News April 18, 2024

సీఎం జగన్ నేటి బస్సు యాత్ర షెడ్యూల్

image

AP: సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజైన ఇవాళ్టి షెడ్యూల్‌ను YCP విడుదల చేసింది. తేతలి నుంచి ఉ.9 గంటలకు బయల్దేరనున్న ఆయన.. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట, చర్చి సెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం చేరుకొని ఇవాళ రాత్రికి అక్కడ బస చేస్తారు.

News April 18, 2024

జువైనల్ హోం నుంచి 8మంది పరారీ

image

TG: మేడ్చల్ జిల్లా గాజులరామారంలో జువైనల్ హోం నుంచి 8మంది పరారు కావడం సంచలనంగా మారింది. వివిధ నేరాల్లో ప్రమేయమున్న 32మంది బాలురు ఈ హోంలో ఆశ్రయం పొందుతున్నారు. కాగా.. మధ్యాహ్నం పాలు తాగే సమయంలో గందరగోళం సృష్టించారు. ఒకరు కాపలాదారుడిని తోసుకొని పారిపోగా.. మరో 7మంది తరగతిలోని గ్రిల్స్ తొలగించి పరారయ్యారు. అక్కడి సిబ్బంది సస్పెండ్ అయ్యారు.

News April 18, 2024

ALERT.. 3 రోజులు వర్షాలు

image

AP: ఉపరితల ద్రోణి కారణంగా రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించింది. ఇవాళ అల్లూరి, తూ.గో, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడతాయంది. రేపు ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

News April 18, 2024

పర్యావరణ మార్పు.. 2050 నాటికి ఏటా $38 ట్రిలియన్ల ఖర్చు?

image

పర్యావరణ మార్పుల ప్రభావంతో 2050 నాటికి ఏటా $38 ట్రిలియన్ల ఆర్థిక భారం పడనుందని జర్మనీకి చెందిన పాట్స్‌డ్యామ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. ‘ఉత్పాదకత క్షీణించడం సహా వ్యవసాయం, మౌలికవసతులు, ఆరోగ్య రంగాలు దెబ్బతింటాయి. 2050కి ప్రపంచ GDP 17% నష్టపోతుంది. దీనితో పోలిస్తే పర్యావరణ పరిరక్షణకు అయ్యే ఖర్చు ($6 ట్రిలియన్లు) తక్కువ. సత్వర చర్యలు చేపడితే నష్టాన్ని నివారించవచ్చు’ అని సూచించింది.

News April 18, 2024

ఎన్నికలకు వేళాయె..

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 4వ విడతలో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈరోజు రానుంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దించాయి. ప్రచారం మొదలుపెట్టాయి. ఇరు రాష్ట్రాల్లోనూ ఎన్నికల పోరు ప్రాంతీయ పార్టీలుvsజాతీయ పార్టీలుగా మారనుంది. ఇప్పటికే తెలంగాణలో BRSను కాంగ్రెస్ ఓడించిన విషయం తెలిసిందే. BJP సైతం YCPని గద్దె దించేందుకు TDP, JSతో కలిసింది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 18, 2024

నేటి నుంచి నామినేషన్లు

image

APలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని 17పార్లమెంటు స్థానాలు, ఒక MLA స్థానంలో ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసుకోవచ్చు. ఉ.11-మ.3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం సెలవు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో తెలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి.

News April 18, 2024

ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ఇలా

image

☞ నోటిఫికేషన్ విడుదల- ఏప్రిల్ 18
☞ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం- ఏప్రిల్ 18
☞ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ- ఏప్రిల్ 25
☞ నామినేషన్ల స్క్రూటినీ- ఏప్రిల్ 26
☞ నామినేషన్ల ఉపసంహరణకు గడువు- ఏప్రిల్ 29
☞ పోలింగ్- మే 13
☞ ఓట్ల లెక్కింపు- జూన్ 4
☞ ఎన్నికల కోడ్ ముగింపు- జూన్ 6

News April 18, 2024

భారత్‌లో మస్క్ $3 బిలియన్ల పెట్టుబడి?

image

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారత్‌లో $2-3 బిలియన్లు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారట. భారత్ పర్యటన సందర్భంగా మస్క్ ఈ పెట్టుబడులపై వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ మొత్తం దేశంలో టెస్లా ఫ్యాక్టరీ స్థాపనకు వినియోగించే అవకాశం ఉంది. ప్రధాని మోదీతో మస్క్ భేటీ అనంతరం దీనిపై క్లారిటీ రానుందట. అమెరికా, చైనాలో టెస్లాకు సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్‌లో మార్కెట్‌ను విస్తరించాలని మస్క్ భావిస్తున్నారు.

News April 18, 2024

బీజేపీ కార్యకర్తను హత్య చేసిన మావోలు!

image

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మావోలు రెచ్చిపోయారు. ఫరస్‌గావ్ డిప్యూటీ సర్పంచ్, BJP కార్యకర్త పంచమ్ దాస్‌ను హతమార్చారు. పోలీసులకు సహకరిస్తున్నాడన్న నెపంతో అతడిని మంగళవారం హత్య చేశారు. కాంకేర్ ఆపరేషన్‌లో 29 మంది నక్సల్స్ హతమైన కొన్ని గంటలకే ఈ హత్య జరగడంతో ఇది ప్రతీకార చర్య కావొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా 2023 FEB నుంచి ఇప్పటివరకు 9 మంది BJP కార్యకర్తలను నక్సల్స్ హత్య చేశారు.

News April 18, 2024

IPLలో నేడు ఆసక్తికర మ్యాచ్

image

IPL ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసే కీలక దశకు చేరుకుంది. దీంతో పాయింట్స్ టేబుల్‌లో అడుగున ఉన్న జట్లు ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇందులో భాగంగా 8వ స్థానంలో ఉన్న పంజాబ్‌, 9వ స్థానంలోని ముంబైతో నేడు తలపడనుంది. ఇరు జట్లూ ఆరేసి మ్యాచులు ఆడి 2 గెలిచాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. హెడ్ టు హెడ్ రికార్డు 16-15 MIవైపే ఉంది.