News February 1, 2025

AP పట్ల కేంద్రానికి ఇంతటి నిర్లక్ష్యమెందుకు?: జైరామ్ రమేశ్

image

కేంద్ర ప్రభుత్వం బిహార్‌కు బొనాంజా ప్రకటించి కూటమిలోనే భాగమైన ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం అత్యంత క్రూరంగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరామ్ రమేశ్ ట్విటర్లో విమర్శించారు. ‘త్వరలో ఎన్నికలున్నాయి కాబట్టి బిహార్‌కు కేంద్రం వరాలు కురిపించింది. అది సహజమే. కానీ ఎన్డీయేకు మూలస్తంభంలా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకంత క్రూరంగా నిర్లక్ష్యం చేసింది?’ అని ప్రశ్నించారు.

News February 1, 2025

తర్వాతి మ్యాచ్‌లో షమీని ఆడిస్తాం: మోర్కెల్

image

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా రేపు జరిగే ఆఖరి మ్యాచ్‌లో షమీని ఆడించనున్నట్లు భారత బౌలింగ్ కోచ్ మోర్కెల్ తెలిపారు. ‘షమీ చాలా బాగా ఆడుతున్నారు. వార్మప్ గేమ్స్‌లో శరవేగంగా బౌలింగ్ చేస్తున్నారు. వచ్చే మ్యాచ్‌కి ఆయన్ను ఆడిస్తాం. ఆ అనుభవం యువ ఆటగాళ్లకు కీలకం’ అని పేర్కొన్నారు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ షమీకి భారత జట్టులో వరుస అవకాశాలివ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

News February 1, 2025

ఎన్నికల దృ‌ష్ట్యా బడ్జెట్ రూపకల్పన?

image

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఢిల్లీ, బిహార్‌ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో విద్యాధికులు, ఉద్యోగుల ప్రభావమే ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఆదాయ పన్ను భారీ మినహాయింపును ప్రకటించిందని అంటున్నారు. ఇక బిహార్‌ ఎన్నికల దృ‌ష్ట్యా ఇబ్బడి ముబ్బడిగా పలు మార్గాల్లో నిధుల్ని కేటాయించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మీ అభిప్రాయం?

News February 1, 2025

బడ్జెట్ నిరాశకు గురిచేసింది: సురేఖ

image

TG: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ‘ఈ బడ్జెట్ చాలా నిరాశకు గురిచేసింది. దేశంలోని కొత్త రాష్ట్రమైన తెలంగాణకు బడ్జెట్‌లో తగినంత కేటాయింపులు రాలేదనే బాధను వ్యక్తపరచడానికి నాకు మాటలు రావడం లేదు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పంపిన అభ్యర్థనలను పట్టించుకోలేదు. తెలంగాణకు ఇచ్చిన హామీలను విస్మరించారు’ అని Xలో ఆమె ఫైరయ్యారు.

News February 1, 2025

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

స్వల్ప లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ ఈ ఉదయం 77,637.01(క్రితం 77,500.57) వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభం కాగా బడ్జెట్ నేపథ్యంలో లాభ-నష్టాల మధ్య కదలాడి చివరకు 5 పాయింట్ల లాభంతో 77,505.96వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు క్షీణించి 23,482 వద్ద రోజును ముగించింది. టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ తదితర షేర్లు నష్టాలు చవిచూశాయి.

News February 1, 2025

క్రేజీ కాంబో రిపీట్?

image

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబో రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వీరిద్దరూ కలిసి మరో సినిమా తీయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ భారీ విజయాన్ని అందుకుంది. కాగా బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా ఈ సంక్రాంతికి రిలీజై హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

News February 1, 2025

ఆదాయం రూ.25K పెరిగితే రూ.75K ట్యాక్స్

image

వార్షికాదాయం రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకొని మొత్తం రూ.12.75లక్షల వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయితే వార్షికాదాయం రూ.13 లక్షలు ఉంటే మాత్రం రూ.75వేలు పన్ను కట్టాల్సి ఉంటుంది. అంటే వార్షికాదాయం మొత్తంలో రూ.25వేలు పెరిగితే IT రూ.75వేలు కట్టాల్సి వస్తుందన్నమాట.

News February 1, 2025

140 కోట్ల మంది ఆశలు తీర్చే బడ్జెట్: మోదీ

image

ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. ఇది 140 కోట్ల మంది ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని కొనియాడారు. ఈ బడ్జెట్ ద్వారా పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని వెల్లడించారు. ప్రభుత్వాలు ఖజానాను నింపడంపైనే దృష్టి సారిస్తాయని, కానీ ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపేందుకు, సేవింగ్స్ పెంచేలా తాము రూపొందించామన్నారు. రూ.12లక్షల వరకూ పన్ను లేకపోవడం మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.

News February 1, 2025

ఇద్దరు కేంద్రమంత్రులు, 8మంది MPలు ఏం సాధించారు?: హరీశ్ రావు

image

బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయ్యి చూపారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమ్మిళిత వృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. ‘రాజకీయ అవసరాల కోసమే బడ్జెట్ ఉపయోగించుకున్నారు. ఇలాంటి వైఖరితో వికసిత్ భారత్ సాధ్యమా? ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు వరాలు ప్రకటించారు. ఇది కేవలం 3 రాష్ట్రాల బడ్జెట్‌లా ఉంది. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8మంది ఎంపీలు ఉండి ఏం సాధించారు’ అని ప్రశ్నించారు.

News February 1, 2025

కేంద్ర బడ్జెట్.. కేటాయింపులు

image

☞ వ్యవసాయం, అనుబంధ రంగాలు రూ.1.71లక్షల కోట్లు
☞ విద్య- రూ.1.28 లక్షల కోట్లు
☞ ఆరోగ్యం-రూ.98,311 కోట్లు
☞ పట్టణాభివృద్ధి-రూ.96,777 కోట్లు
☞ ఐటీ, టెలికం-రూ.95,298 కోట్లు
☞ విద్యుత్- రూ.81,174 కోట్లు
☞ వాణిజ్యం, పరిశ్రమలు- రూ.65,553 కోట్లు
☞ సామాజిక సంక్షేమం-రూ.60,052 కోట్లు