News March 22, 2024

శుభ ముహూర్తం

image

తేదీ: మార్చి 22, శుక్రవారం,
ఫాల్గుణము
శుద్ధ త్రయోదశి: ఉదయం 07:17 గంటలకు
మఖ: తెల్లవారుజామున 04:28 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 08:37-09:25 గంటల వరకు,
మధ్యాహ్నం 12:38-01:26 గంటల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 02:57-04:45 గంటల వరకు

News March 22, 2024

పారిస్ ఒలింపిక్స్.. అథ్లెట్లకు 3 లక్షల కండోమ్స్!

image

పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. అథ్లెట్లు శృంగారంలో పాల్గొనడంపై టోక్యో ఒలింపిక్స్‌లో అమలైన నిషేధాన్ని ఈసారి రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. 14,250 మంది అథ్లెట్లకు 3లక్షల కండోమ్స్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అథ్లెట్లకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా 2020 టోక్యో ఒలింపిక్స్‌ టైమ్‌లో కరోనా వ్యాప్తి కారణంగా శృంగారంపై నిషేధం అమలైంది.

News March 22, 2024

HEADLINES

image

* లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్
* కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన ప్రతిపక్షాలు
* హోలీ లోపే అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్
* 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల
* 9 మందితో బీజేపీ మూడో జాబితా విడుదల
* విశాఖ పోర్టులో 25వేల కేజీల డ్రగ్స్ పట్టివేత
* చెన్నై కెప్టెన్‌గా తప్పుకున్న ధోనీ
* రేపటి నుంచి IPL ప్రారంభం

News March 22, 2024

డ్రగ్స్‌కు అడ్డాగా ఆంధ్రప్రదేశ్: పవన్

image

AP: రాష్ట్రం మాదక ద్రవ్యాలకు అడ్డాగా నిలిచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు రాష్ట్రంలోనే ఉంటున్నాయి. విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ దొరకడం సిగ్గు చేటు. వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు రాజధానికి మార్చింది. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఆపరేషన్ గరుడ నిర్వహించి డ్రగ్స్ మాఫియాను అరికట్టాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

News March 21, 2024

కేజ్రీవాల్ అరెస్టుపై ఎవరేమన్నారంటే?

image

* ప్రతిపక్షాలను BJP బలహీనపర్చాలని చూస్తోంది – ఖర్గే
* అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కాలరాస్తోంది – సీఎం స్టాలిన్
* ఎన్నికలకు భయపడేవారే ఇలాంటి అరెస్టులకు పాల్పడతారు – కేరళ సీఎం
* దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ ప్రతిపక్షాలపై దాడులు – శరద్ పవార్
* మోదీ ప్రజలకు భయపడుతున్నారు – సీతారాం ఏచూరి
* బీజేపీ భయపడుతోంది – శివసేన(UBT)

News March 21, 2024

కేజ్రీవాల్ అరెస్ట్.. 2022లోనే చెప్పిన ఆస్ట్రాలజర్

image

సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఆస్ట్రాలజర్ రుద్ర కరణ్ పర్తాప్ చెప్పిన జ్యోతిషం నిజమైంది. ‘మార్చి 2024 నుంచి కేజ్రీవాల్‌కు బ్యాడ్ టైమ్ మొదలవుతుంది. తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. అరెస్ట్ అవుతారు. తర్వాత ఢిల్లీ సీఎం ఎవరో కూడా నాకు తెలుసు. తర్వాత చెబుతా. అతడి కర్మ ఫలం 2025 ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోయేలా చేస్తుంది. తర్వాత నుంచి కేజ్రీవాల్ రాజకీయ పతనం మొదలవుతుంది’ అని 2022 మార్చి 25న ఆయన ట్వీట్ చేశారు.

News March 21, 2024

షమీ.. నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నాడు: మాజీ భార్య

image

టీమ్ఇండియా క్రికెటర్ షమీపై మాజీ భార్య హసిన్ జహాన్‌ సంచలన ఆరోపణలు చేశారు. ‘షమీ నన్ను హత్య చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. UP పోలీసుల సహాయంతో అతడు ఈ పథకం రచిస్తున్నాడు’ అని సంచలన కామెంట్స్ చేశారు. కాగా షమీ, జహాన్‌ను 2014లో పెళ్లి చేసుకున్నారు. 2015లో వారికి ఓ కూతురు జన్మించింది. 2018లో కట్నం సహా పలు అంశాలలో షమీ వేధిస్తున్నాడంటూ అతడిపై కేసు పెట్టారు. అప్పటి నుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.

News March 21, 2024

ఈ పైశాచిక శక్తికి అవేమీ సరిపోవడంలేదు: రాహుల్

image

కేజ్రీవాల్ అరెస్టుతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ‘ఈ భయపడే నియంత ప్రజాస్వామ్యానికి ఉనికి లేకుండా చేస్తున్నాడు. మీడియాతో సహా అన్ని సంస్థలను భయపెట్టడం, పార్టీలను చీల్చడం, కంపెనీల నుంచి డబ్బులు దండుకోవడం, ప్రధాన ప్రతిపక్షం అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడం ఈ పైశాచిక శక్తికి సరిపోలేదు. ఇప్పుడు సీఎంలను అరెస్ట్ చేయిస్తున్నాడు. దీనంతటికీ INDIA తగిన సమాధానం చెబుతుంది’ అని ట్వీట్ చేశారు.

News March 21, 2024

మేఘా కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందంటే..

image

1.బీజేపీకి రూ.584 కోట్లు
2.BRSకు రూ.212 కోట్లు
3.డీఎంకేకు రూ.85 కోట్లు
4.YSRCPకి రూ.37 కోట్లు
5.TDPకి రూ.28 కోట్లు
6.కాంగ్రెస్ పార్టీకి రూ.18 కోట్లు
7.జేడీయూకు రూ.5 కోట్లు
8.జనసేనకు రూ.4 కోట్లు

News March 21, 2024

BJPకి ఎక్కువ విరాళాలు ఇచ్చిన కంపెనీలివే

image

1.మేఘా ఇంజినీరింగ్ (MEIL): రూ.584 కోట్లు
2.క్విక్ సప్లై: రూ.375 కోట్లు
3.వేదాంత లిమిటెడ్: రూ.226 కోట్లు
4.భారతీ ఎయిర్‌టెల్: రూ.197 కోట్లు
**కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా వేదాంత లిమిటెడ్ రూ.125 కోట్లు ఇచ్చింది.
SOURCE: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సైట్‌లోని ఎలక్టోరల్ బాండ్లు