India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత మరింత పెరగడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10, 12వ తరగతులకు ఫిజికల్ క్లాసెస్ నిలిపివేస్తున్నామని, ఇక నుంచి ఆన్లైన్ క్లాసులు ఉంటాయని సీఎం అతిశీ వెల్లడించారు. ఇప్పటికే 9వ తరగతి వరకు క్లాసులను నిలిపివేశారు. గత 24 గంటల్లో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 493గా రికార్డయింది. ఈ సీజన్లో ఇదే అత్యల్ప గాలి నాణ్యత అని అధికారులు చెప్పారు.
తన బాల్యం బాధాకరంగా ఉండేదని బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా వెల్లడించారు. తండ్రి నియంతలా ఉండేవారని, తనను చెప్పులు, బెల్టులతో కొట్టేవారని తెలిపారు. ఓసారి తాను సిగరెట్ తాగకపోయినా షర్ట్ ఆ స్మెల్ రావడంతో విపరీతంగా కొట్టారని చెప్పారు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ‘నేను, భార్య తహీరా ట్వంటీస్లోనే పేరెంట్స్ అయ్యాం. నా తండ్రితో పోలిస్తే నేను భిన్నమైన ఫాదర్ను. ఫ్రెండ్లీగా ఉంటా’ అని పేర్కొన్నారు.
TG: తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని పాతబస్తీ నుంచే మొదలుపెట్టాలని, కాంగ్రెస్ బుల్డోజర్లకు అక్కడికి వెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRది మేకపోతు గాంభీర్యమని, ఆయన అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరమా అని నిలదీశారు. లగచర్లలో కలెక్టర్పై దాడి కల్వకుంట్ల కుటుంబం పనే అని ఆరోపించారు.
TG: రాష్ట్ర వ్యాప్తంగా 75,75,647 నివాసాల్లో సమగ్ర సర్వే పూర్తి అయింది. దీంతో ఇంటింటి కుటుంబ సర్వే 65.02 శాతం పూర్తి అయినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ములుగు జిల్లా 95.3శాతంతో తొలి స్థానంలో నిలిచింది. నల్గొండ 89.1, జనగామ 86 శాతం సర్వేతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. GHMCలో అతి తక్కువగా 44.3 శాతం సర్వే పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు.
స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఇన్స్టా స్టోరీలో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరలవుతోంది. బంగారంతో చేసిన టూత్బ్రష్ను చేతపట్టుకున్న ఫొటోను పోస్టు చేస్తూ ‘నోటితో చెప్పకుండానే నువ్వు సింధీ అమ్మాయివని ఎలా చెప్తానంటే’ అని క్యాప్షన్ ఇచ్చారు. సింధీ ప్రజలకు బంగారంపై ఉండే ఇష్టాన్ని, వారి కల్చర్ను పరోక్షంగా చెప్పారు. ఈ పోస్టుపై కొందరు సానుకూలంగా స్పందిస్తుండగా, మరికొందరు షో ఆఫ్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
AP: పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు బ్రిటన్ పార్లమెంట్ విజనరీ లీడర్ అవార్డును ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఆయన లండన్ వెళ్లలేకపోయారు. ఆయన స్థానంలో యూకే ఎన్ఆర్ఐ టీడీపీ వ్యవహారాల నేత గోపాల్ పురస్కారం అందుకున్నారు. అరుదైన అవార్డు సాధించిన ఏలూరికి సీఎం చంద్రబాబు, మంత్రులు ఫోన్ చేసి అభినందించారు.
పిల్లలకు పరీక్షలు, మార్కులు, గ్రేడ్ల ప్రస్తావనే లేకుండా కేరళ కొచ్చిలోని CBSE స్కూల్స్ వినూత్న విధానాన్ని అమలుచేస్తున్నాయి. KG నుంచి రెండో తరగతి వరకు విద్యార్థుల సోషల్ స్కిల్స్ పెంచేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో ప్రదర్శన ఆధారంగా వారికి క్లాప్స్, స్టార్, ట్రోఫీ లాంటి ఎమోజీలను కేటాయిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థుల్లో ఉత్సాహం కనిపిస్తోందని, ఒత్తిడి అసలే లేదని టీచర్లు చెబుతున్నారు.
అమెరికాకు 2009 తర్వాత అత్యధికంగా విద్యార్థుల్ని పంపిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చైనాను రెండో స్థానానికి నెట్టేసింది. 2023-24లో ఏకంగా 3.3 లక్షల మంది భారతీయులు US ఉన్నత విద్యాలయాల్లో ఎన్రోల్ అయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 23% ఎక్కువ. గ్రాడ్యుయేట్స్ 1,96,567 (19%), ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ 97,556 (41%)గా ఉన్నారు. చైనీయులు 4% తగ్గి 2,77,398కి చేరుకున్నారు.
TG: CM రేవంత్ రెడ్డి మంగళవారం వరంగల్లో పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2.30కు వరంగల్ చేరుకొని, రోడ్డు మార్గాన ఆర్ట్స్ కాలేజీకి వెళ్తారు. 3.20-3.50వరకు ఇందిరా మహిళా స్టాల్స్ సందర్శిస్తారు. అనంతరం కాలేజీ గ్రౌండ్లోని వేదికపైకి చేరుకొని 22జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఆపై ట్రాన్స్జెండర్ క్లినిక్లను ప్రారంభించి, 4.40 తర్వాత CM ప్రసంగిస్తారు.
బ్రెజిల్ రాజధాని రియో డి జనిరోలో జరుగుతున్న జీ20 సమ్మిట్లో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను కలిశారు. ఈ ఫొటోను మోదీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైడెన్ను కలిసిన ప్రతిసారి ఆనందంగా ఉంటుందని చెప్పారు. వారిద్దరూ కాసేపు ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు. కాగా మోదీ నవంబర్ 21 వరకు నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల్లో పర్యటించనున్నారు.
Sorry, no posts matched your criteria.