News November 19, 2024

అరకులో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత

image

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 8.9 డిగ్రీలు, డుంబ్రిగుడలో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలోని తిర్యాణి (ఆసిఫాబాద్), జహీరాబాద్ (సంగారెడ్డి)లో 12.1 టెంపరేచర్ రికార్డయింది. హైదరాబాద్ BHELలో 13.3 డిగ్రీలుగా ఉంది. నవంబర్ 28 వరకు చలి ఇలాగే కొనసాగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు.

News November 19, 2024

నేటి నుంచి డిగ్రీ కాలేజీలు బంద్!

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నేటి నుంచి నిరవధిక బంద్‌కు సిద్ధమయ్యాయి. రూ.2వేలకోట్ల బకాయిలు విడుదల చేసే వరకూ కాలేజీల బంద్‌ను కొనసాగిస్తామని, సెమిస్టర్ పరీక్షలనూ బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. ఈ బంద్‌లో కాలేజీలు పాల్గొనాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది.

News November 19, 2024

ఈనెల 26న గ్రూప్-4 నియామక పత్రాల అందజేత?

image

TG: గ్రూప్-4 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఈనెల 26న నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఈనెల 14న గ్రూప్-4 ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయగా, 8084 మంది ఎంపికైన సంగతి తెలిసిందే.

News November 19, 2024

ACA ఉమెన్స్ క్రికెట్ ఆపరేషన్స్ మెంటార్‌గా మిథాలీ

image

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో మహిళల క్రికెట్ ఆపరేషన్స్ మెంటార్‌గా భారత మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ నియమితులయ్యారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి, వారిని ఉత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు ఆమె ACAతో కలిసి మూడేళ్లు పని చేయనున్నారు. అనంతపురంలో హై-పెర్ఫార్మెన్స్ అకాడమీని ఏర్పాటు చేసి, 80 మంది బాలికలను ఎంపిక చేసి 365 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ACA తెలిపింది.

News November 19, 2024

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షపై ఆ నిర్ణయం వెనక్కి!

image

JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష విధానంపై జాయింట్ అడ్మిషన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. 2025 నుంచి ఈ పరీక్షను వరుసగా మూడుసార్లు రాసుకోవచ్చని ఇటీవల ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. గతంలోలా వరుసగా రెండు సార్లు మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంటర్ పాసైన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాది మాత్రమే ఈ ఎగ్జామ్ రాయవచ్చు. IITల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీ కోసం దీనిని నిర్వహిస్తారు.

News November 19, 2024

నేడు వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన

image

TG: ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వరంగల్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహిస్తోంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే ఈ సభలో CM రేవంత్ పాల్గొననున్నారు. ఇవాళ ఇందిరా గాంధీ జయంతి నేపథ్యంలో సభా వేదికకు ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’గా పేరు పెట్టారు. ఈ సభకు దాదాపు లక్ష మంది హాజరవుతారని అంచనా. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

News November 19, 2024

మెటాకు రూ.213 కోట్ల ఫైన్

image

వాట్సాప్ మాతృసంస్థ మెటాకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ₹213కోట్ల జరిమానా విధించింది. ప్రైవసీ పాలసీకి సంబంధించి 2021లో ఆ సంస్థ తీసుకొచ్చిన అప్‌డేట్ అనైతికం అని పేర్కొంది. ఈ అప్‌డేట్ ప్రకారం యూజర్లు తమ వాట్సాప్ డేటాను ఇతర మెటా కంపెనీలతో షేర్ చేసుకునేందుకు తప్పనిసరిగా అంగీకరించాలి. అయితే ఈ విషయంలో యూజర్లదే తుది నిర్ణయమని, 2016 నాటి విధానానికి భిన్నంగా కొత్త విధానాన్ని అమలు చేసినందుకు ఫైన్ వేసింది.

News November 19, 2024

టీటీడీ నిర్ణయం హర్షణీయం: పవన్ కళ్యాణ్

image

AP: తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తూ <<14644612>>టీటీడీ తీసుకున్న నిర్ణయం<<>> హర్షణీయం అని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఎన్నికల సమయంలో నగర ప్రజలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని, వారికి తాను హామీ ఇచ్చానని పేర్కొన్నారు. ‘తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ, ఆ దిశగా అధికార యంత్రాగాన్ని నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

News November 19, 2024

BGTలో అత్యధిక వికెట్లు, రన్స్ తీసింది వీరే

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నాథన్ లియోన్ (116) కొనసాగుతున్నారు. అతని తర్వాతి స్థానాల్లో అశ్విన్ (114), కుంబ్లే (111), హర్భజన్(95), రవీంద్ర జడేజా (85), జహీర్ ఖాన్ (61) ఉన్నారు. అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (3262) పేరిట ఉంది. అతని తర్వాతి స్థానాల్లో పాంటింగ్ (2555), లక్ష్మణ్ (2434), ద్రవిడ్ (2143), క్లార్క్ (2049), పుజారా (2033) ఉన్నారు.

News November 19, 2024

ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి?: వైసీపీ

image

AP: రాష్ట్రంలో ఆడబిడ్డలపై రోజురోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని YCP విమర్శించింది. బాపట్లలో మతిస్థిమితం లేని 11 ఏళ్ల బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారని, నిందితుడిని పోలీసులకు అప్పగించారని ట్వీట్ చేసింది. ‘మీ చేతగానితనంతో ఇంకెంత మంది ఆడబిడ్డలు ఇలాంటి కామాంధులకి బలవ్వాలి?’ అని CM CBN, Dy.CM పవన్, హోంమంత్రి అనితను ప్రశ్నించింది.