India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ట్రంప్ టారిఫ్స్ ప్రభావం దేశీయ మార్కెట్లపై ఇవాళ తీవ్రంగా పడింది. సెన్సెక్స్ 765 పాయింట్లు కోల్పోయి 79,857 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 232 పాయింట్లు నష్టపోయి 24,363 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, కొటాక్ బ్యాంక్, మహీంద్రా&మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. NTPC, టైటాన్, ట్రెంట్, ITC, బజాజ్ ఫిన్సెర్వ్ షేర్లు లాభాల్లో ముగిశాయి.

TG: భార్యాభర్తల ఫోన్లు విన్న దుర్మార్గులు KCR కుటుంబ సభ్యులని బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ‘గత BRS పాలనలో వారు చేసిన పని ఒక్కటే.. అందరి ఫోన్లూ వినడమే. జాబితాలో పేర్లున్న రేవంత్, కేసీఆర్ కూతురు, అల్లుడిని కూడా విచారణకు పిలవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. విచారణ చేస్తున్న సిట్ అధికారులు మంచోళ్లే కానీ, రేవంత్ సర్కార్పైనే తమకు నమ్మకం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

సీఎస్కే బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆ జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తనను రిలీజ్ చేయాలని సీఎస్కేను అశ్విన్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. 2026 వేలంలోకి పంపడం లేదా ట్రేడ్ చేయాలని ఆయన యాజమాన్యాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. మరోవైపు సంజూ శాంసన్ను తీసుకోవాలంటే ఇద్దరు ప్లేయర్లను వదులుకోవాలని సీఎస్కేకు ఆర్ఆర్ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

వరలక్ష్మీ వ్రతం రోజు(శుక్రవారం) అమ్మవారికి ఉద్వాసన పలకకూడదని పండితులు చెబుతున్నారు. ‘వ్రతం రోజు భూశయనం చేస్తే మంచిది. కచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. చేతికి కట్టుకున్న తోరమును రాత్రంతా ఉంచుకోవాలి. శనివారం తెల్లవారుజామున స్నానానికి ముందు తోరము తీసేయాలి. అమ్మవారిని పంచోపచార విధానంలో పూజించాలి. ఏదైనా పండు నైవేద్యంగా పెట్టి హారతివ్వాలి. దుర్ముహూర్తం వెళ్లాకే అమ్మవారిని కదపాలి’ అని సూచిస్తున్నారు.

TG: KCR కొడుకు తన స్వలాభం కోసం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డాడని బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘రాజకీయ నేతలు, వ్యాపారులు, అధికారులు, ఉస్మానియా ప్రొఫెసర్లతో పాటు చివరికి TGPSC పేపర్ లీకేజీ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కాల్స్ కూడా విన్నారు. ప్రభాకర్ రావు అనేవాడు లఫంగి. ఆయనను ఉరి తీయాలి. ఈ కేసులో ఇన్ని ఆధారాలు ఉన్నా KCR కుటుంబాన్ని రేవంత్ సర్కార్ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు’ అని ప్రశ్నించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఎలా డీల్ చేయాలో భారత ప్రధాని మోదీకి తాను చెబుతానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. వీరిద్దరూ తన స్నేహితులే కాబట్టి ఈ చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకుగానూ త్వరలోనే తాను భారత్లో పర్యటిస్తానని తెలిపారు. భారత్-అమెరికా స్నేహబంధం గట్టిదని, టారిఫ్స్ అంశంపై తాను జోక్యం చేసుకుంటానని చెప్పారు.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ను ప్రతి క్షణం ట్యాప్ చేశారని చెప్పారు. సిట్ అధికారులు ఆధారాలు చూపించగానే షాక్ అయినట్లు తెలిపారు. ‘కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎంత నీచులంటే సొంత బిడ్డ ఫోన్ కాల్స్ కూడా విన్నారు. మావోయిస్టుల లిస్టులో మా పేర్లు పెట్టి ట్యాపింగ్కు పాల్పడ్డారు. అందులో సీఎం రేవంత్, హరీశ్ రావు పేర్లు కూడా ఉన్నాయి’ అని వెల్లడించారు.

ఫిల్మ్ ఫెడరేషన్లోని యూనియన్ల ఏకపక్ష సమ్మె పిలుపు నేపథ్యంలో వారితో ఎలాంటి సంప్రదింపులు జరపవద్దని సభ్యులకు ఛాంబర్ సూచించింది. స్టూడియోలు, ఔట్ డోర్ యూనిట్లు, ఇతర యూనిట్ల సభ్యులు ముందస్తు సమాచారం/అనుమతి లేకుండా షూటింగ్లు చేయొద్దని ఆదేశించింది. నిర్మాతలు, స్టూడియో విభాగ సభ్యులు ఈ ఆదేశాలను పాటించాలని పేర్కొంది. కాగా వేతనాలు పెంచాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విచారణ ముగిసింది. రెండున్నర గంటలపాటు అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను బండి సిట్కు అందజేశారు. ఆయన టీబీజేపీ చీఫ్ అయినప్పటి నుంచి ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులకు తెలియజేశారు. ఎవరితో ఎంతసేపు మాట్లాడారన్న డేటాను బండికి చూపించారు. మునుగోడు, హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలోనూ ఆయన ఫోన్ ట్యాప్ చేసినట్లు చెప్పారు.

AP: పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. తల్లిదండ్రులు లేని 42 మందిని గుర్తించి తన జులై నెల జీతం నుంచి వారికి రూ.5,000 చొప్పున అందించారు. అలాగే వారికి నాణ్యమైన ఆహారం, దుస్తులు, చదువు తదితరాల కోసం కూడా సొంత డబ్బును పవన్ సమకూర్చారు. వీరిని భగవంతుని పిల్లలుగా ఆయన సంబోధించారు. కాగా నియోజకవర్గ MLAగా పవన్ బాధ్యత తీసుకున్నారని జనసేన వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.