News April 1, 2024

BIG BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో 8 సార్లు టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు A4 రాధాకిషన్‌రావు రిమాండు రిపోర్టులో వెల్లడైంది. టాస్క్‌ఫోర్స్ టీమ్‌కు ఈయనే వాహనాలను సమకూర్చినట్లు తేలింది. BRS కోసమే వీరు డబ్బులు తరలించారట. అటు ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయన వెల్లడించినట్లు సమాచారం.

News April 1, 2024

మార్చి నెలలో రూ.1.78లక్షల కోట్ల GST

image

మార్చిలో రూ.1.78లక్షల కోట్ల GST వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11.5శాతం ఎక్కువ. గరిష్ఠంగా ఫిబ్రవరిలో 12.5శాతం వృద్ధి నమోదైంది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్‌టీలో వృద్ధి (17.6%) నమోదు కావడం వల్ల కలెక్షన్లు పెరిగాయని కేంద్రం తెలిపింది. FY24లో జీఎస్‌టీ కలెక్షన్లు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11.7% పెరిగి రూ.20.14లక్షల కోట్లు వచ్చినట్లు వెల్లడించింది.

News April 1, 2024

ఇది దేశ చరిత్రలోనే తొలిసారి: రాజ్‌నాథ్ సింగ్

image

భారతదేశ రక్షణ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే FY24లో 32.5% పెరిగాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశ చరిత్రలో తొలిసారిగా ₹21000 కోట్ల మార్కును దాటాయన్నారు. దేశంలో తయారవుతున్న రక్షణ ఉత్పత్తులను 100+ సంస్థలు 85 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ సెక్టార్, DPSUలతో సహా రక్షణ పరిశ్రమలన్నీ గత కొన్నేళ్లలో ప్రశంసనీయమైన పనితీరును కనబరిచాయని కొనియాడారు.

News April 1, 2024

కిడ్నీ పేషెంట్స్‌లో ధైర్యం నింపిన గ్రీన్

image

RCB ప్లేయర్ కామెరాన్ గ్రీన్ దీర్ఘకాలిక మూత్ర పిండ వ్యాధితో పోరాడుతున్న రోగులను కలిశారు. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ధైర్యాన్నిచ్చేందుకు ఆయన ముందుకొచ్చారు. గ్రీన్ కూడా స్టేజ్-2 దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో జన్మించగా.. డాక్టర్లు 12 ఏళ్ల కంటే ఎక్కువ బతకరని చెప్పారట. అయితే, వారిని ఆశ్చర్యపరిచేలా కఠినమైన డైట్ పాటిస్తూ, మెడిసిన్స్ వాడుతూ ఆయన కోలుకొని క్రికెటర్‌గా మారారు.

News April 1, 2024

వాలంటీర్లను ట్రాన్స్‌ఫర్ చేయాలి: లక్ష్మీనారాయణ

image

AP: వాలంటీర్లను సస్పెండ్ చేయకుండా ఒక చోటు నుంచి మరో చోటుకు ట్రాన్స్‌ఫర్ చేయాలని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ECని కోరారు. ‘సస్పెండ్ అయిన వాలంటీర్లు ఇంకా ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాబట్టి వారిని ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఉత్తరాంధ్ర వారిని రాయలసీమకు, రాయలసీమ వారిని ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇలా బదిలీ చేస్తే వారి ప్రభావం ఓటర్లపై ఉండదు. ఎన్నికలు సజావుగా జరుగుతాయి’ అని అన్నారు.

News April 1, 2024

ALERT: బయటకు రాకండి!

image

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో వేడిగాలులు వీస్తున్నట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మేలని సూచిస్తున్నారు. ఉప్పల్‌లో 43.3, శేరిలింగంపల్లిలో 43.1, కుత్బుల్లాపూర్‌లో 43.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 1, 2024

అమెరికా అధ్యక్షుడి విమానంలోనే చోరీలు..!

image

కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్షుడి విమానం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ నుంచి పలు వస్తువులు చోరీకి గురవ్వడం భద్రతా సిబ్బందిని ఆందోళనకు గురిచేసింది. తీరా దర్యాప్తు చేస్తే ఆ చోరులు మీడియా వారే అని తేలింది. తాము ఆ విమానంలో ప్రయాణించామని చెప్పుకొనేందుకు వస్తువుల్ని దొంగిలిస్తున్నారని అధికారులు గుర్తించారు. దీంతో అలా తీసుకెళ్లొద్దని, కావాలంటే విమానంలో దిగిన ఫొటోలను ఇస్తామని విజ్ఞప్తి చేశారు.

News April 1, 2024

JEE అడ్మిట్ కార్డులు విడుదల

image

ఈనెల 4,5,6 తేదీల్లో జరగనున్న JEE మెయిన్ సెషన్-2 పేపర్-1(బీఈ/బీటెక్) అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. <>ntaonline.in<<>> వెబ్‌సైట్‌లో కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఈనెల 8,9(పేపర్-1), 12(పేపర్-2ఎ,బి)) తేదీల్లో జరిగే పరీక్షల హాల్‌టికెట్లు త్వరలో విడుదల కానున్నాయి. పేపర్-1 ఉ.9గంటల నుంచి మ.12 గంటల వరకు, మ.3 గంటల నుంచి సా.6 గంటల వరకు జరగనుంది. పేపర్-2 ఉ.9 గంటల నుంచి మ.12.30 గంటల వరకు నిర్వహిస్తారు.

News April 1, 2024

ఓలా ఎలక్ట్రిక్‌కు ఏడాదిలో భారీ వృద్ధి!

image

ప్రముఖ ఈ-స్కూటర్ల సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ గత ఆర్థిక ఏడాదిలో (2023-24) 115% వృద్ధిని కనబరిచింది. FY24లో 3,28,785 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి. అంతకుముందు ఏడాదితో (FY23- 1,19,310) పోలిస్తే రెండింతలు ఎక్కువ. గతనెల ఏకంగా 53వేల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని.. JAN-MAR త్రైమాసికంలో 1,19,310 రిజిస్ట్రేషన్లు రికార్డ్ అయినట్లు సంస్థ వెల్లడించింది. కాగా ఈ సంస్థ ప్రస్తుతం IPOను ప్రవేశపెట్టే ప్లాన్‌లో ఉంది.

News April 1, 2024

రేపు ఏపీ కాంగ్రెస్ తొలి జాబితా?

image

AP: రాష్ట్రంలో YCPతో పాటు TDP, BJP, JSP కూటమి దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు ఒక్క అభ్యర్థి పేరునూ ఖరారు చేయలేదు. జాబితాపై APCC చీఫ్ షర్మిల ఢిల్లీలో సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఆమె కడప MP అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. రేపు 100 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీ అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.