India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఆడబిడ్డల ఆకాంక్షలను నెరవేర్చాలనే సంకల్పంతో ‘మహాలక్ష్మీ’ పథకాన్ని ప్రకటించామని CM రేవంత్ అన్నారు. ‘మహాలక్ష్మీ పథకాన్ని ఉపయోగించుకుని విద్యార్థినులు మైదానాలకు వెళ్లి స్పోర్ట్స్ నేర్చుకుంటున్నారు’ అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు CM రిప్లై ఇచ్చారు. ‘ఈ మహాలక్ష్ములను చూస్తుంటే మా ఉద్దేశం నెరవేరుతోందని అర్థమవుతోంది. చాలా సంతోషం. వీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నా’ అని పేర్కొన్నారు.
లైగర్, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ల తర్వాత పూరీ జగన్నాథ్ కొత్త ప్రాజెక్టుపై దృష్టిసారించారు. ఇందులో హీరో సందీప్ కిషన్ నటిస్తారని తెలుస్తోంది. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఇతనికి కూడా సరైన విజయం దక్కలేదు. దీంతో సందీప్ మేనమామ శ్యామ్ కె.నాయుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. స్నేహితుడు పూరీతో కలిసి మూవీని పట్టాలెక్కిస్తున్నారని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
AP: YCP కార్యకర్తలను అరెస్ట్ చేసే కొందరు కుల పిచ్చి అధికారులు, TDP నేతలు 2027లో ఫలితం అనుభవించాల్సి ఉంటుందని MP విజయసాయిరెడ్డి అన్నారు. ఇందుకు తయారుగా ఉండాలని ఆయన చెప్పారు. ‘పైశాచిక పోస్టులు పెడుతున్న TDP సైకోలకు చెక్ పెట్టరా? ఖాకీలు, YCP సోషల్ మీడియా కార్యకర్తలను నెల రోజుల్లో సెట్ చేస్తాననడం అధికార అహంకారమే. కడప SPపై వేటుతో TDP తన కుల విధానంపై క్లారిటీ ఇచ్చేసిందా?’ అని ఎక్స్లో ట్వీట్ చేశారు.
రంజీ ట్రోఫీలో భాగంగా ఒడిశాతో మ్యాచులో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ చేశారు. 201 బంతుల్లో 22 ఫోర్లు, 8 సిక్సులతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన మూడో డబుల్ హండ్రెడ్ను నమోదు చేశారు. రంజీల్లో ఆయనకి ఇది రెండో డబుల్ సెంచరీ కాగా, మొదటిది 2015లో చేశారు. ఇటీవల మహారాష్ట్రతో మ్యాచులోనూ ఆయన సెంచరీతో రాణించారు. దీంతో అయ్యర్ త్వరలోనే జాతీయ జట్టులోకి తిరిగి రావొచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లో 1,000 పోస్టుల(కాంట్రాక్ట్) భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ ఉత్తీర్ణులై, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 01-10-2024 నాటికి 20-25 ఏళ్లు ఉండాలి. డిసెంబర్ 1న ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి రూ.29,000-31,000 వేతనం ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
వెబ్సైట్: https://www.idbibank.in/
దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. చిరు వ్యాపారుల దగ్గర కూడా UPI పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. UPI, డిజిటల్ చెల్లింపుల కారణంగా భారతీయ బ్యాంకులు ATM మెషీన్లను మూసివేసే స్థితికి చేరుకున్నాయి. గత ఏడాదిలోనే 4000 ATM మెషీన్లు మూతపడినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ₹34.70 లక్షల కోట్ల నగదు చలామణి ఉంది. కాగా, దేశంలో లక్ష మందికి 15 ATMలు మాత్రమే ఉన్నాయి.
AP: ఏలూరులోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి డా.యల్లాప్రగడ సుబ్బారావు మెడికల్ కాలేజీగా నామకరణం చేసినట్లు మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. వైద్య శాస్త్ర రంగానికి సుబ్బారావు అందించిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ ఆయన పేరును ప్రతిపాదించారని, దీనికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.
అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకొనే USలో ఓటింగ్ నిబంధనల్లో యూనిఫామిటీ లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఓటేసే ముందు ఓటర్ ఫొటో ఐడీ ప్రూఫ్ చూపించడం ఏ దేశంలోనైనా కామన్. USలో మాత్రం అలాకాదు. 15 స్టేట్స్లో ప్రూఫ్ అవసరమే లేదు. మరికొన్ని రాష్ట్రాల్లో ఏదో ఓ ప్రూఫ్ చాలు ఫొటో లేకున్నా ఫర్లేదు. అలాంటప్పుడు ఓటర్ అమెరికనో, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంటో తెలిసేదెలా? అందుకే రిపబ్లికన్స్ దీనిని వ్యతిరేకించారు. మీరేమంటారు?
డొనాల్డ్ ట్రంప్ విజయానికీ ఓటర్ ఐడీ కార్డులకూ లింక్ కనిపిస్తోంది. CA, NYC, WDC సహా అక్కడ 15 స్టేట్స్లో ఓటేసేందుకు ఎలాంటి ప్రూఫ్ అవసరం లేదు. మిగిలిన స్టేట్స్లో చాలా వరకు ఫొటో ID, కొన్నింట్లో ఏదో ఒక ID అవసరం. ఎలాంటి ప్రూఫ్ అవసరం లేని స్టేట్స్ను కమలా హారిస్ (DEM) గెలిచారు. ప్రూఫ్ అవసరమైన స్టేట్స్ను ట్రంప్ (REP) స్వీప్ చేశారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంశం ఎంత సీరియస్సో దీన్ని బట్టి తెలుస్తోంది.
సినీ ఇండస్ట్రీలో గ్లామర్తో పాటు తనదైన నటనతో ఆకట్టుకున్న అందాల తార అనుష్కశెట్టి. 1981 NOV 7న కర్ణాటకలోని మంగళూరులో స్వీటీ జన్మించారు. సూపర్ సినిమాతో అరంగేట్రం చేశారు. విక్రమార్కుడితో హిట్ అందుకున్న తర్వాత టాప్ హీరోయిన్గా ఎదిగారు. అరుంధతి సినిమా ఆమె కెరీర్ను మలుపుతిప్పింది. బాహుబలిలో ధీరవనిత దేవసేన పాత్రతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో అలరించారు.
Sorry, no posts matched your criteria.