India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. గుంటూరులో ఓ ప్రాపర్టీ షో బ్రౌచర్ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ‘లేఔట్ అనుమతుల విషయంలో సడలింపులు తెస్తున్నాం. దేశంలోనే సరళతరమైన విధానాలు ఏపీలో తీసుకొస్తాం. రియల్ ఎస్టేట్ రంగానికి మా ప్రభుత్వం సహకరిస్తుంది. గుంటూరు, విజయవాడ, మంగళగిరి కలిసి మెగాసిటీగా మారుతాయి. అందుకు తగ్గ మాస్టర్ ప్లాన్ సిద్ధం అవుతోంది’ అని చెప్పారు.
ఐపీఎల్ మెగా వేలంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కోసం పది జట్లు ఎదురుచూస్తున్నాయి. సాలిడ్ ఓపెనర్, స్మార్ట్ కెప్టెన్, సమర్థుడైన వికెట్ కీపర్ అతడు. మరోవైపు ప్రతి జట్టుకు ఓపెనరో, కెప్టెనో, వికెట్ కీపరో కావాల్సి ఉంది. దీంతో అన్ని లక్షణాలున్న బట్లర్ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడతాయనడంలో సందేహం లేదు. మెగా ఆక్షన్లో ఆయన భారీ జాక్ పాట్ కొడతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
BCCI, ICCకి భారీ షాక్ తగిలేలా ఉంది. క్రికెట్ టోర్నీల మీడియా హక్కుల కోసం వెంపర్లాడబోమని రిలయన్స్ డిస్నీ మీడియా జేవీ వైస్ఛైర్మన్ ఉదయ్ శంకర్ కుండబద్దలు కొట్టడమే ఇందుకు కారణం. తమకిక FOMO ఆందోళన లేదన్నారు. ఒకవేళ మిస్సైనా బిజినెస్కు పెద్దగా నష్టమేమీ ఉండదన్నారు. ఈ స్ట్రాటజీ మీడియా హక్కులపై భారీ ప్రభావం చూపిస్తుందని, కంపెనీల మధ్య పోటీ లేకుంటే బోర్డులకు ఆదాయం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
ఖలిస్థానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర చేశారని వికాస్ యాదవ్పై కేసు నమోదు చేసిన ఫెడరల్ ప్రాసిక్యూటర్ Damian Williamsను ట్రంప్ తొలగించారు. అతని స్థానంలో డిస్ట్రిక్ట్ అటార్నీగా SES మాజీ ఛైర్మన్ జే క్లేటన్ను నామినేట్ చేశారు. పన్నూ హత్యకు భారత నిఘా విభాగం EX అధికారి వికాస్ కుట్ర చేశారని US న్యాయ శాఖ ఆరోపిస్తోంది. అయితే వికాస్తో ఎలాంటి సంబంధం లేదని భారత్ స్పష్టం చేసింది.
జాంబియా గ్రామీణ ప్రాంతానికి చెందిన మార్గరెట్ చోలా (లెజెండరీ గ్లామ్మా) అనే వృద్ధురాలు సోషల్ మీడియా సెన్సేషన్గా మారారు. ఆమె తన మనవరాలు డయానా కౌంబాతో కలిసి స్టైలిష్ డ్రెస్సులు ధరించిన ఫొటోలు పోస్ట్ చేశారు. దీంతో ఆమె స్టైలిష్ ఐకాన్గా మారిపోయారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు తనను ప్రేమిస్తున్నారని తెలుసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని చోలా చెప్పుకొచ్చారు. ఆమె ఎలా రెడీ అవుతారో మీరూ చూసేయండి.
TG: పదవ తరగతి విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు విద్యాశాఖ గడువు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఎల్లుండితో గడువు ముగియనుండగా ఈ నెల 28 వరకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. చలానా విధానాన్ని రద్దు చేస్తూ, పరీక్ష ఫీజు ఆన్లైన్లో చెల్లించే సౌకర్యాన్ని తీసుకొచ్చింది.
యూరప్లోని రొమేనియాలో ఉన్న వింత రాళ్లు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘ట్రోవాంట్స్’ అని పిలిచే ఈ ప్రత్యేకమైన రాళ్లు వర్షాలు పడిన తర్వాత వాటంతటవే పెరిగిపోతుంటాయి. అప్పటివరకూ సాధారణ శిలల్లా కనిపించే ఈ భౌగోళిక అద్భుతాలు వర్షపు నీటిని పీల్చుకుని పరిమాణాన్ని పెంచుకుంటాయి. అచ్చం జీవిలానే ప్రవర్తిస్తాయి. ఈ దృగ్విషయం స్థానికులు, శాస్త్రవేత్తలు సైతం అవాక్కయ్యేలా చేస్తోంది.
ట్రంప్ను హత్య చేసే ఆలోచన తమకు లేదని అమెరికాకు ఇరాన్ వివరణ ఇచ్చింది. Sepలో ఇరాన్తో జో బైడెన్ యంత్రాంగం సమావేశమైంది. ట్రంప్పై ఏరకమైన దాడి జరిగినా దాన్ని యుద్ధ చర్యగా పరగణిస్తామని US స్పష్టం చేసింది. దీంతో Octలో ఇరాన్ ‘ఆ ఆలోచన లేద’ని బదులిచ్చినట్టు సమాచారం. 2020లో ట్రంప్ ఆదేశానుసారం జరిగిన దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసీం సులేమాని హతమవ్వడంతో ఇద్దరి మధ్య రగడ ప్రారంభమైంది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ సినిమా ఈనెల 22న రిలీజ్ కానుంది. ఈక్రమంలో మేకర్స్ గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రేపు వరంగల్ హనుమకొండలోని JNS ఇండోర్ స్టేడియంలో ఈవెంట్ జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభమవుతుందని మేకర్స్ తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ చిత్రాన్ని రవితేజ ముళ్లపూడి తెరకెక్కించారు.
తెలంగాణలో రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతున్నాయి. సన్న రకం వడ్లు క్వింటాకు రూ.500 చొప్పున జమ చేస్తున్నారు. ఈ నెల 11న ప్రయోగాత్మకంగా ఒక రైతు ఖాతాలో క్వింటాకు రూ.500 చొప్పున రూ.30వేలు జమ చేశారు. ఇవాళ రూ.కోటికిపైగా చెక్కులను పౌరసరఫరాల శాఖ జారీ చేయగా, 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి.
Sorry, no posts matched your criteria.