News November 4, 2024

అక్కడ రూ.3కే లీటర్ పెట్రోల్

image

లీటర్ పెట్రోల్ ధర ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో రూ.95గా ఉండగా కొన్ని రాష్ట్రాల్లో రూ.107కు చేరుకుంది. అయితే, ఆఫ్రికాలోని లిబియా, అమెరికాలోని వెనిజులాలో లీటర్ పెట్రోల్ రూ.3కే లభిస్తుంది. ప్రభుత్వ రాయితీలు, విస్తృతమైన చమురు నిల్వలు ఉండటంతో ఇంత తక్కువకే అక్కడ అందుబాటులో ఉంది. అత్యధికంగా హాంగ్‌కాంగ్‌లో రూ.275, మొనాకోలో రూ.233, ఐస్‌ల్యాండ్‌లో రూ.187, సింగపూర్‌లో రూ.173, ఇటలీలో రూ.172గా ఉంది.

News November 4, 2024

గంజాయి, అక్రమ మద్యం కట్టడిపై మంత్రుల కమిటీ

image

AP: గంజాయి నియంత్రణ, నిర్మూలన, అక్రమ మద్యం కట్టడిపై మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. హోం, ఎక్సైజ్, గిరిజన సంక్షేమం, వైద్యారోగ్య శాఖల మంత్రులు ఇందులో ఉండనున్నారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. గంజాయి, మద్యానికి బానిసలైన వారికి డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు, ఇతర అంశాలపై పరిశీలన చేసి నివేదిక సమర్పించాలంది.

News November 4, 2024

భార‌త మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణ‌మిదే!

image

స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా న‌ష్ట‌పోవ‌డానికి చైనా మ‌రో ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌టించనుందనే వార్త‌లే కార‌ణంగా తెలుస్తోంది. Nov 4-8 వరకు బీజింగ్‌లో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఆర్థిక రంగానికి ఊత‌మిచ్చేలా మరో ప్యాకేజీ ప్రకటన చేస్తారని తెలుస్తోంది! అమెరికాలో ట్రంప్ గెలిస్తే ప్యాకేజీ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో FIIలు తమ పెట్టుబడులను చైనాకు మళ్లిస్తున్నారు.

News November 4, 2024

కూటమిని ఎవరూ చెడగొట్టలేరు: పవన్ కళ్యాణ్

image

AP: రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని, కూటమిని ఎవరూ చెడగొట్టలేరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురంలో ఆయన మాట్లాడారు. వ్యక్తులు చేసే తప్పులపై చర్యలు ఉంటాయన్నారు. తాను, చంద్రబాబు చాలా క్లారిటీగా ఉన్నామని, కొంతమంది వ్యక్తులు చేసే ప్రయత్నాలు తమను ఏం చేయలేవని ఆయన చెప్పారు.

News November 4, 2024

నేనెవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు: హర్షసాయి

image

డబ్బు తీసుకుని మోసం చేశారంటూ తనపై ఓ యువతి చేసిన ఆరోపణలను యూట్యూబర్ హర్షసాయి ఖండించారు. ఈ కేసులో TG హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో కొన్ని వారాలుగా విదేశాల్లో ఉన్న అతను ఇవాళ HYD తిరిగొచ్చారు. ‘నేనెవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు. డిమాండ్ చేయలేదు. నేను తీసిన సినిమాకు వాళ్లే కాపీరైట్స్ అడిగారు. రూ.2 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేశారు. నిజాలు బయటికొచ్చాయి కాబట్టే బెయిల్ వచ్చింది’ అని చెప్పారు.

News November 4, 2024

ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు

image

AP: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. అటవీశాఖ అదనపు ముఖ్య సంరక్షణాధికారి శాంతి ప్రియా పాండే దీనికి నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ సహా నలుగురు అధికారులు ఉండనున్నారు.

News November 4, 2024

ఈనెల 24న IPL మెగా వేలం!

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2025 మెగా వేలం ఈనెల 24 & 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరగనుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోందని, త్వరలో ప్రకటన చేస్తుందని వెల్లడించాయి. అయితే, అదే సమయంలో ఈనెల 22-26 వరకు పెర్త్‌లో ఆస్ట్రేలియాతో భారత్ మొదటి టెస్టును ఆడనుంది. ఈ మ్యాచ్ ప్రసారంతో పాటు IPL వేలం ఈవెంట్ ప్రసారం చేయడంలో హాట్‌స్టార్‌ ఇబ్బందిపడే అవకాశం ఉంది.

News November 4, 2024

మ్యూజిక్ లెజెండ్ జోన్స్ మృతి

image

హాలీవుడ్ సంగీత నిర్మాత, మ్యూజిక్ లెజెండ్ క్విన్సీ జోన్స్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో 91 ఏళ్ల జోన్స్ చనిపోయినట్లు కుటుంబసభ్యులు మీడియాకు వెల్లడించారు. మైఖేల్ జాక్సన్, ఫ్రాంక్ సినాట్రా, రే చార్లెస్ వంటి స్టార్లతో ఆయన పనిచేశారు. 1982లో జాక్సన్‌తో థ్రిల్లర్ ఆల్బమ్‌ను రూపొందించి సెన్సేషన్ సృష్టించారు. జోన్స్ 80 సార్లు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డులకు నామినేట్ అవ్వగా 28 సార్లు గెలుపొందారు.

News November 4, 2024

హిమాయత్ సాగర్‌పై హైడ్రా ఫోకస్?

image

హైదరాబాద్‌కు నీళ్లు అందించే వనరుల్లో ఒకటైన హిమాయత్ సాగర్‌పై హైడ్రా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీ, సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ఆధారంగా FTL, బఫర్ జోన్‌లను గుర్తించనున్నట్లు సమాచారం. రెండో విడతగా ORR పరిధిలోని 549 చెరువులపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ప్రతి చెరువు హద్దులు గుర్తించి జియో ట్యాగింగ్ చేయబోతున్నారు.

News November 4, 2024

CRDAపై సీఎం చంద్రబాబు సమీక్ష

image

AP: CRDA అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో భేటీ అయ్యారు. రాజధాని అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలపై టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదికపై వారితో చర్చిస్తున్నారు. కమిటీ సూచనలు, అదనపు ఆర్థిక భారంపై ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు. మళ్లీ అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిర్మాణ సంస్థలతో వివాదాల పరిష్కారానికి చర్యలపై సమీక్షిస్తున్నారు.