India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చాలా మంది హెల్మెట్ ధరిస్తే జుట్టు రాలిపోతుందనుకుని బాధపడుతుంటారు. కానీ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాన్ని సరిగ్గా శుభ్రం చేయకుండా ధరిస్తే చుండ్రు, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. ఫ్రిక్షన్ వల్ల తల చర్మంపై రంధ్రాలు మూసుకుపోయి కొంత జుట్టు రాలే ప్రమాదం ఉంది. హెల్మెట్ పెట్టుకోవడానికి ముందు తలకు కర్చీఫ్ కట్టుకోవాలి. అలాగే సరైన సైజ్ హెల్మెట్ కొనుక్కోవాలి.
AP: సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత భేటీ అయ్యారు. ఇటీవల హోం మంత్రిపై పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో ముగ్గురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు, అత్యాచార ఘటనలపై పవన్ ఇటీవల అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హోంమంత్రి బాధ్యత వహించాలని, అవసరమైతే తానే ఆ బాధ్యతలు చేపడతానని పవన్ అన్నారు. కాగా నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సైతం పవన్ భేటీ అయ్యారు.
బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడాకుల రూమర్ల నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిషేక్, ఐశ్వర్య జంటగా మణిరత్నం ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. హిందీలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు టాక్. గతంలో ఆయన దర్శకత్వంలో గురు, రావన్ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. కాగా అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
తీవ్రమైన వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అక్కడ AQI 300-350 మధ్య నమోదవుతోంది. ఇదిలా ఉంటే దేశంలోనే స్వచ్ఛమైన గాలి దొరికే ప్రదేశంగా సిక్కిం రాజధాని గాంగ్టక్ నిలిచింది. అక్కడ AQI 29 మాత్రమే. ఆ తర్వాతి స్థానాల్లో ఐజ్వాల్-మిజోరాం(32), మంగళూరు(32), తిరునెల్వేలి(35), చామరాజనగర్(40), కోలార్(40), కలబురగి(41), ఉడుపి(45), త్రిస్సూర్(46), ట్యుటికోరిన్(46), కొల్లామ్(48) ఉన్నాయి.
AP: సచివాలయంలో <<14547237>>మార్పులపై<<>> మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. వాస్తు పిచ్చితో రేవంత్ రెడ్డి పూటకో మార్పు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్క గేటు మార్పు కోసం రూ.3.2కోట్ల దుబారా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రీన్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీ నార్మ్స్తో సచివాలయాన్ని నిర్మించామని తెలిపారు. కాగా సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం ప్రధాన ద్వారంను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మహారాష్ట్ర ఎన్నికల్లో నేతలు విచిత్రమైన హామీలు ఇస్తున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని బ్యాచిలర్స్కు పెళ్లిళ్లు చేయించి జీవనోపాధి కల్పిస్తానని పర్లీ NCP (SCP) అభ్యర్థి రాజాసాహెబ్ దేశ్ముఖ్ హామీ ఇవ్వడం వైరల్గా మారింది. మంత్రి, తన ప్రత్యర్థి ధనంజయ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉపాధి కల్పించకపోవడంతో వారికి పెళ్లిళ్లు కావడం లేదని విమర్శించారు. దీనిపై మీడియా వివరణ కోరగా దేశ్ముఖ్ అందుబాటులోకి రాలేదు.
ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత చదువులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించేందుకు కేంద్రం <<14544821>>పీఎం విద్యాలక్ష్మి<<>> పథకాన్ని ప్రకటించింది. ఇందులో రూ.7.5 లక్షల లోపు రుణాలకు 75% క్రెడిట్ గ్యారంటీ ఉంటుంది. రూ.10 లక్షల వరకు రుణాలకు 3% వడ్డీ రాయితీ వర్తిస్తుంది. అయితే వార్షిక ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉన్నవారికే స్కీమ్ వర్తిస్తుంది. ఇతర ప్రభుత్వ స్కాలర్షిప్లు, వడ్డీ రాయితీ పథకాలు పొందుతున్న వారు అనర్హులు.
సంపదను సృష్టించడం గొప్పకాదు. ఆ సంపదను పేదలకు దానం చేసే మనసుండటం గొప్ప. అలా తమ సంపదను దాతృత్వంతో విరాళంగా ఇచ్చిన బిలియనీర్లు ఎవరో తెలుసుకుందాం. ఇండియాకు చెందిన జమ్షెడ్జీ టాటా ఏకంగా $102.4 బిలియన్లు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత బిల్ గేట్స్($75.8 బిలియన్), వారెన్ బఫెట్ ($32.1 బిలియన్), జార్జ్ సోరోస్($32B), అజీమ్ ప్రేమ్జీ($21B), మైఖేల్ బ్లూమ్బెర్గ్($12.7B), ఎలాన్ మస్క్($7.6B) ఉన్నారు.
TG: మాజీ మంత్రి, BRS MLA మల్లారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. పీజీ మెడికల్ సీట్లను అక్రమంగా బ్లాక్ చేశారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. గత ఏడాది జూన్లో మల్లారెడ్డికి చెందిన 12 మెడికల్ కాలేజీల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. పలు కీలక డాక్యుమెంట్లు, పెన్డ్రైవ్లు, హార్డ్డిస్క్లను స్వాధీనం చేసుకుంది. వాటిని పరిశీలించిన అనంతరం నోటీసులిచ్చింది.
బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ పెద్ద, నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్కు డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపిస్తారని నిపుణుల అంచనా. 2016లో ట్రంప్ గెలిచాక బంగ్లా డెలిగేట్స్ ఆయన్ను కలిశారు. అప్పుడు ఆయన ప్రత్యేకంగా యూనస్ను గుర్తుచేశారు. ‘ఆ ఢాకా మైక్రో ఫైనాన్స్ వ్యక్తి ఎక్కడ? నేను ఓడిపోవాలని ఆయన విరాళం ఇచ్చినట్టు విన్నాను’ అని హసీనాకు షాకిచ్చారు. బంగ్లాలో హిందువులపై దాడి, ఇతర అంశాలపై ట్రంప్ సీరియస్గా ఉన్నారు.
Sorry, no posts matched your criteria.