News April 1, 2024

కొలిక్కిరాని ఖమ్మం అభ్యర్థి ఎంపిక!

image

ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ముగిసింది. తెలంగాణలో 4 పెండింగ్ స్థానాలపై పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి, భట్టి, దీపాదాస్ మున్షీ సుదీర్ఘ కసరత్తు చేశారు. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాల అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అయితే ఖమ్మం అభ్యర్థిత్వంపైనే ఇంకా క్లారిటీ రానట్లు తెలుస్తోంది. దీంతో ఈనెల 9న మరోసారి సమావేశమై చర్చించే అవకాశం ఉంది.

News April 1, 2024

సెలబ్రిటీలు నిలబెట్టారు.. మరి ఇప్పుడో? – 1/2

image

కొన్నిచోట్ల స్టార్‌డమ్ పార్టీలను గెలిపిస్తుంది. BJPకి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ సీటు అలా వచ్చిందే. బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాను నిలబెట్టి 1998లో తొలిసారి గెలుపొందిన BJP.. 1999, 2004లోనూ ఖన్నా సాయంతో విజయపరంపర కొనసాగించింది. 2009లో ఓడినా 2014లో ఖన్నా మళ్లీ గెలిచారు. 2017లో ఆయన మృతి తర్వాత సవర్న్ సింగ్ అనే పారిశ్రామికవేత్తకు బైఎలక్షన్‌లో BJP టికెట్ ఇవ్వగా ఓటమి ఎదురైంది.
<<-se>>#Elections2024<<>>

News April 1, 2024

సెలబ్రిటీలు నిలబెట్టారు.. మరి ఇప్పుడో? – 2/2

image

ఇక 2019లో BJP మళ్లీ సెలబ్రిటీ అస్త్రాన్ని (బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్) ప్రయోగించి గెలుపొందింది. కానీ 2020 SEP తర్వాత సన్నీ ఒక్కసారీ అక్కడ పర్యటించకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందట. దీంతో ఈసారి లోకల్ లీడర్ దినేశ్ సింగ్‌ను ఎంపిక చేసింది. మరి సెలబ్రిటీ సెంటిమెంట్ నుంచి BJP బయటపడుతుందా? అకాలీదళ్ మద్దతు లేని లోటు కనిపిస్తుందా? మోదీ మేనియా పనిచేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
<<-se>>#Elections2024<<>>

News April 1, 2024

చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్: కేటీఆర్

image

TG: మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను నంబర్-1గా నిలబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ‘రూ.3.09 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ నంబర్-1. అయినా ఏం చేశావు కేసీఆర్ అని మీడియా, ప్రతిపక్షాలు అంటాయి. చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి. జై తెలంగాణ’ అని ఆయన ట్వీట్ చేశారు.

News April 1, 2024

స్వర్ణయుగం మొదలైందని రాముడు చెప్పినట్లనిపించింది: పీఎం

image

అయోధ్యలో ప్రతిష్ఠాపన సమయంలో రామ్ లల్లా మాట్లాడినట్లు అనిపించిందని పీఎం మోదీ తెలిపారు. ‘అయోధ్యకు వెళ్లాక నన్ను నేను ప్రధానిగా కాక సాధారణ పౌరుడిగానే భావించాను. అది చాలా భావోద్వేగ క్షణం. రాముడిని తొలిసారి చూడగానే అలా చూస్తూ ఉండిపోయా. పండితులు ఏం చెబుతున్నారో వినిపించలేదు. భారత్‌కు స్వర్ణయుగం మొదలైందని రాముడు చెప్పినట్లు అనిపించింది. 140కోట్లమంది కలల్ని రాముడి కళ్లలో చూశాను’ అని వివరించారు.

News April 1, 2024

ఏప్రిల్ 5 నా లక్కీ డేట్: దిల్ రాజు

image

తనకు నిర్మాతగా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ‘దిల్’ సినిమా ఏప్రిల్ 5నే విడుదలైందని దిల్ రాజు అన్నారు. దీంతో ఆ తేదీ తనకు లక్కీగా మారిందని చెప్పారు. అదే తేదీన విడుదల చేస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ బిగ్ హిట్ అవుతుందన్నారు. తాను తీసిన కుటుంబ కథా చిత్రాల్లో ‘శ్రీనివాస కళ్యాణం’ మినహా మిగతావన్నీ హిట్ అయ్యాయని తెలిపారు. ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో 70% ప్రేమ కథ, 30% ఫ్యామిలీ డ్రామా ఉంటుందన్నారు.

News April 1, 2024

ఏప్రిల్ 2 నుంచి ఈ గూగుల్ యాప్ బంద్

image

గూగుల్ పాడ్‌కాస్ట్‌ యాప్ ఏప్రిల్ 2 నుంచి పని చేయదు. ఈ నేపథ్యంలో యూజర్లు తమ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. ఈ పాడ్‌కాస్ట్ తరహా సేవలు యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో అందించనుంది. పాడ్‌కాస్ట్ డేటా యూట్యూబ్ మ్యూజిక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే.. పాడ్‌కాస్ట్‌ యాప్‌లో ఎక్స్‌పోర్ట్స్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ఎంచుకొని.. అక్కడ యూట్యూబ్ మ్యూజిక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

News April 1, 2024

కాళేశ్వరం గురించి మాట్లాడేందుకు కేసీఆర్ సిగ్గుపడాలి: ఉత్తమ్

image

TG: కాళేశ్వరం గురించి మాట్లాడేందుకు కేసీఆర్ సిగ్గుపడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్ట్.. వారి హయాంలోనే కుప్పకూలిందని దుయ్యబట్టారు. కాళేశ్వరం కోసం విద్యుత్ ఖర్చే ఏడాదికి రూ.10వేల కోట్లు అవుతుందని చెప్పారు. సాగునీటి రంగాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు.

News April 1, 2024

ఎన్నికలు పూర్తయ్యే వరకు కాంగ్రెస్‌పై చర్యలు తీసుకోము: ఐటీ శాఖ

image

కాంగ్రెస్‌కు రూ.1700కోట్ల పన్ను నోటీసు జారీ చేయడంపై సుప్రీంకోర్టుకు ఐటీ శాఖ వివరణ ఇచ్చింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సొమ్ము రికవరీపై తాము ఎలాంటి చర్యలు చేపట్టమని స్పష్టం చేసింది. ఎన్నికల వేళ తాము ఏ పార్టీకి ఆటంకాలు కలిగించాలని అనుకోవట్లేదని తెలిపింది. ఈ సందర్భంగా తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేయాలని కోర్టుకు ఐటీ శాఖ విజ్ఞప్తి చేసింది.

News April 1, 2024

కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే: మంత్రి ఉత్తమ్

image

TG: మాజీ సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. వాటిని ప్రజలు గమనించాలని కోరారు. బీఆర్ఎస్ చీఫ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భయాందోళనలతో కేసీఆర్ పొలం బాట పట్టారని విమర్శించారు. 24 గంటల విద్యుత్ సరఫరాకు సీఎం రేవంత్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు.