India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్రానికి ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్ కావాలని CM చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ వినియోగంతో 30% వృద్ధి సాధ్యమే అని చెప్పారు. ప్రకృతి సాగు ఆక్వా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని తెలిపారు. సీడ్, ఫీడ్లో జాగ్రత్తలు తీసుకుంటూ యాంటీబయాటిక్స్ తగ్గించాలని సూచించారు. 10లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు లక్ష్యం దిశగా రైతులను ప్రోత్సహిస్తామని GFST ఆక్వాటెక్ 2.0 కాన్క్లేవ్లో CM వెల్లడించారు.

దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ప్రత్యేక వర్క్ వీసాలను దుర్వినియోగం చేసిందని ఆ సంస్థ మాజీ ఉద్యోగులు ఆరోపించారు. ఫ్రంట్ లైన్ వర్కర్లను US తీసుకెళ్లడానికి వారిని మేనేజర్లుగా చూపిస్తూ L-1A వీసాలను వాడుకుందని చెప్పారు. ఈ మేరకు అనిల్ కిని, మరో ఇద్దరు TCS మాజీ ఉద్యోగులు వ్యాజ్యాలు సైతం దాఖలు చేశారు. ఈ ఆరోపణలను ఖండించిన TCS తమ కంపెనీ US చట్టాలకు కట్టుబడి పని చేస్తుందని వెల్లడించింది.

థియేటర్లు-
* రామం రాఘవం- feb 21
* బాపు- feb 21
* డ్రాగన్- feb 21
* జాబిలమ్మ నీకు అంత కోపమా- feb 21
* నెట్ఫ్లిక్స్- 1. డాకు మహారాజ్- feb 21 2. జీరో డే- feb 20
* జీ5- క్రైమ్ బీట్(వెబ్ సిరీస్)- feb 21
* జియో హాట్ స్టార్- 1. ది వైట్ లోటస్(వెబ్ సిరీస్)- feb 17 2. ఊప్స్ అబ్ క్యా(హిందీ)- feb 20 3. ఆఫీస్(తమిళ్)- feb 21

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘కావాలయ్యా’ సాంగ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అలాంటిదే మరో సాంగ్ రాబోతుందని సినీవర్గాలు తెలిపాయి. లోకేశ్ కనగరాజ్- రజినీ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ మూవీలో ‘కావాలయ్యా’ లాంటి స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం. అయితే, ఇందులో తమన్నాకు బదులు బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది.

FY25 Q3లో భారత పట్టణ నిరుద్యోగ రేటు 6.4% వద్ద యథాతథంగా ఉంది. మహిళల నిరుద్యోగ రేటు 8.4 నుంచి 8.1కి తగ్గగా పురుషులది 5.7 నుంచి 5.8కు పెరిగింది. గత త్రైమాసికంలో 5.4%కు తగ్గిన ఎకానమీ గ్రోత్ ప్రస్తుతం పుంజుకున్నప్పటికీ నిరుద్యోగ రేటులో మార్పేమీ లేకపోవడం గమనార్హం. ఇక లేబర్ ఫోర్స్లో స్త్రీల భాగస్వామ్యం తగ్గినట్టు పీరియాడిక్ లేబర్ సర్వే పేర్కొంది. రెగ్యులర్గా శాలరీ పొందుతున్న వర్క్ఫోర్స్ 49.4%గా ఉంది.

CT-2025కి ముందు BCCI భారత ప్లేయర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. BGT ఓటమి తర్వాత కుటుంబ సభ్యులను విదేశాలకు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని ఆటగాళ్లకు విధించిన షరతును సవరించింది. దుబాయ్లో రేపటి నుంచి జరగనున్న CTకి కుటుంబ సభ్యులను తీసుకెళ్లొచ్చని తెలిపింది. అయితే ఒక మ్యాచ్ వరకే పరిమితం అని కండీషన్ పెట్టింది. ఇందుకు ముందుగానే BCCI అనుమతి పొందాలని, వారి ఖర్చులను ప్లేయర్లే భరించాలని స్పష్టం చేసింది.

చిలగడదుంప/ స్వీట్ పొటాటోలో పుష్కలంగా పోషకాలుంటాయని మీకు తెలుసా? శివరాత్రి సమీపిస్తుండటంతో ప్రస్తుతం రోడ్లపై ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఉడకబెట్టిన చిలగడదుంపను తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ A లభిస్తుందని న్యూట్రీషన్లు చెబుతున్నారు. ఇందులో బీటా-కెరోటిన్ ఉండటం వల్ల కంటిచూపు, రోగనిరోధక వ్యవస్థ, గుండె& లంగ్స్ పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ దీనిని తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఏడాదికి సగటున రూ.1500-1600CR, కేరళ పద్మనాభ స్వామి మందిరానికి రూ.750-800CR, అయోధ్య బాలరాముడి ఆలయానికి రూ.700CR, పంజాబ్ స్వర్ణ మందిరానికి రూ.650CR, జమ్మూ వైష్ణోదేవీ గుడికి రూ.600CR, షిర్డీ సాయి మందిరానికి రూ.500CR, పూరీ జగన్నాథ స్వామి గుడికి రూ.400CR, ఢిల్లీ అక్షర్ధామ్ ఆలయానికి రూ.200-250CR, గుజరాత్ సోమనాథ్ మందిరానికి రూ.150-200CR ఆదాయం వస్తుందని అంచనా.

AP: కేజీ టు పీజీ విద్యలో సమూల మార్పులు తెస్తున్నామని, రాష్ట్ర విద్యారంగాన్ని దేశంలోనే నంబర్-1 చేయడమే లక్ష్యమని మంత్రి లోకేశ్ చెప్పారు. మూస పద్ధతులకు స్వస్తి పలికి కరిక్యులమ్ ఛేంజ్ చేస్తున్నామన్నారు. కాలేజీల నుంచి బయటకు రాగానే విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ మేరకు సులోచనాదేవి సింఘానియా స్కూల్ ట్రస్టుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు.

ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారంలో బీజేపీ స్వల్ప మార్పులు చేసింది. ఈ నెల 20న సా.4.30 గం.కు కాకుండా ఉ.11.30 గం.కు రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. రేపు మ.3.30 గం.కు బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై సీఎం పేరును ఖరారు చేయనుంది. రేసులో పర్వేశ్ వర్మ, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్ తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.