News November 4, 2024

విజయవాడ-శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’.. 9న ప్రయోగం

image

AP: విజయవాడ పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ జర్నీకి ఈ నెల 9న CM చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఆ 2 ప్రాంతాల మధ్య దీన్ని నడిపేందుకు ఉన్న అనుకూలతలపై అధికారులు తొలుత ప్రయోగం నిర్వహిస్తారు. ఇది విజయవంతమైతే రెగ్యులర్ సర్వీసును ప్రారంభిస్తారు. దీనివల్ల పర్యాటక రంగానికి మరింత ఊతం వస్తుందని భావిస్తున్నారు.

News November 4, 2024

నేడే ఫలితాలు విడుదల

image

ఏపీ టెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్‌ను అధికారికంగా రిలీజ్ చేస్తారు. అభ్యర్థులు <>aptet.apcfss.in<<>> వెబ్‌సైట్‌లో తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ పరీక్షలకు 3,68,661 మంది హాజరయ్యారు. టెట్ ఫలితాలు రానుండటంతో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది.

News November 4, 2024

విజయ్ దేవరకొండ సినిమాలో ‘ది మమ్మీ’ నటుడు?

image

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హాలీవుడ్ సినిమా ‘ది మమ్మీ’తో పాపులరైన ఆర్నాల్డ్ వోస్లూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. 1854-78 మధ్య కాలంలో జరిగే ఈ కథలో విజయ్ పాత్ర తర్వాత ఆయన క్యారెక్టర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఈ మూవీ షూటింగ్ 2025 జనవరి నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సుంది.

News November 4, 2024

ఇవాళే టెట్ నోటిఫికేషన్

image

TG: ఇవాళ టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ ఏడాది మే, జూన్‌లో తొలి టెట్ నిర్వహించింది. ఇవాళ రెండో టెట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వనుండగా జనవరిలో పరీక్షలు జరపనుంది. మేలో నిర్వహించిన టెట్‌లో 1.09 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. ఇటీవల డీఎస్సీ కూడా పూర్తి కావడంతో ఈసారి పరీక్ష రాసే వారి సంఖ్య స్వల్పంగా తగ్గొచ్చని అధికారులు భావిస్తున్నారు.

News November 4, 2024

రేపటి నుంచి వరల్డ్ ట్రావెల్ మార్కెట్.. నేడు లండన్‌కు మంత్రి జూపల్లి

image

TG: ఈనెల 5 నుంచి 7 వరకు జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌లో పాల్గొనేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ లండన్‌కు వెళ్లనున్నారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, పర్యాటక రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన UK పర్యటన సాగనుంది. ప్రపంచ పర్యాటకులకు తెలంగాణ చరిత్ర, వారసత్వ సంపద తెలిసేలా పర్యాటక శాఖ అక్కడ ఓ స్టాల్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ట్రావెల్ మార్ట్‌లో 100కు పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు.

News November 4, 2024

ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్‌.. నలుగురు యువకులు మృతి

image

AP: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాడిపర్రులో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై నలుగురు యువకులు మృతిచెందారు. మృతులను వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉండ్రాజవరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 4, 2024

ఇంకా 35 రోజులే మిగిలింది.. మీ హామీలెక్కడ?: KTR

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదంతా అటెన్షన్ డైవర్షన్‌తో పబ్బం గడిపిందని X వేదికగా KTR విమర్శలు గుప్పించారు. ‘100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 330 రోజులు ముగిశాయి. ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది. 2లక్షల ఉద్యోగాలు, రైతు భరోసా, రూ.4వేల పెన్షన్ వంటి హామీలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు. జవాబు చెప్తావా రాహుల్ గాంధీ?’ అని ప్రశ్నించారు.

News November 4, 2024

రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల మహా సంగ్రామానికి మరికొన్ని గంటల్లో తెర లేవనుంది. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పోలింగ్ మంగళవారం జరగనుంది. ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌లో 6.8Cr మంది పాల్గొన్నారు. చివరివరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ట్రంప్, కమల ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సోమవారం రాత్రితో వారి ప్రచారం ముగియనుంది. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలను బట్టి ట్రంప్, కమల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తేలింది.

News November 4, 2024

రాష్ట్రంలో పెరిగిన భూగర్భ జలమట్టం

image

TG: ఈసారి కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. మేలో భూగర్భ జలమట్టం సగటున 10.36 మీటర్లు ఉండగా, అక్టోబర్‌లో అది 5.38 మీటర్లకు చేరింది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 8.69 మీటర్లు, ఆదిలాబాద్ 7.66 మీ. భూపాలపల్లిలో 7.35 మీ. మహబూబ్‌నగర్‌లో 6.94 మీ. మేర జలమట్టం పెరిగింది. యాదాద్రి-భువనగిరి జిల్లాలో అత్యల్పంగా 2.64 మీటర్ల మట్టం పెరిగింది.

News November 4, 2024

హీరోయిన్‌ను కూడా హీరోలే డిసైడ్ చేస్తారు: తాప్సీ

image

సినీ ఇండస్ట్రీపై బోల్డ్‌గా మాట్లాడే హీరోయిన్ తాప్సీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఒక సినిమాలో అప్పటికే పెద్ద హీరో ఉన్నాడంటే ఎక్కువ డబ్బు పెట్టి హీరోయిన్‌ను తీసుకోరని చెప్పారు. పైగా ఎవర్ని తీసుకోవాలనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లు మాత్రమే హీరో మాటను కాదని కథకు తగ్గట్లు హీరోయిన్లను ఎంపిక చేసుకుంటారని ఓ ఇంటర్వ్యూలో తాప్సీ చెప్పారు.