India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తాను కుంభమేళాకు వెళ్లానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ కావడంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. తప్పుడు ప్రచారం చేసి పవిత్ర పూజలను కలుషితం చేయడమే పిరికి వాళ్ల పని అని దుయ్యబట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మిగతాది కోర్టులో చూసుకుందామని రాసుకొచ్చారు.

జనవరి 30 నుంచి మాఘ మాసం ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలుకానుంది. జనవరి 31 నుంచి మే వరకు భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి. FEB-2,3,7,13,14,15,18,19,20,21,23,25, MARలో-1,2,6,7,12, APRలో 14,16,18,19,20,21, 25,29,30, MAYలో 1,5,6,8,15,17,18, జూన్లో 1,2,4,7 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ తేదీల్లో చాలా జంటలు ఏకమయ్యే అవకాశం ఉంది.

TG: రిపబ్లిక్ డే రోజున హుస్సేన్ సాగర్లో బోట్లు దగ్ధమైన ఘటనలో గల్లంతైన అజయ్ మృతదేహం లభించింది. రెండు రోజుల గాలింపు తర్వాత డీఆర్ఎఫ్ బృందాలు మృతదేహాన్ని వెలికితీశాయి. అజయ్ అచూకీ తెలియడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. అంతకుముందు ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణపతి మరణించాడు.

AP: రాష్ట్ర ప్రజలకు వైసీపీ కీలక విజ్ఞప్తి చేసింది. కూటమి ఫైల్స్ పేరుతో ఇవాళ రాత్రి 9 గంటలకు ఓ వీడియోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. బయటకు మాట్లాడలేని వారికి తాము ఓ స్వరంగా ఉంటామని పేర్కొంటూ #YSRCPSecondCampaign, #YSRCPForThePeople, #VoiceOfTheVoiceless హ్యాష్ట్యాగ్లను జత చేసింది.

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘వార్-2’ చిత్రానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. హిందీలో రణ్బీర్ కపూర్ ఇస్తారని తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఇప్పటికే ‘బాద్ షా’ సినిమాకు మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

AP: స్కూళ్లలో ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా పాటించాలని అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. బ్యాగ్ లేకుండానే ఆరోజు స్కూలు జరిగేలా కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలన్నారు. టీచర్లకు ఇప్పుడున్న అనేక యాప్ల స్థానంలో ఒకటే యాప్ను రిలీజ్ చేస్తామని చెప్పారు. GO 117 ఉపసంహరణపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని తెలిపారు. టీచర్ల బదిలీ చట్టంపైనా అభిప్రాయాలు సేకరిస్తామని లోకేశ్ పేర్కొన్నారు.

U19 ఉమెన్స్ వరల్డ్ కప్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించిన భారత ప్లేయర్ త్రిషకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందనలు తెలిపారు. భద్రాచలంకు చెందిన త్రిష భారత్ విజయంలో కీలక పాత్ర పోషించడం గర్వకారణమని సీఎం ట్వీట్ చేశారు. తెలంగాణ బిడ్డలు ప్రపంచస్థాయిలో రాణించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు సంకల్పించామని పేర్కొన్నారు.

TG: హనుమకొండ జిల్లా గోపాల్పూర్లో దారుణం జరిగింది. భరత్ అనే యువకుడిపై ఓ యువతి(17) తండ్రి దాడి చేసి గొంతు కోశాడు. యువకుడు ఆ యువతితో కలిసి ఇంట్లో ఉండగా చూసిన ఆమె తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. దీన్ని అవమానంగా భావించిన యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు లేని సమయంలో యువతిని కలిసేందుకు భరత్ వెళ్లినట్లు సమాచారం.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. Jan 31న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. అనంతరం రెండో విడత సమావేశాలు మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి.

AP: సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేమని సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. ‘దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర ఎకానమీపై సీఎం మాట్లాడారు. అంతేగానీ పథకాలు అమలు చేయలేమని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దు’ అని ట్వీట్ చేసింది.
Sorry, no posts matched your criteria.