India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సమాజంలో మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని హీరోయిన్ సమంత చెప్పారు. సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటానని, చిన్న రోల్స్కు దూరంగా ఉంటానని తెలిపారు. యాడ్స్ విషయంలోనూ చాలా కచ్చితంగా ఉంటానని ఓ ఈవెంట్లో వెల్లడించారు. ‘సిటాడెల్: హనీబన్నీ’ కోసం చాలా కష్టపడ్డానని పేర్కొన్నారు. కాగా <<14525111>>ఐటమ్ సాంగ్స్<<>> చేయబోనని ఆమె ఇటీవల ప్రకటించారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, అరెస్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
దమ్ముంటే రాహుల్ గాంధీతో హిందుత్వ నేతలు వీర సావర్కర్, బాల్ఠాక్రేను పొగిడించాలని ఇండియా కూటమి నేతలకు PM మోదీ సవాల్ విసిరారు. వారు దేశానికి చేసిన సేవలపై మాట్లాడించాలన్నారు. సావర్కర్ తమకు స్ఫూర్తి అని, మరాఠీ చరిత్ర, సంస్కృతిని విశ్వసిస్తామని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం ఎప్పుడూ గౌరవించదన్నారు. ఎన్నికల వేళ సావర్కర్ను విమర్శించొద్దని కాంగ్రెస్ యువరాజుకు MVA సీనియర్ ఒకరు సలహా ఇచ్చినట్టు వివరించారు.
హెడ్ కోచ్ విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు హెడ్ కోచ్లను నియమించాలని యోచిస్తున్నట్లు సమాచారం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా భారత్ ఓడిపోతే టెస్టులకు, టీ20, వన్డేలకు వేర్వేరుగా కోచ్లను నియమించాలని భావిస్తున్నట్లు టాక్. కాగా భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు వైట్ బాల్, రెడ్ బాల్ జట్లకు వేర్వేరు కోచ్లను BCCI నియమించలేదు.
పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని అర్థం చేసుకోవడం ముఖ్యమని, ఇందుకు సహజీవనం తనకు చాలా ఉపయోగపడిందని హీరో విక్రాంత్ మాస్సే చెప్పారు. అయితే తాను ఈ కాన్సెప్ట్ను ప్రచారం చేయట్లేదని, దీని గురించి మాట్లాడటానికీ భయమేస్తోందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలంటే ప్రేమ ముఖ్యం. నేను, నా భార్య పెళ్లికి ముందు డేటింగ్తో అర్థం చేసుకున్నాం. ఇది అందరికీ పనిచేస్తుందని చెప్పలేను’ అని పేర్కొన్నారు.
US సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ డొనాల్డ్ ట్రంప్ భద్రతను మరింత పెంచింది. ఫ్లోరిడాలోని ఆయన నివాసం వద్ద రోబో డాగ్స్ను మోహరించింది. వాటిపై ‘DO NOT PET’ అని వార్నింగ్ రాసుంది. రిమోట్తో ఆపరేట్ చేసే ఈ రోబోల్లో సర్వైలెన్స్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్లు ఉంటాయి. కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ సైతం చేపట్టగలవని సమాచారం. ట్రంప్పై 2 సార్లు హత్యాయత్నం జరగడం, ఇంకా ముప్పు ఉండటంతో ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకుంది.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ శతకం బాది రికార్డుల మోత మోగించారు. ఒక మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ప్లేయర్గా సంజూ (10) నిలిచారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ (10) రికార్డును ఆయన సమం చేశారు. అలాగే టీ20ల్లో రెండు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు అందుకున్న తొలి భారత వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించారు. కాగా ఈ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం చెలరేగింది. నాగార్జున సాగర్ వద్ద ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఘర్షణ చెలరేగింది. సాగర్ కెనాల్ రీడింగ్ కోసం వెళ్లిన తెలంగాణ సిబ్బందిని ఏపీ అధికారులు అడ్డుకున్నారు. తెలంగాణ అధికారులకు ఇక్కడేం పని అంటూ వారు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
TG: సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజలకు తలెత్తే సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని Dy.CM భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. సర్వేపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష చేశారు. ‘కలెక్టర్లు ఎన్యూమరేటర్లతో నిత్యం మాట్లాడాలి. మంత్రులు, MLAలకు సమాచారం ఇవ్వాలి. దేశం మొత్తం తెలంగాణను గమనిస్తోంది. అందరూ చూపించే నిబద్ధతపైనే ఈ సర్వే విజయవంతం కావడం ఆధారపడి ఉంటుంది. చిన్న విషయం కూడా నిర్లక్ష్యం చేయకండి’ అని కోరారు.
AP: మంత్రి నారా లోకేశ్పై అసత్య ఆరోపణలు చేశారంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం YCP MLA తాటిపర్తి చంద్రశేఖర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక టీడీపీ కార్యకర్త చేదూరి కిషోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 18న లోకేశ్పై వారం వారం పేకాట క్లబ్ ద్వారా లోకేశ్కు కమీషన్లు అందుతున్నాయని ఎక్స్లో చంద్రశేఖర్ పోస్టు చేశారు. దీనిపై పోలీసులు ఎమ్మెల్యేకు నోటీసులిచ్చారు.
Sorry, no posts matched your criteria.