News December 30, 2024

ఎయిడ్స్‌తో ఇప్పుడు ఎందరు బతుకుతున్నారంటే..

image

HIV/AIDSను 1983లో మొదటిసారి అమెరికాలో గుర్తించారు. అక్కడి నుంచి అన్ని దేశాలకు పాకేసింది. ప్రపంచానికి ఇదో పెనుముప్పుగా మారడంతో ‘ఎయిడ్స్‌కు మందు లేదు. నివారణే మార్గం’ అన్న నినాదం పుట్టుకొచ్చింది. HIV సోకి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.2 కోట్ల మంది చనిపోయారని అంచనా. మొత్తంగా 8.8 కోట్ల మందికి సోకింది. 2023 చివరి నాటికి 4 కోట్ల మంది ఎయిడ్స్‌తోనే బతుకుతున్నారు. ఎట్టకేలకు వ్యాక్సిన్ రావడం భారీ ఊరట.

News December 30, 2024

ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు: మంత్రి

image

APలో ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతామన్నారు. భూమి విలువల కంటే రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉన్న చోట రిజిస్ట్రేషన్ విలువలను తగ్గిస్తామని చెప్పారు. విలువలు పెరిగే చోట సగటున 15 నుంచి 20 శాతం వరకు పెంపుదల ఉంటుందని పేర్కొన్నారు.

News December 30, 2024

అన్ని కార్య‌క్ర‌మాల్లో ప్ర‌భుత్వ భాగ‌స్వామిగా ఉంటాం: స‌త్య నాదెళ్ల‌

image

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టే అన్ని కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామిగా ఉంటామని మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల తెలిపారు. HYDలో ఆయ‌న‌తో సీఎం రేవంత్ బృందం భేటీ అయింది. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక‌ వ‌స‌తులే ఆర్థికాభివృద్ధికి దోహ‌ద‌ప‌డి HYDను ప్రపంచంలోని టాప్-50 నగరాల్లో ఉంచగలవని స‌త్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెంచుతున్నందుకు ఆయనకు సీఎం కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

News December 30, 2024

భారత్‌కు WTC ఫైనల్ అవకాశాలు ఉన్నాయా?

image

బాక్సింగ్ డే టెస్టులో ఓడిన భారత జట్టు WTC ఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా తర్వాతి టెస్టులో గెలవాలి. మరోవైపు AUSతో జరిగే టెస్టు సిరీస్‌లో శ్రీలంక 1-0 లేదా 2-0తో గెలవాలి. దీంతో పర్సంటేజ్ పరిగణనలోకి తీసుకుంటే భారత్ ఫైనల్ చేరనుంది. భారత్ నెక్స్ట్ టెస్టులో గెలిచినా శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్ డ్రాగా ముగిస్తే కనుక ఫైనల్ చేరే అవకాశాలు తక్కువే. మరోవైపు వచ్చే టెస్టులో భారత్ ఓడినా, డ్రా చేసుకున్నా ఫైనల్ చేరదు.

News December 30, 2024

vitamin D లోపం: వార్నింగ్ సిగ్నల్స్ ఇవే

image

* విపరీతమైన అలసట * తరచూ జబ్బు పడటం * కండరాల నొప్పి, బలహీనత * వెన్నునొప్పి * ఎముకలు విరగడం, ఆస్టియో పోరోసిస్ * జుట్టు రాలడం * డిప్రెషన్ * బరువు పెరగడం * అలర్జీ, ఎగ్జిమా * దంతక్షయం, పుచ్చిపోవడం * చిగుళ్ల వ్యాధి * మూత్రనాళ వ్యాధులు * మూత్రాశయ వ్యాధి * రికెట్స్ – తరచుగా ఇలాంటి లక్షణాలు వేధిస్తుంటే విటమిన్-డి లోపంగా అనుమానించాలని వైద్యులు అంటున్నారు. అది దొరికే ఆహారం బాగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

News December 30, 2024

60 మంది బెస్ట్ యాక్టర్స్.. ఇండియా నుంచి ఒక్కరే

image

ప్రపంచవ్యాప్తంగా 21వ శతాబ్దపు 60 మంది బెస్ట్ యాక్టర్ల జాబితాను యూకేకు చెందిన ‘ది ఇండిపెండెంట్’ పత్రిక విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి ఇర్ఫాన్ ఖాన్ ఒక్కరినే చేర్చింది. ఆయనకు 41వ ర్యాంక్ ఇచ్చింది. 1988లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇర్ఫాన్ 100కు పైగా చిత్రాల్లో నటించారు. పాన్ సింగ్ థోమర్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు, అనేక చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను పొందారు. ఈయన 2020లో చనిపోయారు.

News December 30, 2024

రేపు అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు

image

TG: నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు సేవలందించనున్నాయి. రాత్రి గం.12:30కి చివరి రైలు బయల్దేరుతుందని HMRL వర్గాలు వెల్లడించాయి. అర్థరాత్రి వరకు వేడుకలు ఉండటంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విస్తృతంగా జరిగే అవకాశం ఉండటంతో సేఫ్‌గా ఇంటికి చేరేందుకు ఇది సహకరించనుంది. ఇక నగరంలో రేపు రాత్రి ఫ్లై ఓవర్లు మూసేస్తామని పోలీసులు తెలిపారు.

News December 30, 2024

ఉక్రెయిన్‌కి భారీ సైనిక సాయం ప్రకటించిన బైడెన్

image

ర‌ష్యాతో త‌ల‌ప‌డుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ 2.5 బిలియన్‌ డాలర్ల భారీ సైనిక సాయాన్ని ప్ర‌క‌టించారు. ఉక్రెయిన్ సైన్యానికి అవ‌స‌ర‌మైన త‌క్ష‌ణ సామాగ్రిని అందించేందుకు 1.25 బిలియన్‌ డాలర్ల డ్రాడౌన్ ప్యాకేజీ, 1.22 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాల స‌ర‌ఫ‌రాకు ఆమోదం తెలిపారు. ర‌ష్యాను నిలువ‌రించే ప్ర‌య‌త్నాల్లో ఉక్రెయిన్‌కు అండ‌గా ఉండ‌డం త‌న ప్రాధాన్యమని బైడెన్ పేర్కొన్నారు.

News December 30, 2024

9 కొత్త ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

image

AP: బీపీసీఎల్, టీసీఎస్ సహా 9 కొత్త ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. SIBP సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘క్లీన్ ఎనర్జీ పాలసీకి భారీ స్పందన లభిస్తోంది. కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి’ అని పేర్కొన్నారు.

News December 30, 2024

ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు?

image

AP: సూపర్-6లో భాగంగా మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు, మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డితో ఇవాళ సీఎం చంద్రబాబు చర్చించారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.