India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డొనాల్డ్ ట్రంప్ పాలసీలకు తగినట్టు భారత్ ప్రణాళికలు వేసుకుంటోంది. USతో అనవసరంగా ట్రేడ్వార్ తెచ్చుకోకుండా ఉండేందుకు 18,000 అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. 2 దేశాలూ కలిసి వీరిని గుర్తించాయి. స్టూడెంట్, వర్క్ వీసాలతో లీగల్గా అక్కడికి వెళ్లినవారికి అడ్డంకులు రావొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. లేదంటే వీసాలు, గ్రీన్కార్డులు తగ్గించి ట్రంప్ తిప్పలు పెట్టొచ్చు.

సైకాలజిస్టుల ప్రకారం మీతో రిలేషన్ను మీ పార్ట్నర్ ముగించాలని డిసైడ్ అయితే ఇలా తెలుస్తుంది
– ఒకప్పటిలా మీతో సన్నిహితంగా ఉండకపోవడం/ సరిగా స్పందించకపోవడం/ కారణాలు ఎక్కువ చెప్పడం/ గొడవలు పెరగడం/కేరింగ్ & షేరింగ్ తగ్గడం
– తనతో ఫ్యూచర్ గురించి చెబితే అనాసక్తి చూపడం
– క్లోజ్ రిలేషన్ కాకుండా ఫార్మల్గా ఉండటం
– మరొకరితో పోల్చడం, ఇతరుల గురించి మాట్లాడటం
– ప్రతి విషయాన్ని గుచ్చి చూడటం, లెక్కగట్టడం

యుజ్వేంద్ర చాహల్ పనైపోయినట్టేనని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. CT సిరీసుకు ఎంపిక చేయకపోవడం ద్వారా BCCI, టీమ్ మేనేజ్మెంట్ అతడి కథను ముగించిందని పేర్కొన్నారు. వికెట్లు తీస్తున్నప్పటికీ రెండేళ్ల క్రితమే అతడిని వన్డేల నుంచి తప్పించారని గుర్తుచేశారు. ‘దేశవాళీ క్రికెట్ ఆడకపోవడంతో పొట్టి ఫార్మాట్లోనూ ఎంపిక చేయడం లేదు. ఇంత గ్యాప్ తర్వాత మళ్లీ అతడిని ఎంపిక చేస్తే తిరోగమన చర్యే అవుతుంది’ అన్నారు.

TG: హైడ్రా, మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. రియల్టర్ల పేరుతో కొందరు దౌర్జన్యాలకు దిగుతున్నారని, పహిల్వాన్లను పెట్టి స్థానికులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పోచారం <<15213239>>ఘటనపై <<>>కలెక్టర్, సీపీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టినట్లు చెప్పారు. అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే DOPTకి ఫిర్యాదు చేస్తామని ఈటల హెచ్చరించారు.

ఇవాళ భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 జరిగే కోల్కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలించనుంది. బౌండరీ చిన్నగా ఉండటంతో పరుగుల వరద పారనుంది. వాతావరణం విషయానికొస్తే రాత్రి పొగమంచు కురుస్తుంది. దీనివల్ల బంతి త్వరగా తడిగా మారి బౌలర్లకు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. ఇది బ్యాటర్లకు ప్లస్ కానుంది. ఇక ఈడెన్ గార్డెన్స్ వద్ద వర్షం కురిసే అవకాశం లేదని అక్కడి వాతావరణ కేంద్రం తెలిపింది.

టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలంగా తెలుగు సినిమాల్లో నటించట్లేదు. హిందీలోనూ అదే పరిస్థితి. ఇటు మీడియాకూ ఆమె దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె WPBL చెన్నై సూపర్ ఛాంప్స్ జెర్సీ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఫొటోలను ఇన్స్టాలో పంచుకున్నారు. ఇటీవల ఆమె చికున్ గున్యా నుంచి కోలుకున్నారు. ఆమె చాలా సన్నపడ్డారని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

కర్ణాటకలోని బీదర్, HYDలోని అఫ్జల్గంజ్లో <<15172705>>కాల్పులు<<>> జరిపిన దుండగులు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆ రోజు రాత్రి ఇద్దరు దొంగలు తిరుమలగిరి నుంచి శామీర్పేట్ వరకు ఆటోలో ప్రయాణించినట్లు గుర్తించారు. ఆ తర్వాత మరో షేర్ ఆటోలో గజ్వేల్కు, లారీలో ఆదిలాబాద్కు చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బిహార్ వెళ్లారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

టీమ్ఇండియా జెర్సీలపై హోస్ట్నేమ్ పాకిస్థాన్ను ముద్రించకుండా ఉండేందుకు ICC అనుమతించలేదని తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిబంధనలను అన్ని దేశాలూ పాటించాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం. జెర్సీలపై టోర్నీ లోగోలను ముద్రించడం టీమ్స్ బాధ్యతని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. BCCI రిక్వెస్ట్ను తిరస్కరించిందని, ఒకవేళ హోస్ట్నేమ్ ముద్రించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.

AP: దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వివరించనున్నారు. అనంతరం యూనిలీవర్, డీపీ వరల్డ్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈవోలతో సీఎం భేటీ అవుతారు.

హైదరాబాద్లోని స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప-2 సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో మేకర్స్ ఇళ్లపై నిన్నటి నుంచి రైడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ చిత్ర డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు దిల్ రాజు ఇల్లు, కార్యాలయంలోనూ రైడ్స్ కొనసాగుతున్నాయి.
Sorry, no posts matched your criteria.