News November 19, 2024

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు కొట్టివేత

image

AP: dy.CM పవన్ కళ్యాణ్‌పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ గుంటూరు జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వాలంటీర్లను కోర్టు విచారించగా.. తమకు సంబంధం లేదని వారు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు కేసును తొలగించింది. కొంత మంది వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులుగా మారారని గతేడాది పవన్ వ్యాఖ్యానించారు. దీనిపై కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా గుంటూరు జిల్లా కోర్టులో కేసు నమోదైంది.

News November 19, 2024

విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు

image

AP: పాల సేకరణ ధరను పెంచాలని కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) నిర్ణయించింది. 10% వెన్న కలిగిన లీటర్ గేదె పాలపై రూ.2, ఆవు పాలపై రూ.1.50 పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 10% వెన్న కలిగిన పాలకు రూ.80 చెల్లిస్తుండగా, రూ.2 పెంచడంతో రూ.82కి చేరింది. యూనియన్‌లో ఉన్న పాడి రైతులకు 4 నెలలకు సంబంధించిన రెండో విడత బోనస్‌గా రూ.12కోట్లను నేడు విడుదల చేయనుంది.

News November 19, 2024

ఛాంపియన్స్ ట్రోఫీ పాక్‌లోనే జరిగి తీరుతుంది: పీసీబీ

image

ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లోనే జరుగుతుందని పీసీబీ ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ స్పష్టం చేశారు. హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పారు. ‘అసలు తమ దేశానికి భారత్ ఎందుకు రాదో లిఖితపూర్వకంగా సమాధానమివ్వాలి. పాక్‌లో పర్యటించడానికి భారత్‌కు ఏంటీ సమస్య? ఇకపై బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గం. ఐసీసీ వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

News November 19, 2024

తెలుగు రాష్ట్రాల్లో నేటి కార్యక్రమాలు

image

☛ వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన, ప్రజాపాలన విజయోత్సవ సభ
☛ ఖమ్మంలో బీసీ డెడికేషన్ కమిషన్ పర్యటన
☛ లగచర్ల కేసు.. బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
☛ ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 4 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం (1.సహకార సొసైటీల చట్ట సవరణ బిల్లు, 2.ఎక్సైజ్, 3.విదేశీ మద్యం వాణిజ్యం, 4. ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు)
☛ నేడు పోలీసుల కస్టడీకి బోరుగడ్డ అనిల్

News November 19, 2024

వాటర్ హీటర్ వాడుతున్నారా?

image

*అల్యూమినియం బకెట్ మాత్రమే వాడండి. ఇనుప బకెట్ షాకిచ్చే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ బకెట్ అయితే కరిగిపోయే ఛాన్స్ ఉంది.
*స్విచ్ ఆఫ్ చేసి హీటర్ బకెట్‌లో నుంచి తీసిన తర్వాతే నీళ్లు వేడి అయ్యాయో లేదో చూడాలి. లేదంటే షాక్ ఇచ్చే ప్రమాదం ఉంది.
*పిల్లలు తిరిగే దగ్గర వాటర్ హీటర్ వాడకండి.
*హీటింగ్ కాయిల్ (రాడ్) నీటిలో మునిగేలా ఉంచండి.
*ISI మార్క్, షాక్ ప్రూఫ్ హీటర్లనే కొనుగోలు చేయండి.

News November 19, 2024

రేపే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

image

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. మహాయుతి కూటమిలోని బీజేపీ 149, శివసేన 81, NCP 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మహా వికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్ 101, శివసేన (UT) 95, NCP (SP) 86 స్థానాల్లో బరిలోకి దిగుతున్నాయి. మరోవైపు ఝార్ఖండ్‌లో రెండో విడతలో భాగంగా 38 స్థానాలకు, యూపీలో 9 స్థానాలకు (ఉపఎన్నిక) రేపే పోలింగ్ జరగనుంది. ఈనెల 23న ఓట్లను లెక్కించనున్నారు.

News November 19, 2024

కేసీఆర్ చెబితే మూసీ శుద్ధి పనులు ఆపేస్తాం: కోమటిరెడ్డి

image

TG: 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ మూసీ శుద్ధి చేయొద్దని చెబితే వెంటనే ప్రాజెక్టును ఆపేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు అరెస్ట్ భయం పట్టుకుందని, అందుకే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇక కిషన్ రెడ్డి నగరంలో మూసీ పక్కన ఒక్క రాత్రి నిద్రించడం కాదని, దమ్ముంటే 3 నెలలు నల్గొండలో నిద్ర చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

News November 19, 2024

CAGగా తెలుగు వ్యక్తి

image

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG)గా ఏపీకి చెందిన IAS ఆఫీసర్ కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నారు. సంజయ్ మూర్తిని CAGగా నియమిస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. సంజయ్ మూర్తి తండ్రి KSR మూర్తి అమలాపురం ఎంపీగా పని చేశారు. 1964లో జన్మించిన సంజయ్ 1989లో హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌లో IASగా ఎంపికయ్యారు.

News November 19, 2024

సన్నబియ్యం పంపిణీ ఆలస్యం!

image

TG: రేషన్ కార్డుదారులకు సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పినా 3 నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యంలో నూక శాతం పెరుగుతుందని, అన్నం ముద్దగా మారుతుందని అధికారులు తెలిపారు. కనీసం 3 నెలల పాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో ఉగాది నుంచి ఈ స్కీం అమలయ్యే అవకాశం ఉంది.

News November 19, 2024

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ అప్‌డేట్స్

image

☛ ఈనెల 23 నుంచి మ్యాచులు ప్రారంభం, DEC 15న ఫైనల్
☛ ముంబై కెప్టెన్‌గా శ్రేయస్. జట్టులో రహానె, పృథ్వీ షా, శార్దూల్‌కు చోటు
☛ బెంగాల్ జట్టుకు ఎంపికైన మహ్మద్ షమీ
☛ UP కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్, జట్టులో సభ్యులుగా రింకూ సింగ్, నితీశ్ రాణా, యశ్ దయాల్, మోసిన్ ఖాన్.
☛ HYD టీమ్ కెప్టెన్‌గా తిలక్ వర్మ, కర్ణాటక కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్
☛ జియో సినిమా యాప్‌లో లైవ్ మ్యాచులు .