నాయకత్వం నిజమైన సంకల్పం ఏమిటో చూపించిందన్నారు.
HYD: ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ యువకుడు <<14646252>>బాలికను<<>> హత్య చేసిన ఘటనలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. విఘ్నేష్ (చింటూ) కోసం బాలిక OCT 20న ఇంటి నుంచి వెళ్లిపోయింది. చింటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా దగ్గరయ్యాడు. బాలిక పెళ్లికి ఒత్తిడి తేగా దండలు మార్చుకున్నారు. అందరి సమక్షంలో చేసుకుందామని పదేపదే అడగడం, అదే సమయంలో ఇన్స్టాగ్రామ్లో మరొకరితో చాట్ చేస్తోందని అనుమానించి చింటూ ఆమెను చంపేశాడు.
AP: సోషల్ మీడియా పోస్టుల విచారణకు సంబంధించి డైరెక్టర్ రామ్గోపాల్ వర్మను ఇవాళ ఒంగోలు పోలీసులు విచారిస్తారని తెలుస్తోంది. ఆ వెంటనే ఆయనను అరెస్ట్ చేస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. గతంలో సీఎం చంద్రబాబు, లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ను కించపరుస్తూ RGV సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కొందరు మద్దిపాడు PSలో ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
ఉద్యోగులు వారానికి 70గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు చనిపోతున్నారని నెట్టింట విమర్శలూ వచ్చాయి. తాజాగా భారత సంతతి వ్యక్తి, శాన్ఫ్రాన్సిస్కోలోని ‘గ్రెప్లైట్’ CEO దక్ష్ గుప్తా కూడా రోజుకు కనీసం 14గంటలు పనిచేయాలని చెబుతున్నారు. ఒక్కోసారి ఆదివారాలు వర్క్ చేయాలని చెప్పారు. దీంతో నారాయణమూర్తికి శిష్యుడు దొరికాడరనే చర్చ మొదలైంది.
AP: దివిసీమ ఉప్పెనకు నేటితో సరిగ్గా 47 ఏళ్లు పూర్తయ్యాయి. 1977 NOV 19న అర్ధరాత్రి తాటి చెట్ల ఎత్తున, తీరం నుంచి 8 కి.మీ వరకు అలలు పోటెత్తాయి. కృష్ణా జిల్లాలోని నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లలమోద, హంసలదీవి వంటి ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే జల సమాధయ్యారు. 10 వేల మందికిపైగా ప్రజలు, దాదాపు పశువులన్నీ మరణించాయి. ఘటన జరిగిన 3 రోజులకు బాహ్య ప్రపంచానికి తెలిసింది.
TG: ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు రవాణా శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే 131 ఈవీలు కొన్నట్లు వెల్లడించింది. వీటిలో టూవీలర్లు-121, కార్లు-6, ఆటో రిక్షాలు-3, ఒక గూడ్స్ క్యారేజ్ వాహనం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈవీలపై రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ మినహాయింపును ప్రభుత్వం 2026 DEC 31 వరకు పొడిగించింది. గతంలో ఉన్న వాహన పరిమితి సంఖ్యనూ ఎత్తేసింది.
ఉద్యోగంలో, జీవితంలో ఏదో ఒక విషయంపై చింతిస్తున్నారు. ప్రతిదానికి అలా వర్రీ అయిపోతే ఎలా? అసలు మనిషికి అలాంటి అలవాటు ఉండొద్దని మానసిక నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులెప్పుడూ ఒకేలా ఉండవని, మీ సమస్య పూర్తయినా చింతించే అలవాటు మీతోనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. జీవితంలో శాంతి కావాలంటే వెంటనే చింతించే చెడు అలవాటును మానుకోవాలని సూచిస్తున్నారు. మీరూ ప్రతిదానికి వర్రీ, టెన్షన్ పడుతున్నారా? కామెంట్ చేయండి.
హీరోయిన్ కీర్తి సురేశ్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. బాయ్ఫ్రెండ్ ఆంటోనీ తటిల్తో ఆమె వివాహం డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలో జరగనున్నట్లు తమిళ మీడియా వర్గాలు తెలిపాయి. 15 ఏళ్లుగా వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్లు పేర్కొన్నాయి. ఆంటోనీ దుబాయ్లో వ్యాపారం చేస్తారని సమాచారం. పెళ్లి వార్తలపై కీర్తి సురేశ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.