India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును బీజేపీ ప్రకటించింది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోము వీర్రాజు గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ తరఫున గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన నుంచి నాగబాబు పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి.

అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్ టూర్కు వెళ్లి ప్యూంటా కానా బీచ్ వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆమె కోసం పోలీసులు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో తీవ్రంగా గాలిస్తున్నారు. వర్జీనియాలో ఉంటున్న సుదీక్ష పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుతోందని ఆమె తండ్రి సుబ్బరాయుడు తెలిపారు.

టాలీవుడ్ హీరో గోపీచంద్ కొత్త సినిమాపై అప్డేట్ వచ్చింది. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో ‘Gopichand33’ తెరకెక్కనున్నట్లు మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా, గతేడాది రిలీజైన గోపీచంద్-కావ్యా థాపర్ జంటగా నటించిన ‘విశ్వం’ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సంకల్ప్ రెడ్డి గతంలో ఘాజీ, అంతరిక్షం సినిమాలను తెరకెక్కించారు.

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏసీలకు గిరాకీ పెరుగుతుందని పలు కంపెనీలు అంచనా వేశాయి. ఎండ తీవ్రత పెరిగి, 25-30% వరకు అధికంగా అమ్మకాలు జరుగుతాయనే ఉద్దేశంతో ఏసీ కంపెనీలు వాటి తయారీ పెంచుతున్నాయి. అయితే ఇందుకు తగ్గట్లు విడిభాగాలు సరఫరా కావడం లేదు. దీంతో ఏసీల ధరలు 4-5% పెరగొచ్చని తెలుస్తోంది. రకాన్ని బట్టి ఒక్కో ఏసీపై రూ.1500 నుంచి రూ.2000 వరకు పెరిగే ఆస్కారం ఉంది.

స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 22,654 (102), సెన్సెక్స్ 74,653 (313) వద్ద ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. CPSE, PSE, కమోడిటీస్, మెటల్స్, మీడియా, ఎనర్జీ, రియాల్టి, FMCG, ఇన్ఫ్రా, ఫైనాన్స్, చమురు షేర్లు ఎగిశాయి. ఆటో, వినియోగ, హెల్త్కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. పవర్ గ్రిడ్ టాప్ గెయినర్.

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో అక్కినేని నాగార్జున ఓ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూరీ చెప్పిన స్టోరీ నాగ్కు నచ్చిందని, చర్చలు కొనసాగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో శివమణి (2003), సూపర్ (2005) తెరకెక్కాయి. విక్టరీ వెంకటేశ్, అక్కినేని అఖిల్తోనూ పూరీ జగన్నాథ్ సినిమాలు చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, పార్వతీపురం, ఏలూరులోని పలు ప్రాంతాల్లో వడగాలులు తీవ్ర ప్రభావం చూపిస్తాయని APSDMA అధికారులు తెలిపారు. రేపు 39 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు.

IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి <<15692963>>వనువాటు<<>> ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు జారీ చేసిన పాస్పోర్ట్ను రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని జోతం నపట్ పౌరసత్వ కమిషన్ను ఆదేశించారు. కొన్ని వారాల క్రితం లలిత్ మోదీ వనువాటు పౌరసత్వాన్ని పొందిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన, భారత్లో దర్యాప్తును తప్పించుకునేందుకు అక్కడి పౌరసత్వాన్ని పొందారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

TG: చిన్నపిల్లలకు ఏది తినాలి, ఏది తినకూడదో తెలియదు. ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటారు. అందుకే తల్లిదండ్రులు వారిని నిత్యం గమనిస్తూ ఉండాలి. తాజాగా బాటిల్ మూత మింగి ఓ చిన్నారి, గొంతులో పల్లీ ఇరుక్కొని మరో బాలుడు ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాల(D) ఊట్కూర్లో రుద్ర అయాన్ (9నెలలు) కూల్ డ్రింక్ మూత మింగి చనిపోగా, MHBD జిల్లా నాయకపల్లిలో అక్షయ్(18 నెలలు) గొంతులో పల్లీ ఇరుక్కుని ఊపిరాడక మృతిచెందాడు.

విజయానికి అదృష్టంతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైందని జనసేన నేత నాగబాబు అన్నారు. జనసేనను భారత జట్టుతో పోల్చారు. ‘IND ఒక్క టాస్ గెలవకుండా అన్ని మ్యాచ్లు గెలిచి 12 ఏళ్లకు CT సాధించింది. ఒక్క MLA కూడా లేకుండా 12 ఏళ్లకు 100% స్ట్రైక్ రేట్తో గెలిచి JSP రాజ్యాధికారంలో భాగస్వామ్యమైంది. ఈ రెండింటికీ ఒకే విధమైన పోలికలు. ప్రణాళిక, ప్రాతినిధ్యం, కూర్పు, కసరత్తు, అంకితభావం, ఐకమత్యం’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.