India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చట్టసభలో <<15658824>>ప్రతిపక్ష<<>> హోదా దక్కాలంటే ఆ పార్టీకి 10% సీట్లు రావాలని LoP 1977సం. చట్టం చెబుతోంది. 10% సీట్లు వచ్చి అధికారపక్షం తర్వాత అత్యధిక స్థానాలు గల పార్టీకి ఇది దక్కుతుంది. అధికార పక్షం తర్వాత ఒకటి కంటే ఎక్కువ పార్టీలు సమాన స్థానాలు పొందితే ప్రిసైడింగ్ ఆఫీసర్ నిర్ణయం ప్రకారం ఒక పార్టీకి ఈ గుర్తింపు ఇస్తారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై TDP,YCP మధ్య ప్రస్తుతం ఇదే రగడ జరుగుతోంది.
PS: YCP-11/175

తమ పేరుతో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న డీప్ఫేక్ వీడియోలకు సంబంధించి తమ కస్టమర్లను SBI హెచ్చరించింది. పెట్టుబడులకు సంబంధించి SBI పేరుతో సైబర్ నేరగాళ్లు షేర్ చేస్తున్న వీటిని నమ్మి ఇన్వెస్ట్ చేయొద్దని సూచించింది. SBI ఎప్పుడూ ఇలాంటి వీడియోలు షేర్ చేయదని స్పష్టం చేసింది. AI ఉపయోగించి ఇలాంటి వీడియోలు, వాయిస్లతో ప్రజలను మోసం చేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

CT సెమీ ఫైనల్-2లో సౌతాఫ్రికాపై కివీస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర శతకం బాదారు. 93 బంతుల్లోనే 12 ఫోర్లు, 1 సిక్సర్తో అద్భుత సెంచరీ సాధించారు. CTలో రచిన్కు ఇది రెండో సెంచరీ(తొలి శతకం బంగ్లాపై) కావడం విశేషం. మరోవైపు, విలియమ్సన్(62*) అర్ధశతకంతో మెరవడంతో కివీస్ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. వీరిద్దరి మధ్య 138 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోర్ 186/1గా ఉంది.

అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు (19,000) చేసిన బ్యాటర్గా కేన్ విలియమ్సన్ రికార్డు నెలకొల్పారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్ మ్యాచులో ఈ ఘనత అందుకున్నారు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో హైయెస్ట్ రన్స్(442) చేసిన NZ ఆటగాడిగా నిలిచారు. ఫ్లెమింగ్ (441)ను అధిగమించారు.

చార్ధామ్ యాత్రలో కీలకమైన కేదార్నాథ్కు వెళ్లేందుకు ప్రయాణ కష్టాలు తప్పనున్నాయి. సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు రూ.4,081 కోట్లతో రోప్వే నిర్మించేందుకు PM మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 12.9కి.మీ. మేర రోప్వే వల్ల ఓ వైపునకు 8-9 గంటలు పట్టే ప్రయాణ సమయం కేవలం 36నిమిషాలకు తగ్గిపోనుంది. రోప్ వే నిర్మాణంలో ట్రై కేబుల్ డిటాచబుల్ గొండోలా టెక్నాలజీ(3S) ఉపయోగించనున్నారు.

స్టాక్మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 22,337 (+254), సెన్సెక్స్ 73,730 (+740) వద్ద ముగిశాయి. బలమైన కౌంటర్ ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.4L CR మేర లాభపడ్డారు. మెటల్, PSE, మీడియా, PSU బ్యాంకు, టూరిజం, ఎనర్జీ, డిఫెన్స్, కమోడిటీస్, ఆటో షేర్లు దుమ్మురేపాయి. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, M&M టాప్ గెయినర్స్. బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, HDFC బ్యాంకు, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్.

సివిల్ కాంట్రాక్టుల్లో ముస్లిములకు 4% రిజర్వేషన్ కల్పించేందుకు KA కాంగ్రెస్ GOVT యోచిస్తోంది. KTPP చట్టాన్ని సవరించాలని CM సిద్దరామయ్య నిర్ణయించుకున్నారని తెలిసింది. ఫైనాన్స్ శాఖ ఇప్పటికే బ్లూప్రింట్ సిద్ధం చేసిందని, మంత్రి HK పాటిల్ దీనికి అంగీకరించారని సమాచారం. నేటి క్యాబినెట్ మీటింగులో ఆమోదం పొందితే బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టడం ఖాయమే. బుజ్జగింపు రాజకీయాలకిది పరాకాష్ఠ అని BJP విమర్శిస్తోంది.

తనకు స్టార్ హీరోలతో రొమాంటిక్ సినిమాలను తెరకెక్కించాలని ఉందని డైరెక్టర్ గౌతమ్ మేనన్ వెల్లడించారు. కానీ ఈరోజుల్లో ఇలాంటి మూవీస్ చేసేందుకు స్టార్లు ఆసక్తి చూపట్లేదని తెలిపారు. ‘నేను తమిళ, తెలుగు, కన్నడ హీరోలను సంప్రదించా. రొమాన్స్ అని చెప్పగానే వాళ్లు మీటింగ్ను వాయిదా వేయడం లేదా మళ్లీ కలవకపోవడం వంటివి చేస్తున్నారు. ఆలా ఎందుకు చేస్తున్నారో తెలియదు’ అని ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో మాట్లాడారు.

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. ఉదయం, రాత్రి వేళల్లో చలి వణికిస్తే.. మధ్యాహ్నం మాత్రం వేసవి వచ్చిందన్న విషయం గుర్తొచ్చేలా వేడిమి అల్లాడిస్తోంది. అక్కడక్కడా తప్పితే రెండు రాష్ట్రాలవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. వేసవిలో రాత్రుళ్లు చల్లగా ఉండటం బాగానే ఉన్నా దాని వల్ల పగటి వేడిమి తాకిడి మరింత ఎక్కువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

AI రాకతో నానా ఇబ్బందులు పడుతున్న IT ఉద్యోగులకు మరో పెద్ద కష్టమే వచ్చిపడింది. TCS, INFY, WIPRO, HCLTECH, ACCENTURE సహా మేజర్ కంపెనీలు బెంచ్సైజు, కాల పరిమితి తగ్గించాయని అన్ఎర్త్ ఇన్సైట్ తెలిపింది. FY20, 21లో 45-60 ఉన్న సగటు బెంచ్ డ్యురేషన్ ఇప్పుడు 35-45 రోజులకు తగ్గింది. మొత్తం వర్క్ఫోర్స్లో 10-15% ఉండే బెంచ్ ఉద్యోగులు ఇప్పుడు 2-5%కు పడిపోయారు. మార్జిన్లు తగ్గడం, AI రావడమే ఇందుకు కారణాలు.
Sorry, no posts matched your criteria.