India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి తరఫున భారీగా ఆశావహులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐదు ఖాళీలకుగానూ టీడీపీ నుంచి కేఎస్ జవహర్, వంగవీటి రాధా, ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి మాధవ్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 3న నోటిఫికేషన్ రానుండగా 20న ఎన్నికలు జరగనున్నాయి.

AP: భవిష్యత్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ‘ప్రభుత్వ కార్యాలయాలు, రైతు బజార్లలో క్యూఆర్ కోడ్ ఉంచాలి. అన్ని కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. నిత్యావసర సరుకుల ధరలు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. బెల్టు షాపులు ఎక్కడ ఉన్నా ఉపేక్షించొద్దు’ అని ఆయన పేర్కొన్నారు.

AP: 2027లో రాష్ట్రంలో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం కుంభమేళాలో రాష్ట్ర బృందం అధ్యయనం చేస్తోంది. మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమండ్రి కమిషనర్ కేతన్ గార్గ్ సహా పలువురు కుంభమేళాను సందర్శించారు. ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ క్లియరెన్స్, భద్రతా చర్యల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల స్నాన ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.

WPLలో ఆర్సీబీ ప్లేయర్ ఎలీస్ పెర్రీ చరిత్ర సృష్టించారు. టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఆమె అవతరించారు. ఇప్పటివరకు పెర్రీ 835 పరుగులు సాధించారు. ఈ క్రమంలో మెగ్ లానింగ్(782) రికార్డును ఆమె తుడిచిపెట్టేశారు. యూపీతో జరుగుతున్న మ్యాచులో ఆమె ఈ ఫీట్ నెలకొల్పారు. కాగా ఐపీఎల్లోనూ అత్యధిక పరుగుల రికార్డు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (8,004) పేరిట ఉన్న విషయం తెలిసిందే.

AP: ఏ దేవుడైతే ఉనికిని ఇచ్చాడో, ఏ పరమాత్మ అయితే స్థానం ఇచ్చాడో ఆయన్ని కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులు వచ్చినా నిష్ప్రయోజనం అని Dy.CM పవన్ అన్నారు. ‘నేను మూర్ఖంగా వాదించే హిందువును కాదు. కానీ లౌకిక వాదం పేరుతో హిందూ ధర్మాన్ని ఆచరించే వారి నమ్మకాలపై పదే పదే దాడులు చేస్తుంటే నాకు ఇబ్బంది అనిపించింది. దీని వల్ల ఓట్లు వస్తాయా పోతాయా అనే లెక్కలు వేసుకోను’ అని ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

వైద్య రంగంలో పనిచేస్తున్న పురుషులు తమతో పని చేసే మహిళా ఉద్యోగులకు రక్షణగా ఉండాలని ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. హెల్త్ కేర్ సెక్టార్కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆర్జీకర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన వైద్యురాలికి నివాళులు అర్పించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రూ.10,000-రూ.15,000 వరకు జీతాల పెంపును ప్రకటించారు.

TG: చీకటి ఒప్పందాలు చేసుకునే అవసరం BJPకి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. BRS, BJP కుమ్మక్కయ్యాయని CM రేవంత్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. ‘మేము నీతి నిజాయితీతో బతికేవాళ్లం. మీలాగా కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగేవాళ్లం కాదు. మీలా పార్టీలు మారలేదు. దయ్యమన్న సోనియాను దేవత అంటూ వెళ్లి కాళ్లు పట్టుకోలేదు’ అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును CBIకి అప్పగిస్తే విచారణ ముందుకు వెళ్తుందని అన్నారు.

AP: ఫైబర్నెట్ ఎండీ దినేశ్ కుమార్పై వేటు పడింది. ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీకి రిపోర్టు చేయాలని దినేశ్ కుమార్ను ఆదేశించింది. మరోవైపు ఫైబర్నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. కాగా ఫైబర్నెట్కు చెందిన పూర్తి నివేదిక సీఎం చంద్రబాబు దగ్గరికి చేరినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగానే ఎండీని జీఏడీకి అటాచ్ చేసినట్లు సమాచారం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘సలార్’ రీ రిలీజ్కు సిద్ధమైంది. మార్చి 21న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించారు. 2023 డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. దీనికి పార్ట్-2 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.

TG: KRMB (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) సమావేశం అసంపూర్తిగా ముగిసింది. హైదరాబాద్ జలసౌధలో ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టీజీ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శితో బోర్డు ఛైర్మన్ రాహుల్ జైన్ సమావేశమయ్యారు. ఇందులో తెలంగాణ తన వాదనలు వినిపించగా, ఏపీ మాత్రం ఎలాంటి వాదనలు వినిపించలేదు. పూర్తి వివరాలతో రేపు సమావేశానికి రావాలని ఇరు రాష్ట్రాలను బోర్డు కోరింది.
Sorry, no posts matched your criteria.