India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో దేశాధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే నేతృత్వంలోని వామపక్ష కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 225 స్థానాల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ 61.56% ఓట్లతో 159 సీట్లు గెలుచుకుంది. గతంలో ఈ కూటమికి పార్లమెంటులో మూడు సీట్లు ఉండేవి. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దిస్సనాయకే వెంటనే పార్లమెంటు ఎన్నికలకు వెళ్లి తన హవాను కొనసాగించారు.
AP: ఇళ్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లలో ఇళ్లు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏడాదిలో లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసేలా ప్లాన్ చేశామని చెప్పారు. ‘రాత్రికి రాత్రే అన్ని పనులు చేస్తామని మేం చెప్పడం లేదు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో విధ్వంసం జరిగింది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుదలతో కృషి చేస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
TG: కులగణనను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ ఒక్క ఇల్లును వదలకుండా ప్రతి ఇంట్లో సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. ‘44.1శాతం సర్వే పూర్తైంది. 5.24 లక్షల ఇళ్లలో సర్వే పూర్తైంది. సర్వేకు ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించవద్దు. సర్వే జరుగుతున్న తీరును రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి’ అని సీఎం సూచించారు.
అక్టోబర్ చివర్లో ఇజ్రాయెల్ జరిపిన ప్రతీకార దాడుల్లో ఇరాన్కు గట్టి దెబ్బే తగిలినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని పార్చిన్ మిలిటరీ కాంప్లెక్స్లో ఉన్న అణ్వాయుధ పరిశోధన కేంద్రం ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇది ఇరాన్కు పెద్ద దెబ్బ అని చెబుతున్నాయి. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చినందుకు ఇజ్రాయెల్పై ఇరాన్ గతంలో దాడి చేయడం తెలిసిందే.
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. ఎన్యూమరేటర్లు ఇవాళ హైదరాబాద్లోని ఆమె నివాసానికి వెళ్లారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్ సిబ్బందికి తమ పూర్తి వివరాలు ఇచ్చారు. కొన్ని వివరాలను కవితనే స్వయంగా నమోదు చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై బెయిల్పై బయటికొచ్చిన కవిత చాలారోజుల తర్వాత బయటి ప్రపంచానికి కనిపించారు.
రైళ్లు, రైల్వే స్టేషన్లు, కోచ్లలో రీల్స్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని రైల్వే నిర్ణయించింది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే అలాంటి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దేశంలోని అన్ని రైల్వే జోన్లకు సూచించింది. కాగా కదులుతున్న రైళ్లలో, పట్టాల పక్కన ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతుండటంతో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.
తాను కష్టాల్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ ఆదుకున్నారని డైరెక్టర్ గుణశేఖర్ అన్స్టాపబుల్ షోలో వీడియో సందేశంలో తెలిపారు. ‘వరుడు సినిమాతో బన్నీకి నా వల్ల ఫ్లాప్ వచ్చింది. అయినా సరే రుద్రమదేవి సినిమా సమయంలో నాకు కాల్ చేశారు. ‘మీ సినిమా కష్టాల్లో ఉందని విన్నాను. నా వల్ల మీకు హెల్ప్ అవుతుందనుకుంటే ఏదైనా పాత్ర చేస్తాను’ అన్నారు. అడక్కుండానే ముందుకొచ్చి సాయం చేసిన మంచి మనిషి బన్నీ’ అని కొనియాడారు.
IPL 2025 మెగా వేలం షార్ట్ లిస్ట్లో భారత్కు చెందిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చోటు దక్కించుకున్నారు. ఆయన రూ.30 లక్షల బేస్ ప్రైజ్తో వేలంలో ఉంటారు. కాగా వైభవ్ బిహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నారు. ఆయన 2011 మార్చి 27న జన్మించారు. భారత అండర్-19 జట్టులో ఆయన ఆడారు. మరోవైపు లిస్టులో అత్యధిక వయసున్న ఆటగాడిగా ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ అండర్సన్(42) నిలిచారు.
ఢిల్లీలోని సరాయి కాలే ఖాన్ చౌక్కు గిరిజనుల ఆరాధ్యుడు <<14618652>>బిర్సాముండా పేరు<<>> పెట్టి BJP వ్యూహాత్మక రాజకీయానికి తెరలేపింది. ఝార్ఖండ్లో 38 సీట్లకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఝార్ఖండ్ ఏర్పడకముందు 1875-1990 మధ్య కాలంలో ఈ ప్రాంత గిరిజనులకు బిర్సాముండా ఓ ధైర్యం. ఆ స్థాయి ప్రాబల్యం కలిగిన బిర్సా పేరును ఎన్నికల వేళ తెరపైకి తెచ్చి BJP వ్యూహాత్మక రాజకీయం చేస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు.
కొందరికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. రోజుకోసారైనా రుచి చూడాలని తహతహలాడుతుంటారు. కానీ నెలరోజులపాటు మాంసాహారం తినడం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నెలపాటు మానేస్తే అజీర్ణం, జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు సమస్య తగ్గి, ఎముకల బలం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఆర్థరైటిస్, వాపులు, నొప్పులు తగ్గుతాయని అంటున్నారు.
Sorry, no posts matched your criteria.