News March 26, 2024

సీఏఏతో మోదీ సర్కార్ కుట్ర: కేరళ సీఎం

image

ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని పౌరసత్వ సవరణ చట్టం(CAA) ద్వారా బీజేపీ కుట్ర పన్నుతోందని కేరళ CM పినరయి విజయన్ మండిపడ్డారు. ‘ముస్లిం పాలకులు, సాంస్కృతిక సారథులు ఎందరో దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు. వాస్తవానికి భారత్ మాతాకీ జై, జైహింద్ అని నినదించింది ముస్లింలని సంఘ్ పరివార్‌కి తెలియదనుకుంటా. CAAకి వ్యతిరేకంగా పోరాడాలనే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదు’ అని ఫైర్ అయ్యారు.

News March 26, 2024

టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు అలర్ట్

image

TS: పదో తరగతి విద్యార్థులకు నేడు, ఎల్లుండి గంటన్నర పాటే పరీక్షలు ఉండనున్నాయి. సైన్స్‌లో భాగంగా నేడు ఫిజిక్స్ (పేపర్-1), గురువారం బయాలజీ (పేపర్-2) నిర్వహించనున్నారు. ఉ.9.30 నుంచి మ.11 వరకే ఎగ్జామ్స్ ఉండనున్నాయి. చివరి 15 నిమిషాల ముందు అంటే ఉ.10.45 గంటలకు ఆబ్జెక్టివ్ (పార్ట్-B) పేపర్ ఇస్తారు. ఫలితాలు మాత్రం ఫిజిక్స్, బయాలజీ కలిపి ప్రకటిస్తారు. ఇక 30న సోషల్ స్టడీస్‌తో ప్రధాన పరీక్షలు ముగియనున్నాయి.

News March 26, 2024

రేపటి నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర

image

AP: సీఎం జగన్ రేపు ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బుధవారం ఉదయం 10.56గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ఆరంభిస్తారు. ఇచ్ఛాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల యాత్ర చేపట్టనున్నారు.

News March 26, 2024

అడుగంటిన జలాలు.. ఎండుతున్న పంటలు!

image

TS: భూగర్భజలాలు అడుగంటిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. రెండు మూడు బోర్లు వేయిస్తున్నా ఫలితం ఉండట్లేదని, తడి లేక పంట ఎండిపోతోందని వాపోతున్నారు. అనేక ప్రాంతాల్లో 500 అడుగుల మేర తవ్వినా నీటి జాడ లభించకపోవడం గమనార్హం. దీంతో ఆరుతడులతో ఎలాగో నెట్టుకొస్తున్నామని రైతన్నలు చెబుతున్నారు. ఎండల తీవ్రతతో మున్ముందు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.

News March 26, 2024

హోలీ శుభాకాంక్షలు: బైడెన్ దంపతులు

image

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా హోలీ జరుపుకొనేవారందరికీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హోలీ వేడుకలను చేసుకుంటారు. వసంత రుతువు ఆగమనాన్ని వివిధ రంగులతో గుర్తుచేసుకుంటారు. వారందరికీ మా ఇద్దరి తరఫున శుభాకాంక్షలు’ అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

News March 26, 2024

IPL: నేడు చెన్నైతో గుజరాత్ ఢీ

image

ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య చెన్నైలో మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం రెండు జట్లూ చెరో మ్యాచ్ గెలిచి సమానంగా ఉన్నాయి. కాగా.. ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లోనూ హోం టీమ్‌లే గెలిచాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ఆ ట్రెండ్ కొనసాగుతుందా లేక రుతురాజ్ సేనపై గుజరాత్ పైచేయి సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

News March 26, 2024

వణుకుతున్న పుతిన్ ప్రత్యర్థులు!

image

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అనుమానాస్పద మరణం తర్వాత దేశంలో పుతిన్ ప్రత్యర్థులందరూ వణికిపోతున్నారని అక్కడి ‘ఫ్రీ రష్యా ఫౌండేషన్’ సలహాదారు ఇవ్జీనియా కారా-ముర్జా వెల్లడించారు. అధ్యక్షుడి తీరును తన భర్త వ్లాదిమిర్ సహా పలువురు ఎండగట్టారని, దీంతో కోర్టు 25ఏళ్ల జైలు శిక్ష విధించిందని తెలిపారు. గతంలో తన భర్తను చంపేందుకు చూసినవారే ఇప్పుడు ఆయన్ను అరెస్టు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

News March 26, 2024

కవిత పిటిషన్‌పై నేడు విచారణ

image

లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు విచారణ జరపనుంది. కవితకు కోర్టు విధించిన కస్టడీ సైతం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సీబీఐ కోర్టులో ఆమెను ఈడీ హాజరుపరచనుంది. కస్టడీని మరో 4రోజులపాటు పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది.

News March 26, 2024

ఏం చేస్తారో చెప్పకుండా రెడ్‌బుక్ ఏంటి?: సజ్జల

image

AP: నారా లోకేశ్ రెడ్‌బుక్‌పై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన రెడ్‌బుక్ దేనికో అర్థం కావడం లేదు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా ఈ బుక్ ఏంటి? ముందు ఆయన మంగళగిరిలో గెలవాలి కదా?’ అని ఎద్దేవా చేశారు. కాగా తమ పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, పోలీసులు, చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లను ఈ బుక్‌లో రాస్తున్నట్లు లోకేశ్ గతంలో వెల్లడించారు.

News March 26, 2024

గాజాలో కాల్పుల విరమణ పాటించాల్సిందే: UNSC

image

రంజాన్ నెల సందర్భంగా ఇజ్రాయెల్ వెంటనే గాజాపై కాల్పుల్ని ఆపాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ బందీలందర్నీ విడిచిపెట్టాలని హమాస్‌కు తేల్చిచెప్పింది. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత UNSC స్పందించడం ఇదే ప్రథమం. మండలిలో 15 సభ్యదేశాల్లో అమెరికా తప్ప మిగిలిన అన్ని దేశాలూ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. వీటో అధికారంతో తీర్మానాన్ని అడ్డుకునే ఛాన్స్ ఉన్నా అమెరికా దూరం పాటించింది.