India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాజస్థాన్ అజ్మీర్లోని ముగ్గురు దొంగలు దేశవ్యాప్తంగా వైరలైపోయారు. వీరు ఓ షాపింగ్ మాల్లో దొంగతనానికి వెళ్లే ముందు అంతా సజావుగా సాగితే ఆలయానికి విరాళం ఇస్తామని దేవుడికి మొక్కుకున్నారు. రూ.15 లక్షల విలువైన వస్తువులను దొంగిలించారు. ఆ తర్వాత ఆలయానికి రూ.లక్ష విరాళం ఇచ్చి అన్నదానం నిర్వహించారు. 200 CCTV ఫుటేజ్లు పరిశీలించి 900KMS ప్రయాణించి దొంగలను పోలీసులు పట్టుకొని విచారించగా ఈ విషయం తెలిసింది.

BGT కోసం ఓ టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ 27 బ్యాగులు తీసుకెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. తనతోపాటు కుటుంబసభ్యులు, సిబ్బంది లగేజీ, 17 బ్యాట్లతో కలిపి 250 కిలోలకుపైగా లగేజీకి BCCI నుంచి ఛార్జి కట్టించినట్లు తెలుస్తోంది. ఇది రూ.లక్షల్లో ఉంటుందని సమాచారం. BCCI నిధులు దుర్వినియోగం చేసిన ఆ ప్లేయర్పై ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. సొంత డబ్బుతో టికెట్ తీసుకోవచ్చు కదా అంటూ విమర్శిస్తున్నారు.

AAP అగ్ర నేతలకు కష్టాలు తప్పేలా లేవు. ఢిల్లీ మాజీ మంత్రి, కేజ్రీవాల్ సన్నిహితుడు సత్యేందర్ జైన్పై దర్యాప్తునకు అనుమతించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును హోంమంత్రిత్వ శాఖ కోరింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ED బలమైన ఆధారాలు సేకరించడమే ఇందుకు కారణమని తెలిసింది. 2017లో CBI ఆయనపై FIR దాఖలు చేసింది. ఆ తర్వాత ED రంగంలోకి దిగింది. 2022 మేలో ఈ కేసులో అరెస్టైన జైన్కు గత OCTలో బెయిల్ వచ్చింది.

AP: ఈ నెల 24 నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివిధ శాఖల అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 22 శాఖల నుంచి ప్రతిపాదనలను తీసుకున్నారు. ఆయా నివేదికల ఆధారంగా బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇవాళ హోం శాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులు పయ్యావులతో సమావేశమై చర్చించారు.

2025లో వార్షిక వేతనాలు 6-15% వరకు పెరగొచ్చని మైకేల్ పేజ్ 2025 శాలరీ గైడ్ అంచనా వేసింది. ఉద్యోగంలో సంక్లిష్టత, నాయకత్వ బాధ్యతలను బట్టి AI, ML, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ రంగాల్లో శాలరీలు గరిష్ఠంగా 40% వరకు పెరుగుతాయని పేర్కొంది. డిమాండును బట్టి అకౌంటింగ్లో ₹22L, మార్కెటింగ్ మేనేజర్కు ₹35L, సాఫ్ట్వేర్ డెవలపింగ్లో ₹50L వరకు సగటు వేతనాలు ఉంటాయని అంచనా వేసింది. మిగిలిన రంగాల్లో తక్కువేనంది.

TG: రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 4.59 లక్షల టన్నుల సన్నబియ్యం సిద్ధం చేసినట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. దీంతో రేషన్ కార్డుదారులకు ఉగాది పండుగ సందర్భంగా సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. కాగా ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల బియ్యం అందిస్తారు.

AP: అన్నమయ్య జిల్లా ప్యారంపల్లిలో <<15457778>>యాసిడ్ దాడికి<<>> గురైన యువతి పరిస్థితి విషమంగా మారింది. దీంతో మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని బెంగళూరుకు తరలించారు. మరోవైపు నిందితుడు గణేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు.

F-35 యుద్ధ విమానాలను భారత్కు విక్రయించేందుకు US అంగీకరించింది. F-35 ఫైటర్ జెట్ గంటకు 2,000 KM వేగంతో ప్రయాణిస్తుంది. రన్ వే అవసరం లేకుండా నిట్టనిలువుగా గాల్లోకి లేస్తుంది. అలాగే కిందకి దిగుతుంది. రాడార్ల కళ్లు గప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేస్తుంది. దీని ధర రూ.695 కోట్ల నుంచి రూ.990 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో పైలట్ ఉపయోగించే హెల్మెట్ ధరే రూ.3.50 కోట్లు ఉంటుంది. వీటిని US అన్ని దేశాలకు అమ్మదు.

AP: అన్నమయ్య జిల్లాలో యువతిపై జరిగిన <<15457778>>యాసిడ్ దాడి<<>> ఘటనను మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితురాలికి అండగా ఉండాలని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని Xలో మండిపడ్డారు. ఇకనైనా మహిళల భద్రతపై దృష్టిసారించాలని కోరారు.

కోలీవుడ్ హీరో, టీవీకే చీఫ్ విజయ్కు కేంద్ర హోంశాఖ భద్రత కల్పించింది. ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరీ కింద ఆయనకు షిఫ్టులవారీగా 11 మంది సిబ్బంది కాపలాగా ఉంటారు. నలుగురు కమాండోలు, ఏడుగురు పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. కాగా ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయనకు ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Sorry, no posts matched your criteria.