News November 7, 2024

ఆ 4 దేశాలను ట్రంప్ ఎలా హ్యాండిల్ చేస్తారో?

image

USను శత్రువుగా భావించే దేశాల్లో నార్త్ కొరియా, ఇరాన్, రష్యా, చైనా ముందువరుసలో ఉంటాయి. కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఈ దేశాలను ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఆసక్తికరంగా ఉండనుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా యుద్ధాలకు ముగింపు పలికేందుకు ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు అందించే సాయాన్ని కుదించి, రష్యా, ఇరాన్‌తో ఉద్రిక్తతలకు బ్రేక్ వేస్తారని అంచనా. చైనా, నార్త్ కొరియాతో ద్వైపాక్షిక చర్చలు కొనసాగిస్తారని తెలుస్తోంది.

News November 7, 2024

బెంగళూరు పర్యటనకు హైడ్రా బృందం

image

TG: హైడ్రా బృందం రెండు రోజుల పర్యటనకు గాను బెంగళూరు వెళ్లింది. అక్కడ చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో బృందం అధ్యయనం చేయనుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో ఆక్రమణల తొలగింపుపై హైడ్రా కాస్త నెమ్మదించింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో నిఘా, రియల్ టైమ్‌లో కబ్జాలను కనిపెట్టేలా టెక్నాలజీని హైడ్రా పటిష్ఠపర్చుకుంటోంది.

News November 7, 2024

కులగణనతో లెక్క తేల్చేస్తారా!

image

తెలంగాణలో కులగణన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమయింది. ఇది జస్ట్ టైం పాస్ అంటూ బీజేపీ కొట్టిపడేస్తోంది. కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే ఏమైందంటూ ప్రశ్నిస్తోంది. ఇటు బీఆర్ఎస్ నేతలు సర్వేకు వివరాలు ఇచ్చేది లేదంటున్నారు. అయితే అన్ని వర్గాలకు సర్వేతో ఆర్థిక, విద్య, రాజకీయ అవకాశాలు మెరుగవుతాయని, రిజర్వేషన్లు పెరుగుతాయని GOVT చెబుతోంది. TGలో బీసీల లెక్క తేలుతుందని బీసీ సంఘాలు అంటున్నాయి. మరి దీనిపై మీరేమంటారు.

News November 7, 2024

ఇండియాలో IIT ఢిల్లీ టాప్

image

భారతదేశంలోని విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌‌ను QS ఆసియా విడుదలచేసింది. ఈ సంవత్సరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఢిల్లీ IIT బాంబేను అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది ఆసియాలో 46వ స్థానంలో ఉన్న IIT ఢిల్లీ, 44వ స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాతి స్థానాల్లో IIT బాంబే, IIT మద్రాస్, IIT ఖరగ్‌పూర్, IISc బెంగళూరు, IIT కాన్పూర్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, IIT గౌహతి, IIT రూర్కీ, JNU ఢిల్లీ ఉన్నాయి.

News November 7, 2024

ధ్రువ్ జురెల్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్

image

ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఇండియా ఏ ఆటగాడు ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. జట్టు 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చి ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడారు. 186 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత కాసేపటికే భారత్ 161 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో నెసెర్ 4, వెబ్‌స్టర్ 3 వికెట్లు తీశారు.

News November 7, 2024

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు

image

పసిడి కొనుగోలుదారులకు అదిరిపోయే న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.1790, 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.1650 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ రూ.78,560కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.72,000గా నమోదైంది. ఇక వెండి ధర కిలోపై రూ.3000 తగ్గి రూ.1,02,000గా ఉంది.

News November 7, 2024

కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు

image

TG: కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ కాంట్రాక్టును GOVT రద్దు చేసింది. ఆరేళ్ల నుంచి పనులు ప్రారంభించకపోవడంతో రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. గోదావరి ఫేజ్-2లో భాగంగా HYD తాగునీటి అవసరాల కోసం శామీర్‌పేట సమీపంలో దీనిని నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఉస్మాన్‌‌సాగర్, హిమాయత్ సాగర్ వరకు స్కీమ్‌ను పొడిగించి HYDకు నీరందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు GOVT తెలిపింది.

News November 7, 2024

కేసీఆర్‌పై కక్షగట్టి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?: KTR

image

TG: రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. ‘విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి కనిపించడం లేదా? విద్యాశాఖను అంటిపెట్టుకొని 11 నెలల్లో ఏం చేశారు? కాంగ్రెస్ వచ్చింది.. సకల జనులను కన్నీళ్లు పెట్టిస్తోంది. కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?’ అని ప్రశ్నించారు.

News November 7, 2024

మధ్యాహ్నం జగన్ కీలక ప్రెస్‌మీట్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా శ్రేణులపై నమోదవుతున్న కేసులపై స్పందించే అవకాశం ఉంది. ఈ కేసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా వారం రోజుల్లోనే 107 మందిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది.

News November 7, 2024

ఎస్సీలకు రూ.50,000 రాయితీతో రుణాలు

image

AP: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి విడతలో 1,732 మందికి లబ్ధి చేకూర్చనుంది. ఈ నెల 10లోగా అర్హులను ఎంపికచేయాలని అధికారులను ఆదేశించింది. నర్సరీ, విత్తనాల తయారీ, ఆటో కొనుగోలు, ఫొటో స్టూడియో, బ్యూటీ పార్లర్, చిన్న దుకాణాల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల రుణం ఇస్తారు. ఇందులో రూ.50వేల రాయితీ ఉంటుంది. వడ్డీ చెల్లింపుపై త్వరలో క్లారిటీ రానుంది.