India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో అర్ధరాత్రి <<15295646>>తొక్కిసలాట<<>> జరిగి పలువురు మహిళలు, చిన్నారులు గాయపడ్డారు. ఘటనాస్థలంలో భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. కొంతమంది మహిళల మృతదేహాలు ఆసుపత్రి ఫ్లోర్లో ఉన్నాయంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమం వద్ద తొక్కిసలాటపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్కు ఫోన్ చేశారు. సహాయ చర్యలపై ఆరా తీశారు. పరిస్థితులను సమీక్షించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరారు. అంతకు ముందు తొక్కిసలాట జరిగిందని తెలియగానే మోదీ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. ఇసుకేస్తే రాలనంత జనం రావడంతో 13 అఖాడాల సాధువులు నేడు పవిత్ర స్నానాలను వాయిదా వేసుకున్నారు.

జైళ్ల రిజిస్టర్లలో కులం కాలమ్ తొలగించాలని తాము 3 నెలల క్రితమే ఆదేశించినప్పటికీ కేంద్రం, 11 రాష్ట్రాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. AP సహా 11 రాష్ట్రాలు బ్రిటిష్ కాలం నాటి జైలు మాన్యువల్ వాడుతున్నాయని దాఖలైన ఓ పిటిషన్ను 3 నెలల క్రితం సుప్రీం విచారించింది. ఆ సమయంలో జారీ చేసిన ఆదేశాలను రాష్ట్రాలు ఇంకా అమలు చేయలేదని, 3వారాల్లో పురోగతి నివేదించాలని ఆదేశించింది.

కెనడాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తమ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందన్న రిపోర్టును ఖండించింది. నిజానికి వాళ్లే భారత అంతర్గత వ్యవహారాల్లో నిరంతరం జోక్యం చేసుకుంటారని ఎదురుదాడి చేసింది ‘ఆ రిపోర్టు అబద్ధాల పుట్ట. వ్యవస్థీకృత నేరాలు, అక్రమ వలసదారులకు అనువైన వాతావరణాన్ని ఇది సృష్టిస్తోంది. మాపై ఆరోపణలను ఖండిస్తున్నాం. ఇకపై అక్రమ వలసదారులను ప్రోత్సహించకుండా ఉంటారని ఆశిస్తున్నాం’ అని MEA తెలిపింది.

మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరాతీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడారు. కేంద్రం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. భక్తులు ఇబ్బంది పడకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. త్రివేణి సంగమం వద్ద ఓ ఘాట్లో రాత్రి 2 గంటలకు అపశ్రుతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

మహిళలను 296 పేర్లతో మనం పిలవొచ్చు. వాటిలో కొన్ని అంగన, అంబుజవదన, అక్క, అతివ, అబల, అలరుబోడి, ఆడది, ఆడగూతురు, ఇంతి, ఇందువదన, కనకాంగి, కలికి, కాంత, కూచి, కేశిని, కొమ్మ, కోమలాంగి, కోమలి, గరిత, గుబ్బలాడి, గుమ్మ, చెలి, చెలియ, జని, తరుణి, తీయబోడి, తెలిగంటి, నాంచారు, నాతి, నారి, నెచ్చెలి, పడతి, పుత్తడిబొమ్మ, పూబోడి, ప్రియ, బాగులాడి, మగువ, మహిళ, మానిని, ముద్దుగుమ్మ, రమణి, రూపసి, లలన, వధువు, వనిత, సుందరి.

పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా పుణ్య నదుల్లో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదిలితే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. నదికి వెళ్లలేని వారు బావి వద్ద స్నానం చేయాలి. గంగామాతను పూజించి హారతి ఇవ్వాలి. శివాలయాలకు వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. అవకాశం ఉంటే మౌన వ్రతం పాటించాలి. సామర్థ్యం మేరకు దానం చేయాలి.

AP: రాష్ట్ర నూతన డీజీపీగా మరోసారి హరీశ్ కుమార్ గుప్తా పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ కాలం ఎల్లుండితో ముగియనుండటంతో హరీశ్ పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం గుప్తా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ DGగా ఉన్నారు. గత ఎలక్షన్ల సమయంలో హరీశ్ను ఎన్నికల సంఘం DGPగా నియమించిన విషయం తెలిసిందే.

TG: పంచాయతీ రాజ్ శాఖపై సీఎం రేవంత్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఆ శాఖలో పెండింగ్ జీతాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నేడు దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారా? ఏదైనా ప్రకటన చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

టీమ్ ఇండియా క్రికెటర్ వరుణ్ చక్రవర్తి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. టీ20ల్లో రెండు ఓటముల్లో 5 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బౌలర్గా రికార్డులకెక్కారు. ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో ఆయన ఈ ఫీట్ సాధించారు. 2024లో సౌతాఫ్రికాపై ఓడిన మ్యాచులోనూ 5 వికెట్ల ప్రదర్శన చేయగా వృథాగా మారింది. ఇండియా గత 31 మ్యాచుల్లో మూడింట్లో ఓటమి పాలైంది. అందులో ఈ రెండు మ్యాచులు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.