India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అమెరికాపై కెనడా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ తగ్గేవరకు తామూ తగ్గమని PM జస్టిన్ ట్రూడో అన్నారు. ‘ఈ అన్యాయానికి కెనడా బదులివ్వకుండా ఉండదు. తొలి దశలో $20.6B US ఉత్పత్తులపై మేమూ 25% టారిఫ్స్ వేస్తాం. 3 వారాల్లోపు రెండో దశలో మరో $80Bకు విస్తరిస్తాం’ అని ట్రూడో తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే రెండేళ్లలోనే కెనడా ప్రొడక్షన్ 3% మేర తగ్గుతుందని బ్యాంక్ ఆఫ్ కెనడా ఆందోళన వ్యక్తం చేసింది.

AP: గ్రూప్-2 మెయిన్స్ రాసిన అభ్యర్థులు తమ పోస్టుల ప్రాధాన్యం, జోన్, జిల్లా, ప్రాధాన్యతలు సెలక్ట్ చేసుకునే అవకాశాన్ని APPSC కల్పించింది. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీలోగా APPSC వెబ్సైటులో తమ వివరాలు అప్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. హారిజంటల్ రిజర్వేషన్ అమల్లో భాగంగా మహిళలకు కేటాయించిన పోస్టులకు సరిపడినంత మహిళా అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను పురుష అభ్యర్థులకు కేటాయించనుంది.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ గతంలో విరాట్పైనా నోరు పారేసుకున్నారు. తనకు విదేశీ క్రికెటర్లు ఇష్టమన్న ఓ అభిమానిపై విరాట్ 2018లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోహ్లీ బ్రిటిష్ వారు కనిపెట్టిన ఆట ఆడుతున్నారు. విదేశాల బ్రాండ్స్కు రాయబారి. ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. గిబ్స్ ఆయన అభిమాన క్రికెటర్. కానీ విదేశీ ఆటగాళ్లను ఇష్టపడేవారిని దేశం వదిలిపొమ్మంటారు’ అని షామా అప్పట్లో ట్వీట్ చేశారు.

ఏదైనా రోగం ముదిరాక ఆస్పత్రికి వెళ్లడం కంటే ముందే కొన్ని మెడికల్ టెస్టులు చేయించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన పురుషులు, మహిళలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 1-2 ఏళ్లకోసారైనా BP, CBC, షుగర్, లిపిడ్ ప్రొఫైల్, ECG, లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, BMI చెక్, థైరాయిడ్, యూరిన్ టెస్ట్, విటమిన్ డి పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని ఉచితంగానే చేస్తారు.

బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ సామాన్యుడితో దోబూచులాడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పెరిగి రూ.80,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.760 పెరగడంతో రూ.87,380లకు చేరింది. అటు వెండి ధర కూడా రూ.2000 పెరిగి కేజీ రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.

AP: విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(FRS) ప్రకారం హాజరు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 75 శాతం హాజరు ఉంటేనే ఫీజురీయింబర్స్మెంట్ అందిస్తామని స్పష్టం చేసింది. FRSకు కావాల్సిన టెక్నాలజీని APTS అందిస్తుందని, దీనికి సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని తెలిపింది.

స్టాక్మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 22,044 (-80), సెన్సెక్స్ 72,890 (-210) వద్ద చలిస్తున్నాయి. మెక్సికో, కెనడాపై 25%, చైనాపై 20% టారిఫ్స్ అమల్లోకి రావడం ఇన్వెస్టర్లలో నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఆటో, FMCG, ఐటీ, ఫార్మా, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లు విలవిల్లాడుతున్నాయి. బ్యాంకు, మీడియా షేర్లు రాణిస్తున్నాయి. BEL, SBI, INDUSIND, ICICI BANK టాప్ గెయినర్స్.

తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల చివరి 2 వారాలు ఎండ తీవ్రత మరింత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ఏప్రిల్, మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. నిన్న జగిత్యాల(D) బీర్పూర్లో అత్యధికంగా 38.3 డిగ్రీలు, కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, కామారెడ్డి, వనపర్తిలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.

ప్రభుత్వ రంగ సంస్థలైన IRCTC, IRFCలకు నవరత్న హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులు, ఆదాయ-లాభాల ఆర్జన ఆధారంగా కేంద్రం కంపెనీలకు ఈ హోదా ఇస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి IRCTC రూ.4270 కోట్ల వార్షిక ఆదాయం, IRFC రూ.26,644 కోట్ల ఆదాయాన్ని సాధించాయి. తాజాగా రెండు కంపెనీలు చేరడంతో ఈ హోదా కలిగిన సంస్థల సంఖ్య 26కు చేరుకుంది.

టీవీలు, ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ వచ్చేసినప్పటికీ థియేటర్లలో మూవీ హవా తగ్గలేదు. నేటితో 92 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఒక రీజినల్ మూవీ విభాగంలో ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే థియేటర్లలో రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.