News November 4, 2024

మార్కెట్లో చైనా డేంజర్ వెల్లుల్లి! గుర్తించండిలా

image

కేంద్రం 2014లోనే చైనా వెల్లుల్లిని నిషేధించినా అధిక లాభాలకు కొందరు దీన్ని అక్రమంగా దిగుమతి చేసి విక్రయిస్తున్నారు. దీన్ని పండించేందుకు వాడే మిథైల్ బ్రోమైడ్ వంటి రసాయనాలు అల్సర్లు, జీర్ణ, కిడ్నీ సమస్యలు, తీవ్ర దగ్గు, మెదడు దెబ్బతినడం, కాళ్లు/చేతులు మొద్దుబారడానికి కారణమవుతాయి.
☞ఈ వెల్లుల్లి సైజులో చిన్నగా, బాగా తెల్లగా/పింక్ రంగులో ఉంటుంది. తక్కువ ఘాటు వస్తుంది. సులువుగా పొట్టు తీయొచ్చు.
Share It

News November 4, 2024

పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి: సీఎం

image

TG: ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచినందుకు మంచిర్యాల విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ, ITIలు ATCలుగా మార్పు, స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి వారికి వివరించారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలను నమ్మకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. గంజాయి బారిన పడొద్దన్నారు.

News November 4, 2024

భర్తనే మళ్లీ పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్

image

మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన భర్త డేనియల్‌ వెబర్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరు 2011లోనే పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయి 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇద్దరూ వధూవరుల్లా ముస్తాబై మాల్దీవ్స్‌లో తమ ముగ్గురు పిల్లల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. వీరు ఓ పాపను దత్తత తీసుకొని, మరో ఇద్దరిని సరోగసి ద్వారా పొందారు. కాగా వీరి రీవెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

News November 4, 2024

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: హోం మంత్రి

image

APలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలన్న dy.cm <<14527352>>పవన్ కళ్యాణ్<<>> వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. ‘శాంతి భద్రతలపై CM, నేను, పోలీసులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. వాటిలో పవన్ కళ్యాణ్ భాగమే. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి రాజకీయం లేదు. పవన్ ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో తెలుసు. త్వరలో ఆయనతో మాట్లాడుతా’ అని BBCతో అన్నారు.

News November 4, 2024

అగ్రరాజ్యంలో పోలింగ్‌కు వేళాయే

image

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు కౌంట్‌డౌన్ పూర్తికానుంది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పెద్దఎత్తున జ‌రిగింది. మంగ‌ళ‌వారం పేప‌ర్ బ్యాలెట్ ఓటింగ్ జరగనుంది. USలో 24.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎల‌క్ట‌ర్ల‌ను ఎన్నుకొనే ఈ ప్రక్రియలో 50 Statesలో 538 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్నాయి. 270 గెల‌వాల్సి ఉంటుంది. రేపు 4:30PMకి పోలింగ్ ప్రారంభమై Wed 10.30AMలోపు(అన్ని చోట్ల) ముగుస్తుంది. ఆ వెంటనే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది.

News November 4, 2024

వారిద్దరి కంటే ఎక్కువ రన్స్ రాహుల్‌వే కానీ..

image

కేఎల్ రాహుల్ NZతో తొలి టెస్టులో విఫలం అయ్యారని తర్వాతి రెండు టెస్టులకు దూరం పెట్టారు. కానీ గణాంకాల ప్రకారం చూస్తే KL.. రోహిత్, విరాట్ కంటే ఎక్కువ రన్స్ చేశారు. టెస్టుల్లో గత 10 ఇన్నింగ్సుల్లో రోహిత్ 13.3 సగటుతో 133, విరాట్ 21.33 సగటుతో 192 రన్స్ చేశారు. ఇద్దరూ కలిపి 325 రన్స్ చేస్తే రాహుల్ ఒక్కడే 339 పరుగులు చేశారు.

News November 4, 2024

ఘోరం.. నలుగురు పిల్లలు మృతి

image

గుజరాత్‌లోని అమ్రేలిలో ఘోరం జరిగింది. నలుగురు పిల్లలు కారులో ఊపిరాడక చనిపోయారు. పేరెంట్స్ పనులకు వెళ్లగా 2 నుంచి 7 ఏళ్ల వయసు ఉన్న నలుగురు పిల్లలు ఆడుకుంటూ యజమాని కారులోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు. సాయంత్రం వచ్చి చూడగానే నలుగురు విగతజీవులుగా కనిపించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు.
**పిల్లలు ఆడుకునే సమయంలో ఓ కన్నేసి ఉంచండి.

News November 4, 2024

ఛార్జీలను పెంచలేదు.. జీవో ప్రకారమే సవరించాం: సజ్జనార్

image

TG: బస్సు టికెట్ ఛార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదని TGSRTC ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ‘దీపావళి తిరుగుప్రయాణ రద్దీ నేపథ్యంలో ఏర్పాటుచేసిన స్పెషల్ బస్సుల్లో మాత్రమే జీవో ప్రకారం ఛార్జీలను సవరించాం. తిరుగు ప్రయాణంలో రద్దీ ఉండకపోవడంతో బస్సులు ఖాళీగా వెళ్తుంటాయి. కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని 2003లో ప్రభుత్వం జీవో 16 తీసుకొచ్చింది’ అని వివరించారు.

News November 4, 2024

NIKE లోగోను డిజైన్ చేసింది ఈవిడే!

image

ప్రముఖ లగ్జరీ బ్రాండ్ NIKE లోగోను డిజైన్ చేసేందుకు గ్రాఫిక్ డిజైనర్ కరోలిన్ డేవిడ్‌సన్ ఎంత తీసుకున్నారో తెలుసా? ఆమె డిజైన్ స్టూడెంట్ కావడంతో లోగోను చేసినందుకు 1971లో $35లను పొందారు. ఈ లోగోకు మంచి రెస్పాన్స్ రావడంతో కంపెనీ ప్రతినిధులు డేవిడ్‌సన్‌కు 500 షేర్లను బహుమతిగా ఇచ్చారు. ఆ షేర్లను ఇప్పటికీ అలానే ఉంచగా వాటి విలువ $3 మిలియన్లకు చేరింది.

News November 4, 2024

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్

image

TG: హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. బీసీ రిజర్వేషన్లపై నెలలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విశ్రాంత ఐఏఎస్ బూసాని వెంకటేశ్వరరావును ఛైర్మన్‌గా నియమించింది. కాగా, సంక్రాంతిలోపు స్థానికసంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.