India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైసీపీ నేతలను తన్ని తరిమేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ‘మా కులాల నేతలతోనే మమ్మల్ని తిట్టిస్తున్నారు. మాలో మేమే కొట్టుకునేటట్లు చేస్తున్నారు. వైసీపీ పాలనలోనే బాబు, లోకేశ్పై కేసులు ఎక్కువగా పెట్టారు. ఓడిపోతామన్న బాధలోనే జగన్ కోపంతో ఉన్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ నేతలకు తగిన శిక్ష విధిస్తాం’ అని ఆయన హెచ్చరించారు.
ఉద్యోగ భవిష్య నిధి నుంచి నగదు ఉపసంహరించుకోవడంలో ఈపీఎఫ్వో కీలక మార్పు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటోక్లెయిమ్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచింది. నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా, ఆపరేషన్ చేయించుకున్నా ఈ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. ప్యారాగ్రాఫ్ 68జే ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పుడు ఖాతాదారు ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండానే ఈ నగదుని పొందొచ్చు.
CM జగన్కు భయం చూపెట్టాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘నన్ను భీమవరం నుంచి ఎందుకు మారారు అని జగన్ ప్రశ్నిస్తున్నారు. మరి జగన్ ఎందుకు 75 మంది అభ్యర్థులను మార్చారు? మత్స్యకారుల పొట్ట కొట్టారు. RTC, విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఉపాధి హామీ పథకంలో ఎక్కువ అక్రమాలు APలోనే జరిగాయి. పోలీసుల శ్రమను కూడా దోచుకున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. ఏ వర్గమూ సంతోషంగా లేదు’ అని ఆయన విమర్శించారు.
దేశంలో అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాల్లో IAS ఒకటి. చిన్ననాటి నుంచి ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంతో కృషి చేసే వారు లక్షల్లోనే ఉంటారు. అయితే ఈ ఉద్యోగం సాధించిన వారికి ప్రాథమిక వేతనం నెలకు రూ.56,100. జీతంతో పాటు DA, HRA, TA ఇతర ప్రత్యేక అలవెన్స్లు కూడా పొందుతారు. స్థాయి పెరిగే కొద్దీ వేతనంలో మార్పులుంటాయి. ఇక కేంద్ర కేబినెట్ సెక్రటరీ ర్యాంకులో ఉన్న ఉద్యోగికి నెలకు రూ.2.50 లక్షల వేతనం ఉంటుంది.
TG: పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇటీవలే వెంకటేశ్ నేత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. మరోవైపు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను ఆ పార్టీ ఎంపిక చేసింది. దీంతో అసంతృప్తికి గురైన వెంకటేశ్ ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్లు టాక్.
తమ సినిమాలకు సంబంధించి వదంతుల్ని నమ్మొద్దని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పేర్కొన్నారు. ‘మేం నిర్మించే, డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా అనౌన్స్ చేస్తాం. దయచేసి వదంతుల్ని నమ్మకండి’ అని ట్వీట్ చేశారు. అయితే, ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ థియేట్రికల్ రైట్స్ను ‘సితార’ సంస్థే కొనుగోలు చేసిందంటూ జరుగుతున్న ప్రచారం గురించే ఆయన స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది.
బిజు జనతాదళ్ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హింజీలీ స్థానంతో పాటు బలాంగీర్ జిల్లాలోని కాంటాబాంజీ నుంచి బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. 2019లోనూ ఆయన హింజీలీతో పాటు బిజేపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. కాగా ఈ రాష్ట్రంలో 147 నియోజకవర్గాలకు గాను నాలుగు దశల్లో(మే 13, 20, 25, జూన్1 తేదీల్లో) ఎన్నికలు జరగనున్నాయి.
IPL మ్యాచ్ టికెట్ల ధర బెంగళూరులోనే అత్యధికంగా ఉంది. చిన్నస్వామి స్టేడియంలో కనిష్ఠ ధర రూ.2,300 కాగా గరిష్ఠ ధర రూ.52,938. లక్నో, గుజరాత్లో కనిష్ఠ టికెట్ ధర రూ.499 మాత్రమే. ఇక హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కనిష్ఠ ధర రూ.750 కాగా గరిష్ఠ ధర రూ.30,000. అయితే టికెట్ల ధర ఎంతున్నా ఆన్లైన్లోకి రాకముందే బ్లాక్ మార్కెట్లోకి వెళ్తున్నాయన్న విమర్శ ఉంది. టికెట్ల అమ్మకాన్ని పేటీఎం చేపడుతున్న సంగతి తెలిసిందే.
ఉ.కొరియా నియంత కిమ్జోంగ్ ఉన్ గురించి ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అతడికి రహస్య ప్రేమికురాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆమె ఎవరో కాదు.. కిమ్ సెక్రటేరియట్లో పనిచేసే హ్యోన్ సాంగ్ వోల్. గత వారం ప్యాంగ్యాంగ్లో కిమ్తో ఆమె కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా కుమారుడు కూడా జన్మించినట్లు ద.కొరియా అధికారి చెప్పారు. అతడికి కిమ్ ఇల్ బాంగ్ అనే పేరు పెట్టారట.
తెలంగాణ ప్రజారవాణా సంస్థ ఆర్టీసీ పచ్చళ్ల సరఫరాకు ముందుకొచ్చింది. కార్గో సేవల్లో భాగంగా అమ్మమ్మ పెట్టిన ఆవకాయ పచ్చడిని వారి కుటుంబీకులకు సురక్షితంగా చేరవేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా 24 గంటల్లో డెలివరీ చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.