India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన తండేల్ మూవీ రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రానికి 7 రోజుల్లోనే రూ.90.12 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. లవర్స్ డే కావడంతో ఈరోజు భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే వీకెండ్ కావడంతో మరో రెండ్రోజులూ థియేటర్లు హౌజ్ ఫుల్ అవుతాయని సినీవర్గాలు పేర్కొన్నాయి.

AP: అన్నమయ్య జిల్లాలో యువతిపై జరిగిన <<15457778>>యాసిడ్ దాడి<<>>ని CM చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువతికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అలాగే, ఈ ఘటనపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన సైకోను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. భవిష్యత్తులో మరో చెల్లిపై దాడి జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు.

AP: దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారు డ్రైవర్ సుధీర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కారు అడ్డుకోవడం, దౌర్జన్యం, బెదిరింపులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బుధవారం రాత్రి ఓ వివాహ కార్యక్రమంలో ఘర్షణ జరిగిందని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పేరెంట్స్ సెక్స్పై కామెంట్స్ <<15413969>>వివాదంలో<<>> తనపై నమోదైన FIRలను క్వాష్ చేయాలంటూ యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని కోరగా ధర్మాసనం తిరస్కరించింది. త్వరగా విచారించడం కుదరని, ప్రొసీజర్ ప్రకారమే చేపడతామని చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా స్పష్టం చేశారు. కాగా షెడ్యూల్ ప్రకారం రణ్వీర్ పిటిషన్ విచారణకు రావడానికి రెండు, మూడు రోజులు పట్టనుంది.

దామోదరం సంజీవయ్య 1960-62 వరకు CMగా ఉన్నారు. ఈయనది కర్నూలు జిల్లా పెద్దపాడు. అవినీతి అధికారులను పట్టుకునే ఏసీబీ ఆయన హయాంలోనే ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే గవర్నమెంట్ టీచర్లకు, వృద్ధులకు పెన్షన్ తీసుకొచ్చారు. కాపు కులాన్ని బీసీ జాబితా నుంచి తొలగిస్తే వారిని తిరిగి బీసీల్లో చేర్చారు. మండల్ కమిషన్ కంటే ముందే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారు. 6 లక్షల ఎకరాలను పేదలకు పంచారు.
*ఇవాళ ఆయన జయంతి

AP: అన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై జరిగిన <<15457778>>యాసిడ్ దాడి<<>> ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆమె బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

సౌత్ ఇండియాలో TGలోనే అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని రాజ్యసభలో మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు. అదే సమయంలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య తగ్గిందని తెలిపారు. 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం APలో 34.9%, TGలో 53.8% మంది పురుషులు మద్యం సేవించేవారని వివరించారు. 2019-21 నాటికి ఇది APలో 31.2%, TGలో 50శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు.

తమిళనాడులో దారుణం జరిగింది. శివగంగ జిల్లాకు చెందిన దళిత విద్యార్థి అయ్యసామి డిగ్రీ చదువుతున్నారు. ఇటీవల తనకిష్టమైన బుల్లెట్ బైకుపై కాలేజీకి వెళ్లొస్తుండగా ముగ్గురు అగ్రవర్ణ యువకులు అతడిపై దాడి చేశారు. ‘కులం తక్కువవాడివి.. మా ముందే బండెక్కుతావా, నీకు బుల్లెట్ కావాలా?’ అని కత్తులతో రెండు చేతులను నరికేశారు. అంతటితో ఆగకుండా సామి ఇంటినీ ధ్వంసం చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఏఐ సహాయంతో కొందరు క్రియేట్ చేసిన స్టార్ క్రికెటర్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. క్రికెటర్లు పొడవాటి జుట్టుతో ఉంటే ఎలా ఉంటుందో క్రియేట్ చేశారు. కోహ్లీ, రోహిత్, బట్లర్, కేఎల్ రాహుల్, బాబర్ ఆజమ్, విలియమ్సన్ వంటి ప్లేయర్ల ఫొటోలను ఉపయోగించారు. ఈ ఫొటోలు చూసిన క్రికెట్ లవర్స్ సూపర్ అంటున్నారు. లాంగ్ హెయిర్తో తమ అభిమాన క్రికెటర్ల ఫొటోలు అదిరిపోయాయని కామెంట్లు చేస్తున్నారు.

ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,154 పోస్టుల దరఖాస్తుకు నేడే చివరి తేదీ. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, ఏసీ మెకానిక్ పోస్టులను భర్తీ చేయనుంది. రూ.100 ఫీజు చెల్లించి www.rrcecr.gov.in సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాసై ఉండాలి. NCVT జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. అభ్యర్థుల వయసు 24 ఏళ్లలోపు ఉండాలి.
Sorry, no posts matched your criteria.