News November 6, 2024

ఈ ఏడాది నం.1గా ‘పుష్ప-2’: మైత్రీ మూవీ మేకర్స్

image

అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప-2’. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ ఏడాది IMDBలో అత్యధిక మంది ఎదురు చూస్తున్న భారతీయ చిత్రాల్లో నం.1గా పుష్ప-2 ఉందని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. కాగా ఈ నెలలో మూవీ టీజర్ రానున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.

News November 6, 2024

అంబటికి హోంమంత్రి అనిత కౌంటర్

image

AP: తాను మైక్ ముందు మాట్లాడే హోంమంత్రినే కాదని, స్త్రీ జాతిని అగౌరవపరుస్తూ మాట్లాడే వారిని లాఠీతో మక్కెలిరగ్గొట్టించే హోంమంత్రినని <<14528470>>అంబటి రాంబాబుకి<<>> అనిత కౌంటర్ ఇచ్చారు. వావివరుసలు మరిచి ఆంబోతుల్లా సోషల్ మీడియాలో విరుచుకుపడే విపరీతాలని గట్టిగా ఎదిరించే విపత్తు నిర్వహణ శాఖ మంత్రినని పేర్కొన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఉన్మాదంగా ప్రవర్తించే వారిని చట్టప్రకారం శిక్షించే హోంమంత్రినని బదులిచ్చారు.

News November 6, 2024

‘ఆమె’కు అందని ద్రాక్షలా అమెరికా

image

US ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్‌తో పోరాడిన కమల ఓడారు. దీంతో మరోసారి పురుషుడే ఆ దేశాన్ని పాలించనున్నారు. చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా US ప్రెసిడెంట్ కాలేదు. గతంలో మార్గరెట్ చేస్ స్మిత్, షెల్లీ చిసమ్ అభ్యర్థిత్వానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ దశను దాటిన హిల్లరీ క్లింటన్, కమల ఎన్నికల దశలో నిష్క్రమించారు. దీంతో ఆడవాళ్లకు అమెరికా అధ్యక్ష పీఠం అందని ద్రాక్షగా మారింది.

News November 6, 2024

నాని-ఓదెల కొత్త మూవీ పేరు ఏంటంటే?

image

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ‘దసరా’ తర్వాత రెండో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దానికి ‘పారడైజ్’ అన్న పేరును ప్రకటిస్తూ హీరో నాని ట్వీట్ చేశారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సికింద్రాబాద్‌లోని ఓ హోటల్ నేపథ్యంలో కథ జరుగుతుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. దసరా విలేజ్ బ్యాగ్రౌండ్ రస్టిక్ డ్రామా కాగా.. ఈ మూవీ సిటీలో రస్టిక్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని టాక్.

News November 6, 2024

గ్రూప్-4 అభ్యర్థుల ‘పోస్ట్ కార్డు’ నిరసన

image

TG: గ్రూప్-4 పరీక్ష తుది ఫలితాల కోసం అభ్యర్థులు వినూత్న నిరసనకు దిగారు. పరీక్ష జరిగి దాదాపు 500 రోజులు కావస్తున్నా నియామకాలు జరగకపోవడంతో TGPSCకి భారీ సంఖ్యలో పోస్ట్ కార్డుల ద్వారా వినతిపత్రాలు పంపించారు. ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెలక్షన్ లిస్ట్ విడుదల చేసి 8 వేల మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.

News November 6, 2024

ట్రంప్ సంచలన నిర్ణయం

image

అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన కాసేపటికే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా దేశం నుంచి అక్రమ వలసదారులను పంపించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన అధికార ప్రచార ప్రతినిధి కరోలిన్ వెల్లడించారు. తక్షణమే ఈ ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్లు ఆమె చెప్పారు. కాగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న 1.1 కోట్ల మందిని వెనక్కి పంపుతామని ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News November 6, 2024

అమిత్ షాతో ముగిసిన పవన్ సమావేశం

image

AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. దాదాపు 15 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా అమిత్ షాకు శ్రీవారి విగ్రహాన్ని పవన్ బహుకరించారు. ఏపీలో పరిస్థితులు, రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆయన ఏపీకి తిరిగి పయనమవుతారు.

News November 6, 2024

భారత్‌లో రూ.2.7 లక్షల కోట్లు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్ ఎవరంటే?

image

భారత స్టాక్ మార్కెట్లో అతిపెద్ద FPIగా సింగపూర్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. సావరిన్ ఫండ్స్ ద్వారా ఏకంగా రూ.2.69 లక్షల కోట్ల విలువైన షేర్లను హోల్డ్ చేసింది. 2, 3 ప్లేసుల్లోని నార్జెస్ బ్యాంక్ రూ.1.42 లక్షల కోట్లు, US క్యాపిటల్ గ్రూప్ రూ.1.33 లక్షల కోట్ల కన్నా ఇదెంతో ఎక్కువ. HDFC బ్యాంకు, RIL, ICICI బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్‌టెల్, ఇన్ఫీ, LT, NTPC, M&Mలో ఎక్కువ పెట్టుబడి పెట్టింది.

News November 6, 2024

US ఎన్నికల ఫలితాలు.. ఆ గ్రామంలో నిరాశ

image

US అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ విజయంతో తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామస్థులు నిరాశకు గురయ్యారు. కమల పూర్వీకులది అదే ఊరు కావడంతో ఆమె ఈ ఎన్నికల్లో గెలవాలని వాళ్లు పూజలు చేశారు. ఆమె గెలిచాక సంబరాల కోసం బాణసంచా సిద్ధం చేసుకున్నారు. అంచనాలకు భిన్నంగా ట్రంప్ గెలవడంతో వారు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఓడినా కమలకు మద్దతిస్తామని, ఆమెకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందంటున్నారు.

News November 6, 2024

బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి

image

AP: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్-ఛైర్మన్, ఎండీగా ఐఏఎస్ ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఆమ్రపాలి ఏపీకి వచ్చి రిపోర్ట్ చేశారు. ఆమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆమె విద్యాభ్యాసం విశాఖలో సాగింది. 2010లో ఆమె IASకు సెలెక్ట్ అయ్యారు.