News March 24, 2024

ఒకరోజు షూటింగ్‌కి రూ.కోటి

image

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’. ఈ మూవీ 4 రోజుల షూటింగ్‌కి ₹4 కోట్లు ఖర్చు చేసినట్లు మారుతి తెలిపారు. ‘ఒకప్పుడు ‘ఈ రోజుల్లో’ సినిమాని ₹30 లక్షల బడ్జెట్‌తోనే తీశా. కానీ రాజాసాబ్ మూవీకి 4 రోజుల్లోనే కోట్లు ఖర్చయింది. ప్రభాస్ సినిమా కాకపోతే ఆ బడ్జెట్‌లో నేను రెండు మూడు సినిమాలు తీసేవాడిని’ అని చెప్పారు. దీంతో రాజాసాబ్ సినిమా బడ్జెట్ ₹100 కోట్ల పైనే ఉంటుందని టాక్.

News March 24, 2024

BIG BREAKING: ఫోన్ ట్యాపింగ్ సంచలన విషయాలు

image

TG: రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. ‘ఉన్నతాధికారులు చెబితేనే ఎన్నికలప్పుడు వందలాది ఫోన్లు ట్యాప్ చేశాం. అందులో నేతలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులూ ఉన్నారు. BRS కీలక నేత కొన్ని నంబర్లు ట్యాప్ చేయమన్నారు. మెయిన్ ట్యాపింగ్ డివైజ్‌ను ధ్వంసం చేశాం. కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లను విరిచి మూసీ నదిలో పడేశాం. కొన్ని పత్రాలు కాల్చేశాం’ అని తెలిపారు.

News March 24, 2024

ఈ నెల 27న కాంగ్రెస్ తుది జాబితా?

image

TG: కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. రాష్ట్రంలో 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయమై ముఖ్య నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ భేటీ అయ్యారు. దీనిపై ఏకాభిప్రాయానికి రాష్ట్ర నాయకత్వం యత్నిస్తోంది. ఈ నెల 27న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.

News March 24, 2024

గ్రౌండ్‌లో హార్దిక్.. రోహిత్ అంటూ ఫ్యాన్స్ అరుపులు

image

టాస్ వేసే సమయంలో అభిమానుల మోతతో స్టేడియం దద్దరిల్లింది. హార్దిక్, గిల్ గ్రౌండ్‌లోకి వెళ్లిన సమయంలో అభిమానులు రోహిత్.. రోహిత్ అంటూ అరిచారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. రోహిత్ క్రేజ్ ఇలాగే ఉంటుందంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యను నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబై యాజమాన్యంపై రోహిత్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

News March 24, 2024

TDPకి జగన్ సన్నిహితుడి కంపెనీ విరాళం!

image

AP: CM జగన్ సన్నిహితుడికి చెందిన కంపెనీ TDPకి భారీ విరాళం ఇచ్చింది. కడపలో పనిచేసే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌లో గత డిసెంబర్‌లో IT సోదాలు జరిగాయి. నెల రోజుల తర్వాత ఆ కంపెనీ TDP కోసం ₹40 కోట్ల బాండ్లు కొనుగోలు చేసింది. AP ప్రభుత్వం ఈ కంపెనీ నుంచి ఎక్కువ ధరకు ట్రాన్స్‌ఫార్మర్లు కొన్నట్లు TDP నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించిన తర్వాత ఈ బాండ్లు కొనుగోలు చేయడం గమనార్హం.

News March 24, 2024

ఈ టాబ్లెట్ ఎక్కువగా వాడితే.. మరణమే!

image

మూర్ఛ, నరాల నొప్పి, ఆందోళన వంటి సమస్యలకు ప్రిగాబలిన్ టాబ్లెట్ వాడుతుంటారు. అయితే మోతాదుకు మించి వాడితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందట. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈమధ్య ప్రిగాబలిన్ అతిగా వాడి చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఇంగ్లండ్ వైద్యులు చెబుతున్నారు. దీన్ని తీసుకునేవారు ఆల్కహాల్ మానేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మోతాదులో తీసుకుంటే ఏ సమస్య ఉండదని అంటున్నారు.

News March 24, 2024

ఆ విషయంలో గర్వపడతా: జ్యోతిక

image

తన భర్త సూర్య చేసే సినిమాల్లో ఏ ఒక్క మహిళ పాత్రా కించపరిచేలా ఉండదని జ్యోతిక అన్నారు. అందుకు తాను గర్వపడతానని చెప్పుకొచ్చారు. కథ డిమాండ్ చేస్తే తన పాత్ర కన్నా లేడీ రోల్ నిడివి ఎక్కువున్నా ఆయన పట్టించుకోరని, అందుకు ‘జై భీమ్’ ఉదాహరణ అని జ్యోతిక చెప్పారు. తన సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఉండేలా సూర్య కథలు ఎంచుకుంటారని అన్నారు. సూర్య ‘షైతాన్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

News March 24, 2024

లక్నోపై రాజస్థాన్ గెలుపు

image

IPL2024లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. జైపూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20ఓవర్లలో 193 రన్స్ చేసింది. ఛేదనలో లక్నో 173/6కే పరిమితమైంది. రాజస్థాన్ కెప్టెన్ శాంసన్(82*) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించారు.

News March 24, 2024

హోలీ రోజు ఈ వస్తువులను దానం చేయకండి!

image

ఏటా ఫాల్గుణ మాసం చివరి పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. ఈ ఏడాది హోలీ పండుగ ఈ నెల 25న రాగా ఆ రోజున కొన్ని వస్తువులు దానం చేయరాదని చెబుతున్నారు. డబ్బు, పాలు, పెరుగు, పంచదార, ఆవాల నూనె, తెల్లటి వస్తువులు, పెళ్లైన స్త్రీలు పసుపు, కుంకుమ, బొట్టు, గాజులు, మేకప్ కిట్, స్టీల్ పాత్రలు వంటివి దానం చేయకూడదట. దానం చేస్తే కష్టాలు, నష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

News March 24, 2024

తేలు, గుర్రం.. అని పిలుచుకుంటారు!

image

ఉత్తర్ ప్రదేశ్‌లోని బాఘ్‌పట్‌ గ్రామంలో పేర్లన్నీ వింతగా ఉంటాయి. ఆ ఊరిలో అడుగుపెట్టగానే బిచ్చూ(తేలు), చిడియా(పిట్ట), గప్పడ్(కబుర్లు చెప్పేవాడు), ఘోడా(గుర్రం) అనే పేర్లు వినిపిస్తుంటాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆ ఊరిలో అప్పట్లో ప్రజల రూపం, క్యారెక్టర్, చేసే పనిని బట్టి వారికి పేర్లు పెట్టేవారు. తరాలు మారే కొద్దీ అవి ఇంటి పేర్లుగా మారిపోయాయి. ఇప్పటికీ అవే పేర్లతో ప్రజలు ఒకరినొకరు పిలుస్తూ ఉన్నారు.