India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: సమాజానికి ఉపయోగపడేలా ఆదర్శవంతమైన సినిమాలు తీయాలని మంత్రి సత్యకుమార్ అన్నారు. వీరప్పన్, పూలన్ దేవి లాంటి బందిపోట్లు, స్మగ్లర్ల జీవితకథలతో సినిమాలు తీయడమేంటని ప్రశ్నించారు. వీటితో చిన్నారులను స్మగ్లర్లుగా మార్చమని సందేశమిస్తున్నారా అని అన్నారు. జన్మించిన ఊరు కోసం, సమాజం కోసం మంచి చేసే వారి కథలు సినిమాలుగా తీయాలని సూచించారు.

ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచులో ముంబై ఇండియన్స్ 164 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్ బ్యాటర్ స్కివర్ బ్రంట్(80*) అదరగొట్టగా కెప్టెన్ హర్మన్ ప్రీత్(42) ఫర్వాలేదనిపించారు. యస్తికా(11) మినహా ఇతర ప్లేయర్లు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో ముంబై భారీ స్కోరు చేయలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో అన్నాబెల్ 3, శిఖా పాండే 2, కాప్సే, మిన్నూ చెరో వికెట్ వికెట్ తీశారు. DELHI టార్గెట్ 165.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తవ్వగా పాటల చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా సెట్లో ధోతీలో ఉన్న చిరంజీవి బ్యాక్ ఫొటోను దర్శకుడు పంచుకున్నారు. కీరవాణి కంపోజిషన్లో చిరు స్టెప్పులతో అదరగొట్టారని రాసుకొచ్చారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్కు ఇక పండగే అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

రాయగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జీవర్ధన్ చౌహాన్ ఘన విజయం సాధించారు. దీంతో ఇన్నాళ్లూ నగరంలో ‘టీ దుకాణం’ నడిపిన వ్యక్తి మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ తమ మేయర్ అభ్యర్థిగా జీవర్ధన్ ను ప్రకటించింది. సీఎం సైతం తన దుకాణంలో టీ అమ్ముతూ ప్రచారం చేశారు. ఛత్తీస్గఢ్లో పది మున్సిపల్ కార్పొరేషన్లను గెలిచి బీజేపీ క్లీన్స్వీప్ చేసింది.

TG: సంగారెడ్డిలో మెగ్యానాయక్ తండాలో దారుణం జరిగింది. 9వ తరగతి చదువుతున్న తన కుమార్తెను ప్రేమించాడనే నెపంతో దశరథ్ అనే వ్యక్తిని గోపాల్ హతమార్చాడు. అనంతరం నారాయణఖేడ్ పీఎస్లో లొంగిపోయారు. మరోవైపు దశరథ్కు అప్పటికే పెళ్లవ్వగా.. 4 రోజులుగా కనిపించకుండా పోయాడని భార్య ఫిర్యాదు చేసింది. తాజాగా హత్యకు గురైనట్లు తేలడంతో మృతదేహం కోసం గాలిస్తున్నారు.

‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో <<15413969>>వివాదాస్పద వ్యాఖ్యలతో<<>> కేసు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియ తనపై నమోదైన కేసులు కొట్టేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన తరఫున వాదించేది మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కొడుకు అభినవ్ చంద్రచూడ్. బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అభినవ్ ముంబైలోనే లా పట్టా పొందారు. హార్వర్డ్ లా స్కూల్లో LLM చదివారు.

‘లవ్జిహాద్’ పై మహారాష్ట్ర ప్రభుత్వం డీజీపీ సంజయ్వర్మ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. బలవంతపు మత మార్పిడులను అడ్డుకోవడానికి న్యాయపరంగా ఉన్న అవకాశాలు, పలు రాష్ట్రాలలో అమలవుతున్న చట్టాలను విశ్లేషించి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వనుంది. త్వరలోనే ప్రభుత్వం ‘లవ్జిహాద్’ను నివారించేందుకు చట్టం తీసుకొస్తున్నట్లు సమాచారం. అయితే విపక్షాలు కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి.

TG: MLC ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ నుంచి నిర్మాణం ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ పథకాలను షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రచారం చేయాలని I&PR, హౌసింగ్ శాఖలపై సమీక్షలో ఆయన వెల్లడించారు. ORR, RRR చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు నిర్మించాలని సూచించారు. మధ్య తరగతి ప్రజల కోసం LIG, MIG, HIG ఇళ్లు కట్టాలని చెప్పారు.

TG: గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్ నివాసంలో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. HYD, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22ఎకరాల భూమి, ప్లాట్లు, విల్లా, భవనాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. అలాగే బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిన్న రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి దొరికారు. సోదాల అనంతరం సతీశ్ను అరెస్ట్ చేశారు.

ఉప్పు బ్రాండ్లను బట్టి KG ₹30-₹200 వరకు ఉంటుంది. అయితే కొరియన్/బాంబూ సాల్ట్ ధర ₹20-30K. దీన్ని తొలుత కొరియాలో తయారుచేసేవారు. వెదురు బొంగులో సముద్రపు ఉప్పును నింపి 400డిగ్రీల వద్ద కాల్చుతారు. ఇలా 9సార్లు చేస్తే స్పటిక రూపంలోకి మారుతుంది. KG తయారీకి 20D పడుతుంది. ఇందులో 73మినరల్స్ ఉంటాయి. దీన్ని వాడితే ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో ఉత్తరాఖండ్ సర్కార్ దీన్ని తయారుచేస్తోంది.
Sorry, no posts matched your criteria.