News January 3, 2025

Gold vs Sensex: ఫస్ట్ 100,000 మైలురాయిని తాకేదేంటి?

image

కొత్త ఏడాది కావడంతో బంగారం, సెన్సెక్స్‌లో లక్ష మైలురాయిని ఏది ముందుగా తాకుతుందన్న చర్చ జరుగుతోంది. జియో పొలిటికల్ టెన్షన్స్, అనిశ్చితి, ట్రంప్ అధికారం చేపడుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది అనలిస్టులు గోల్డుకే ఓటేస్తున్నారు. కొందరు 2025, మరికొందరు 2026లో టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సెన్సెక్స్ 96,000 స్థాయిని చేరొచ్చని చెప్తున్నారు. చివరి ఆరేళ్లలో GOLD 16.6%, SENSEX 14% AVG రాబడి ఇచ్చాయి.

News January 3, 2025

పిఠాపురంలో జనసేన ప్లీనరీ

image

AP: పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మూడు రోజులపాటు ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు జనసేన తెలిపింది. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ఈ ప్లీనరీ నిర్వహిస్తారు. ప్లీనరీ నిర్వహణపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ ఏర్పాటు కానుంది. ఈ సమావేశాలకు డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారు.

News January 3, 2025

మంత్రి సీతక్కతో చర్చలు సఫలం.. CRTల సమ్మె విరమణ

image

TG: తమ డిమాండ్లు నెరవేర్చాలని కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల(CRT)తో మంత్రి సీతక్క చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, మినిమం టైం స్కేల్ మినహా మిగతా అన్నింటికీ ఆమె సానుకూలంగా స్పందించారు. మహిళలకు 108 రోజుల ప్రసూతి సెలవు, ఐదో తేదీలోపు జీతాలు, డెత్ బెనిఫిట్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులు సమ్మె విరమించారు. రేపటి నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు.

News January 3, 2025

NTR, KCR వల్లే బీసీలకు న్యాయం: కవిత

image

TG: కాంగ్రెస్ పాలనలో BCలకు ఎప్పుడూ అన్యాయమే జరిగిందని BRS MLC కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇది అబద్ధమని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన బీసీ మహా సభలో ఆమె మాట్లాడారు. ‘నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. బీజేపీ సర్కార్ కూడా బీసీలకు చేసిందేమీ లేదు. ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమే వారికి న్యాయం చేశారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.

News January 3, 2025

చైనా మాంజా అమ్మితే ఇలా ఫిర్యాదు చేయండి!

image

చైనా మాంజా ఎంతో డేంజర్ అని తెలిసినా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీంతో ఇవి అమాయకుల పాలిట యమపాశాలుగా మారిపోతున్నాయి. గతంలోనూ ఓ జవాను కూడా ఈ మాంజా వల్ల చనిపోయారు. ఈక్రమంలో చైనా మాంజాను అమ్మినా, కొన్నా నేరమేనంటూ హైదరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. ఎవరైనా చైనా మాంజా అమ్మితే 9490616555 నంబర్‌కు వాట్సాప్‌లో ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. SHARE IT

News January 3, 2025

విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ రికార్డ్

image

విజయ్ హజారే ట్రోఫీ ఒకే సీజన్‌లో వరుసగా రెండుసార్లు 400+ స్కోర్ చేసిన తొలి జట్టుగా పంజాబ్ చరిత్ర సృష్టించింది. ఇటీవల సౌరాష్ట్రపై 424/5 స్కోర్ చేయగా, ఇవాళ హైదరాబాద్‌పై 426/4 బాదింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్(137) సెంచరీ చేశారు. ఇది అతనికి హ్యాట్రిక్ శతకం కావడం విశేషం. మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ(93) రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 196 రన్స్ జోడించారు.

News January 3, 2025

మరికాసేపట్లో తీర్పు.. కొనసాగుతున్న ఉత్కంఠ

image

TG: హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై మరికాసేపట్లో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టైన బన్నీ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే వాదనలు విన్న ధర్మాసనం తీర్పును ఈ సాయంత్రానికి వాయిదా వేసింది. దీంతో AAకు బెయిల్ వస్తుందా? లేదా? అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

News January 3, 2025

రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రివేళ సాధారణం కంటే 2-4 డిగ్రీల టెంపరేచర్ తక్కువగా నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలోనే రేపు, ఎల్లుండి కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై, శీతల గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

News January 3, 2025

హైబీపీ ఉన్నవారు ఈ ఆహారం తినొద్దు!

image

హైబీపీ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంలో వైద్యులు పలు సూచనలు చేశారు. హైబీపీ రోగులు ‘ఎక్కువ ఉప్పు ఉన్న ఫుడ్ తినొద్దు. పచ్చళ్లు తినొద్దు. రోజుకు 2 గ్రాముల సాల్ట్ మాత్రమే తినాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ తినొద్దు. ఇంట్లో ఫ్రెష్‌గా చేసుకున్న ఫుడ్ బెటర్. డిజర్ట్స్& ఐస్ క్రీమ్ తినొద్దు. బేక్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కాకుండా నట్స్ తినండి. మద్యం అలవాటు ఉంటే మానేయండి. కాఫీ తాగొద్దు’ అని తెలిపారు.

News January 3, 2025

ఢిల్లీ చ‌లీ మోదీ కే సాథ్.. BJP కొత్త ప్ర‌చారం

image

ప్రధాని మోదీ కేంద్రంగానే ఢిల్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధమైంది. ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం ఢిల్లీ చ‌లీ మోదీకే సాథ్ (ఢిల్లీ న‌డుస్తుంది మోదీ వెంట‌) నినాదంతో ప్రచారపర్వాన్ని ప్రారంభించింది. ఢిల్లీలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను మోదీ ప్రారంభించిన రోజునే BJP ఈ ప్ర‌చారానికి తెర‌లేప‌డం గ‌మ‌నార్హం. ఈ సారి ఆప్‌ను గద్దెదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.