News January 2, 2025

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం

image

AP: విజయవాడ MG రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేడు 35వ పుస్తక మహోత్సవం ప్రారంభం కానుంది. సాయంత్రం 6గంటలకు Dy.CM పవన్ ప్రారంభించనున్నారు. 290కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. పుస్తకావిష్కరణ వేదికకు రామోజీరావు, చిన్నారుల కార్యక్రమాలు నిర్వహించే వేదికకు రతన్ టాటా పేరు పెట్టారు. ఇవాళ్టి నుంచి 12వ తేదీ వరకు రోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన జరుగుతుంది.

News January 2, 2025

రైతులకు రూ.10,000.. UPDATE

image

వ్యవసాయంపై కేంద్ర క్యాబినెట్ నిన్న <<15038464>>చర్చించిన<<>> విషయం తెలిసిందే. ఈక్రమంలోనే PM కిసాన్ పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పెంచినట్లు ప్రచారం జరిగింది. అయితే క్యాబినెట్‌లో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. FEB 1న ప్రవేశపెట్టే బడ్జెట్ నాటికి సాయం పెంపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద మూడు విడతల్లో ఏటా రూ.6వేలు ఇస్తుండగా దీన్ని రూ.10వేలకు పెంచాలనే డిమాండ్ ఉంది.

News January 2, 2025

విదేశీ ప్రయాణాలు చేసేవారిపై ఐటీ శాఖ దృష్టి?

image

విదేశీ ప్రయాణాలు చేసే భారతీయులపై కన్నేసి ఉంచాలని ఆదాయ పన్ను శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా తయారుచేయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆ సాఫ్ట్‌వేర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. ప్రయాణికుల టికెట్ల నుంచి తాగే చాయ్ వరకూ మొత్తం అన్ని ఖర్చుల వివరాల్ని ఐటీ శాఖ సేకరించనుంది. పన్ను ఎగవేసి విదేశీ టూర్లు చేసే వారి కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

News January 2, 2025

కార్ రేస్ కేసు విచారణ.. నేటి నుంచే షురూ

image

TG: ఫార్ములా-ఈ రేస్ కారు కేసులో ఈడీ విచారణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, రేపు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను ఇంటరాగేషన్ చేయనుంది. వీరిద్దరి వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఈనెల 7న ఈడీ ప్రశ్నించనుంది. అయితే విచారణకు వెళ్లేది, లేనిది తమ లాయర్లు నిర్ణయిస్తారని నిన్న ఆయన అన్నారు.

News January 2, 2025

రూ.331.84 కోట్ల మద్యం తాగేశారు!

image

AP: న్యూఇయర్ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. డిసెంబర్ 30, 31 తేదీల్లో రూ.331.84కోట్ల బిజినెస్ జరిగింది. 30న రూ.219.43కోట్లు, 31న 112.41 కోట్ల మద్యం అమ్ముడైంది. 4లక్షలకు పైగా లిక్కర్, లక్ష 61వేలకు పైగా బీరు కేసులు విక్రయించారు. రాష్ట్రంలో డైలీ రూ.80కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయి. సాధారణం కంటే మద్యం దుకాణాలు, బార్లకు 2గంటలు అదనపు సమయం కేటాయించడంతో అమ్మకాలు పెరిగాయి.

News January 2, 2025

ఇకపై తాను చెప్పినట్లు ఆడాల్సిందేనన్న గంభీర్?

image

ఎంసీజీలో భారత్ ఓటమి అనంతరం ఆటగాళ్లందరిపై గంభీర్ తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. స్పోర్ట్స్ తక్ కథనం ప్రకారం.. ‘6 నెలలుగా మీరు ఎలా ఆడితే అలా వదిలేశాను తప్ప ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. సైలెంట్‌గా ఉన్నది మీరు లోకువ తీసుకుంటారని కాదు. ఇక చాలు. ఇకపై నేను చెప్పినట్లుగానే గేమ్ ప్లాన్ ఉంటుంది. అది అమలుచేసేవాళ్లు మాత్రమే ఆడతారు. చేయలేని వారికి థాంక్యూ’ అని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.

News January 2, 2025

5 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఈ నెల 5 నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. 5,6,7 తేదీల్లో ఆయన నియోజకవర్గాన్ని చుడతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. పలు పథకాల అమలును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని, నియోజక వర్గాల ప్రజల్ని పరిస్థితి అడిగి తెలుసుకుంటారని వెల్లడించాయి.

News January 2, 2025

రాజ్యాంగ మార్పు ప్రకటనలు మానుకోవాలి: అసదుద్దీన్

image

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాలని MIM అధినేత అసదుద్దీన్ కోరారు. రాజ్యాంగాన్ని మారుస్తామంటూ చేస్తున్న ప్రకటనల్ని మానుకోవాలని అవి ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ‘రాజ్యాంగంలో మార్పులు తెస్తే ప్రతిపక్షాల ఆమోదం కచ్చితంగా ఉండాలి. ప్రార్థనా స్థలాల్ని మార్చడాన్ని 1991 చట్టం ఒప్పుకోదు. స్వాతంత్ర్యం తర్వాతి నుంచి ఉన్న ఏ ప్రార్థనా స్థలమైనా యథాతథంగా కొనసాగాలి’ అని పేర్కొన్నారు.

News January 2, 2025

రోహిత్ ఆ హక్కు సంపాదించుకున్నారు: క్లార్క్

image

రోహిత్ శర్మ రిటైర్ కావాలంటూ వస్తున్న డిమాండ్లు అర్థరహితమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్‌ను తప్పిస్తారని నేను అనుకోవడం లేదు. గత కొన్ని మ్యాచులుగా ఆయన రికార్డ్ బాలేదని ఒప్పుకుంటా. కానీ ఎప్పుడు తప్పుకోవాలో తానే నిర్ణయించుకోగల హక్కును ఆయన ఇన్నేళ్ల ఆటతో సంపాదించుకున్నారు. మరి రోహిత్ మనసులో ఏముందో ఆయనకే తెలియాలి’ అని వ్యాఖ్యానించారు.

News January 2, 2025

కార్ల్‌సన్, ఇయాన్ టైటిల్ షేరింగ్ వివాదాస్పదం

image

ప్రపంచ చెస్ బ్లిట్జ్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను పంచుకోవాలని మాగ్నస్ కార్ల్‌సన్, ఇయాన్ నెపోమ్నియాచ్‌చీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఇది చరిత్రలో తొలిసారి కావడం గమనార్హం. అయితే స్పష్టమైన విజేతను తేల్చకుండా ఇద్దర్నీ విజేతలుగా ప్రకటించడమేంటంటూ మాజీలు అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. చెస్ ప్రపంచం కార్ల్‌సన్ చెప్పుచేతల్లో నడుస్తోందని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.