News December 29, 2024

నెలాఖరులో రూ.1000 కోట్ల మద్యం అమ్మకాలు?

image

TG: కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే స్టాక్ మద్యం డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. గత మూడు రోజుల్లో రూ.565 కోట్ల విలువైన మద్యం లిఫ్ట్ చేసినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. ఇవాళ మద్యం డిపోలకు సెలవుదినం అయినప్పటికీ స్టాక్ పంపిణీకి ఓపెన్ ఉంచనున్నారు. ఈ ఏడాది నెలాఖరుకు రూ.1000 కోట్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News December 29, 2024

జనవరి 1న సెలవు లేదు

image

జనవరి 1న ఏపీలో పబ్లిక్ హాలిడే లేదు. ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే మాత్రమే ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని చేస్తాయి. అటు తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది.

News December 29, 2024

హైదరాబాద్‌లో మన్మోహన్ విగ్రహం?

image

TG: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు హైదరాబాద్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏదైనా ప్రధాన జంక్షన్ వద్ద ఈ విగ్రహం ఉంటుందని సమాచారం. అదే విధంగా ఏదైనా పథకానికి కూడా మన్మోహన్ పేరును పెట్టొచ్చని తెలుస్తోంది. రేపు జరిగే శాసనసభ ప్రత్యేక సమావేశంలో దీనిపై సీఎం రేవంత్ ప్రకటించే ఛాన్స్ ఉంది.

News December 29, 2024

విరాట్‌తో నితీశ్ కుటుంబం ఫొటో

image

నితీశ్ కుమార్ రెడ్డి విరాట్ కోహ్లీకి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. నిన్న సెంచరీతో చెలరేగిన అతడికి విరాట్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. నితీశ్ కుటుంబంతో కలిసి ఫొటో దిగారు. అభిమానించే స్థాయి నుంచి ఆ అభిమాన ఆటగాడి చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ అందుకుని, బ్యాటింగ్‌లో చెలరేగుతున్న నితీశ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మున్ముందు నితీశ్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో మరింత పైన ఆడించాలని రవిశాస్త్రి సూచించారు.

News December 29, 2024

AUSvsIND: భారత్ ఆలౌట్

image

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో భారత్ 369 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న రాత్రి సెంచరీతో నాటౌట్‌గా ఉన్న నితీశ్, వేగంగా పరుగులు చేసే క్రమంలో లయన్ బౌలింగ్‌లో 114 పరుగులకు ఔటయ్యారు. ఆస్ట్రేలియాకు 105 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయన్‌కు తలో 3 వికెట్లు దక్కాయి.

News December 29, 2024

వచ్చే నెల 20న దావోస్‌కు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ వచ్చే నెల 20న దావోస్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ వార్షిక ఆర్థిక సదస్సులో ఆయన, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొంటారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల్ని తీసుకురావడమే ఈ పర్యటన లక్ష్యమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సదస్సులో ప్రత్యేకంగా ‘తెలంగాణ పెవిలియన్’ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి.

News December 29, 2024

పేర్ని నానిపై ఎటువంటి కక్ష లేదు: నాదెండ్ల

image

వైసీపీ నేత పేర్ని నానిపై తమకు ఎలాంటి కక్షా లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘కుట్రలు చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. తప్పు చేయకపోతే నాని జరిమానా ఎందుకు కట్టారు? ఆ గోడౌన్‌ను తన భార్య పేరుతో ఎందుకు తీసుకున్నారు? ఎవరి పేరిట ఉంటే వారిపైనే కేసులు నమోదవుతాయి. గిడ్డంగుల తనిఖీల అనంతరం నోటీసులిచ్చినా నాని ఎప్పుడూ స్పందించలేదు. YSRCP ఐదేళ్లపాటు అరాచకపాలన సాగించింది’ అని విమర్శించారు.

News December 29, 2024

పెళ్లిలో విందు బాలేదని గొడవ.. ఆ వెంటనే వరుడికి మరో పెళ్లి!

image

యూపీలోని చందౌలీ జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. మెహతాబ్ అనే వరుడికి 7నెలల క్రితం స్థానిక యువతితో పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లి రోజున అతడి కుటుంబీకులు విందు విషయంలో ఆడపెళ్లివారితో గొడవపడ్డారు. ఎంత నచ్చచెప్పినా వినకుండా పెళ్లి ఆపేశారు. ఆ రాత్రే మెహతాజ్ వేరే అమ్మాయిని రహస్యంగా పెళ్లాడాడు. దీంతో పెళ్లి రద్దుకోసం అతడి కుటుంబీకులు డ్రామా ఆడి తమను మోసం చేశారని ఆడపెళ్లివారు పోలీసుల్ని ఆశ్రయించారు.

News December 29, 2024

14,300 అడుగుల ఎత్తులో ఛత్రపతి శివాజీ విగ్రహం

image

భారత్-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సో సరస్సు తీరం వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ నెల 26న ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్, మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీ కమాండర్లు విగ్రహాన్ని ఆవిష్కరించారని ఆర్మీ పేర్కొంది. విగ్రహం బలగాల్లో స్ఫూర్తి నింపడంతో పాట భారత వీరత్వాన్ని ప్రత్యర్థులకు గుర్తుచేస్తుందని స్పష్టం చేసింది.

News December 29, 2024

మా ఫోన్ ఎత్తాలంటే డీజీపీ భయపడుతున్నారు: బొత్స

image

AP: DGP ద్వారకా తిరుమలరావు బలహీనంగా మారారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కడప పర్యటనలో భద్రతావైఫల్యానికి ఎవర్ని బాధ్యుల్ని చేస్తారు? ఈ ప్రభుత్వం ఏమైపోయింది? డీజీపీ మా ఫోన్ ఎత్తాలంటేనే భయపడుతున్నారు. మంత్రి కొండపల్లిపై వార్తలన్నీ తెలుగుదేశం సృష్టి. అభద్రతాభావంతోనే ఇలాంటి ప్రచారాలు చేసి కొండపల్లిని ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారు’ అని స్పష్టం చేశారు.