India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు ఆఖరి బంతికి అందుకుంది. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా తొలి బంతికి నిక్కీ ప్రసాద్ ఫోర్ బాదారు. ఆ తర్వాతి 3 బంతులకు నాలుగు పరుగులు రాగా ఐదో బంతికి నిక్కీ ఔటయ్యారు. చివరి బంతికి అరుంధతి రెండు పరుగులు తీసి ఢిల్లీకి విజయాన్ని అందించారు.

మద్యం తాగే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉందని కేంద్ర సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 15-49ఏళ్ల స్త్రీల సగటు మద్యపానం 1.2% ఉండగా, అస్సాంలో ఇది 16.5% ఉంది. తర్వాతి స్థానాల్లో మేఘాలయ(8.7%), అరుణాచల్(3.3%) ఉన్నాయి. గతంలో టాప్లో ఉన్న ఝార్ఖండ్(9.9%), త్రిపుర(9.6%) తాజా సర్వేలో వరుసగా 0.3, 0.8 శాతానికి తగ్గిపోయాయి. మెట్రోపాలిటన్ రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక ఈ లిస్టులో లేకపోవడం గమనార్హం.

కిచ్చా సుదీప్ నటించిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మ్యాక్స్’ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 22న రిలీజ్ చేస్తామని గతంలో చెప్పిన సంస్థ వారం ముందుగానే ఓటీటీలోకి తీసుకురావడం విశేషం. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం DEC 25న విడుదలై దాదాపు రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో సునీల్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.

మనలో చాలా మంది మిగిలిపోయిన ఆహారాలను ఫ్రిజ్లో పెట్టి మళ్లీ వేడి చేసుకుని తింటుంటారు. ఇది చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సీఫుడ్, ఆకుకూరలు, గుడ్లు, బంగాళదుంపలు, కాఫీ, టీ, అన్నం, వేయించిన పదార్థాలను మరోసారి వేడి చేస్తే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. వాటిలో పోషకాలు, ఖనిజాలు నాశనమవుతాయని, బ్యాక్టీరియా పెరుగుతుందని, జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు.

AP: గుంటూరు GGHలో బ్లడ్ బ్యాంక్ ఉద్యోగి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది. ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా కోర్సు చేస్తున్న విద్యార్థినులు ట్రైనింగ్లో భాగంగా GGHలో విధులు నిర్వహిస్తున్నారు. వారిపై ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితులు ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేయడంతో ముగ్గురితో విచారణ కమిటీ ఏర్పాటుచేశారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

AP: ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరును ప్రకాశం జిల్లాలో కలిపే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాన్ని ప్రకాశంలో కలిపేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని CM చంద్రబాబు ప్రకటించారు. వెలిగొండ పూర్తి చేసి కందుకూరుకు నీళ్లు ఇస్తామన్నారు. అటు పట్టణానికి రూ.50 కోట్లు మంజూరు చేసిన CM ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చాలని సూచించారు. అలాగే గర్భ కండ్రిక భూముల సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.

APR 1 నుంచి ఏకీకృత పెన్షన్ స్కీం(UPS) అమలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. NPS కింద UPSను ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక చేసుకోవచ్చు. దీని కింద ఉద్యోగి మరణించిన తర్వాత పెన్షన్లో 60% ఫ్యామిలీకి పెన్షన్గా ఇస్తారు. రిటైర్డ్ టైంలో గ్రాట్యుటీ, ఇతర చెల్లింపులు ఉంటాయి. 25 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన వారికి చివరి ఏడాది బేసిక్ పే సగటులో 50% పెన్షన్ ఇస్తారు. తక్కువ టైం పనిచేస్తే తదనుగుణంగా పెన్షన్ ఇస్తారు.

విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’ మూవీకి తొలి రోజు రూ.1.25 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. సినిమాకు పూర్తిగా నెగటివ్ టాక్ రావడంతో వీకెండ్ అయినప్పటికీ బుకింగ్స్ ఏమాత్రం లేవని పేర్కొన్నాయి. ప్రీరిలీజ్ ఈవెంట్లో వైసీపీ టార్గెట్గా నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. సినిమాలోనూ విషయం లేకపోవడంతో ఎవరూ ఆసక్తి చూపడం లేదని అంటున్నాయి.

పేరెంట్స్పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా మరో సారి క్షమాపణలు చెప్పారు. తనతో పాటు కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయన్నారు. తన తల్లి ఆసుపత్రిలోకి కొందరు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తనకు భయంగా ఉందని, ఏం చేయాలో అర్థమవ్వట్లేదన్నారు. అధికారులకు సహకరిస్తున్నామని, భారత న్యాయ, పోలీసు వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.

‘పుష్ప’ సినిమాలో జాలి రెడ్డి పాత్రతో ఫేమస్ అయిన కన్నడ నటుడు ధనుంజయ ఓ ఇంటివాడవుతున్నారు. తన ప్రియురాలు డాక్టర్ ధన్యతను మైసూరులో రేపు ఉదయం వివాహం చేసుకోనున్నారు. ఇవాళ జరిగిన రిసెప్షన్కు డైరెక్టర్ సుకుమార్తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నిన్న హల్దీ ఫంక్షన్ వైభవంగా జరిగింది. ఇతను కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో దాదాపు 40 చిత్రాల్లో నటించారు. పలు చిత్రాలకు పాటలు కూడా రాశారు.
Sorry, no posts matched your criteria.