News February 19, 2025

KCRకు ప్రతిపక్ష హోదా ఎందుకు?: TPCC చీఫ్

image

TG: ఫాం హౌస్‌కి పరిమితమైన KCRకు ప్రతిపక్ష హోదా ఎందుకు అని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా ఆయన తీరు మారలేదని, అధికారం కోసం గుంట నక్కలా ఎదురు చూసినా ఫలితం ఉండదని అన్నారు. ‘KCR పాలనకు INC పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటానికి KCRకు సిగ్గు ఉండాలి. గతంలో మా MLAలను చేర్చుకున్నప్పుడు మీ సోయి ఎటు పోయింది’ అని మండిపడ్డారు.

News February 19, 2025

మేడిగడ్డ ప్రాజెక్టుపై కేసు వేసిన వ్యక్తి హత్య

image

TG: మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన లింగమూర్తి హత్యకు గురయ్యారు. భూపాలపల్లి రెడ్డి కాలనీలో ఆయనపై దుండగులు కత్తితో దాడి చేశారు . తీవ్ర గాయాలపాలైన ఆయన ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. మేడిగడ్డలో అక్రమాలు జరిగాయని ఆయన కేసు వేయగా.. KCR, హరీశ్ రావుకు జిల్లా కోర్టు గతంలో నోటీసులిచ్చింది. ఈ కేసుపై రేపు HCలో విచారణ ఉండగా, నేడు ఆయన హత్యకు గురయ్యారు.

News February 19, 2025

రేప్‌లు చేసి.. కుంభమేళాకు వెళ్తుండగా!

image

రేప్‌ చేసి జైలుకెళ్లడం, తిరిగొచ్చి మళ్లీ అదే క్రైమ్ చేసే ఓ వ్యక్తి మహాకుంభమేళాకు వెళ్తూ దొరికిపోయాడు. MPకి చెందిన రమేశ్ సింగ్ 2003లో 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసి పదేళ్లు జైలుకెళ్లొచ్చాడు. 2014లో 8ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేసి టెక్నికల్ ఆధారాలు లేక 2019లో జీవితఖైదు శిక్ష నుంచి బయటపడ్డాడు. తాజాగా, FEB 2న 11ఏళ్ల బాలికపై హత్యాచారం చేశాడు. ఆపై ప్రయాగ్‌రాజ్ వెళ్తుండగా జైపూర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.

News February 19, 2025

‘మిస్టర్ యోగి.. ఆ నీటిని తాగి చూపించు’.. ప్రశాంత్ భూషణ్ సవాల్

image

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా నీటిలో ఫేకల్ బ్యాక్టీరియా ఉందన్న CPCB రిపోర్ట్ సంచలనంగా మారింది. ఈ నివేదికను యూపీ సీఎం యోగి <<15514963>>ఖండించారు.<<>> ఆ నీరు తాగొచ్చని కూడా ప్రకటించారు. దీనిపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సీఎంకు సవాల్ విసిరారు. ‘యోగి, ఆయన మంత్రివర్గానికి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మహా కుంభమేళాలో ఓ గ్లాస్ నీటిని తాగి చూపించండి’ అని ఛాలెంజ్ చేశారు.

News February 19, 2025

Congratulations: దీప్తి జీవాంజికి గోల్డ్ మెడల్

image

23వ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో దీప్తి జీవాంజి మెరిశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగును 57.82 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో ఆమెకు పలువురు క్రీడాకారులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్‌లో కాంస్య పతక విజేత అయిన దీప్తి ఇటీవల అర్జున అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. దీప్తి జీవాంజిది TGలోని వరంగల్ జిల్లా పర్వతగిరి (M) కల్లెడ.

News February 19, 2025

21 ఏళ్లుగా ఊపిరితిత్తుల్లోనే పెన్ క్యాప్.. చివరకు!

image

TG: కరీంనగర్‌కు చెందిన 26ఏళ్ల యువకుడు 5ఏళ్ల వయసులో పెన్ క్యాప్ మింగేశాడు. అప్పుడు ఓ వైద్యుడు పరీక్షించి మలం ద్వారా క్యాప్ వెళ్లి ఉంటుందని, ఏ ఇబ్బంది లేదన్నారు. ఇటీవల 10రోజులుగా అతను అనారోగ్యంతో HYDలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. CT స్కాన్ చేసిన డాక్టర్లు ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్ ఉండటం గుర్తించి వెలికితీశారు. 21 ఏళ్లుగా క్యాప్ ఉండటం వల్ల ఊపిరితిత్తుల కండరాలు బాగా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు.

News February 19, 2025

LRS.. మార్చి 31 వరకు గడువు

image

TG: లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్చి 31 వరకు గడువు విధించింది. ఆలోగా క్రమబద్ధీకరణ ఫీజు చెల్లిస్తే 25% రాయితీ ఇవ్వనుంది. LRSపై మంత్రులు నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 4 ఏళ్లలో ప్లాట్లు కొన్నవారికి, 10% ప్లాట్లు రిజిస్టర్ అయిన లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లకూ అవకాశం కల్పించనున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.

News February 19, 2025

ఢిల్లీకి నాలుగో మహిళా సీఎం

image

ఢిల్లీకి నాలుగో సారి మహిళ సీఎంగా ఉండనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్ (బీజేపీ), షీలా దీక్షిత్ (కాంగ్రెస్), ఆతిశీ (ఆప్) సీఎంలుగా పని చేశారు. తాజాగా రేఖా గుప్తా (బీజేపీ) ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం దేశంలోని 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, అందరూ పురుష సీఎంలే ఉన్నారు. వ్యూహంలో భాగంగానే ఢిల్లీ పీఠం మహిళకు అప్పగించినట్లు తెలుస్తోంది.

News February 19, 2025

ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవాలు: KTR

image

TG: బీఆర్ఎస్ రజతోత్సవాలను ఒక సంవత్సరం పాటు పండుగలా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇందు కోసం ఉద్యమ సహచరులతో, పార్టీ ముఖ్యులతో పలు కమిటీలను వారం రోజుల్లో ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో అన్ని వర్గాల వారిని ఇందులో భాగం చేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 10 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

News February 19, 2025

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4,000 ఉద్యోగాలు

image

బ్యాంక్ ఆఫ్ బరోడా 4,000 అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఉన్న వర్సిటీ నుంచి డిగ్రీ చేసిన వారు అర్హులు. మూడు దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. https://www.bankofbaroda.in/సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.