News March 22, 2024

సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’

image

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించిన భారీ యాక్షన్ డ్రామా ‘ఆపరేషన్ వాలెంటైన్’ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈనెల 29న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు రాగా.. ఈరోజు అమెజాన్ ప్రైమ్ OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్షమైంది. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

News March 22, 2024

CAA హెల్ప్‌లైన్ నంబర్ 1032

image

CAA దరఖాస్తుదారుల సందేశాలు తీర్చడం, సమాచారం అందించడానికి కేంద్ర హోంశాఖ ‘1032’ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. 2014 డిసెంబర్‌కు ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు పౌరసత్వానికి అర్హులు.

News March 22, 2024

లాసెట్ నోటిఫికేషన్ విడుదల

image

APలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ నోటిఫికేషన్‌ను ANU విడుదల చేసింది. 3, 5 ఏళ్ల LLB కోర్సులు, 2 ఏళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జరిమానాతో మే 29 వరకు అప్లై చేయవచ్చు. జూన్ 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. జూన్ 9న ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.

News March 22, 2024

రెండు నెలలు పండుగే.. బెట్టింగ్ జోలికి వెళ్లకండి!

image

బిజీ లైఫ్‌‌లో కాస్త ఉపశమనం ఇచ్చేందుకు బిగ్గెస్ట్ క్రికెట్ ఫెస్టివల్ సిద్ధమైంది. రెండు నెలల పాటు నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్‌ కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 10 టీమ్స్ తలపడే టోర్నీలో రెండు నెలల పాటు 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. మరి ఈసారి IPL ట్రోఫీ గెలిచేదెవరో చూడాలి. క్రికెట్‌ను చూస్తూ ఎంజాయ్ చేయండి. కానీ, బెట్టింగ్ పెట్టి అప్పులపాలై కుటుంబాన్ని రోడ్డున పడేయకండి.

News March 22, 2024

ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ

image

TG: రైతులకు ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. నిజామాబాద్, కామారెడ్డిలో వడగళ్లతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆయన.. ‘ప్రాథమిక అంచనా ప్రకారం 40వేల ఎకరాల్లో నష్టం జరిగింది. అధికారుల సర్వే పూర్తయ్యాక ఎకరానికి ₹10వేల పరిహారం అందిస్తాం. KCR చేసిన ₹8లక్షల కోట్ల అప్పులకు ₹60వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోంది’ అని విమర్శించారు.

News March 22, 2024

విశాఖ తీరంలో డ్రగ్స్ ఉప్పెన.. పార్టీల విమర్శల హోరు

image

AP: వైజాగ్ పోర్టులో 25,000 KGల డ్రగ్స్‌ను CBI స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పేరిట కంటైనర్ డెలివరీకాగా, ఆ కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు, సీఈవో కోటయ్య చౌదరి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. వారిద్దరికీ బీజేపీ, టీడీపీ నేతలతో సంబంధాలున్నాయని వైసీపీ.. అధికార పార్టీతో లింకులున్నాయని విపక్షాలు ఫొటోలు రిలీజ్ చేస్తున్నాయి. ఎన్నికల వేళ ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

News March 22, 2024

రోజూ బిర్యానీ తినిపించేవాడినే పెళ్లాడతా: హీరోయిన్

image

ప్రతీ రోజూ జోక్స్ వేస్తూ.. ఒక పూట బిర్యానీ తినిపించేవాడినే పెళ్లాడతానని హీరోయిన్ ప్రసాద్ కోమలి అన్నారు. ‘గతంలో ఓ వ్యక్తిని ప్రేమించా. కానీ మా ఇద్దరికీ బ్రేకప్ అయింది. ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నా. నేను తెలుగమ్మాయిని కాబట్టే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ కొంతమంది నేను ముంబై నుంచి వచ్చానని అనుకుంటారు’ అని ఆమె పేర్కొన్నారు. హిట్ 2, నేను సీతాదేవి, శశివదనే సినిమాల్లో ఆమె నటించారు.

News March 22, 2024

అరెస్టయిన మాజీ సీఎంలు వీరే..

image

పదవిలో ఉండగా అరెస్టయిన మొదటి వ్యక్తిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిలిచారు. గతంలో ఏడుగురు మాజీ సీఎంలు పలు అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా(బిహార్), అక్రమాస్తుల కేసులో జయలలిత(తమిళనాడు), టీచర్ నియామకాల్లో అవినీతి కేసులో ఓం ప్రకాశ్ చౌతాలా(హరియాణా), మైనింగ్ కేసులో మధుకొడా, హేమంత్ సోరెన్(ఝార్ఖండ్), స్కిల్ స్కామ్‌ కేసులో చంద్రబాబు జైలుపాలయ్యారు.

News March 22, 2024

ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది: చద్దా

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మండిపడ్డారు. ‘ఎమర్జెన్సీని ప్రకటించనప్పటికీ.. ఇండియాలో పరిస్థితులు అలానే ఉన్నాయి. ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సీఎంలను లోక్‌సభ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేస్తున్నారు. ఇదివరకు ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం చూడలేదు. బలమైన ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.

News March 22, 2024

అజ్ఞాతంలోకి ప్రభాకర్‌రావు?

image

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మాజీ DSP ప్రతీణ్‌రావు అరెస్టుతో అప్రమత్తమైన ప్రభాకర్ USA వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 2018 నుంచే ప్రభాకర్ ఆధ్వర్యంలో ట్యాపింగ్ సాగినట్లు భావిస్తున్న పోలీసులు.. ఇందుకోసం ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేసినట్లు తేల్చారు.