India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను స్మరించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘అగాధపు అంచుల నుంచి అద్భుత ప్రస్థానం వరకు.. భారత ఆర్థిక వ్యవస్థకు భాగ్య విధాత. మన్మోహన్ జీ.. మా హృదయాల్లో మీ స్థానం శాశ్వతం’ అని పేర్కొన్నారు. ఇవాళ సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. మన్మోహన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు.

TG: కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అర్హుల ఆదాయపరిమితి ప్రస్తుతం గ్రామాల్లో ₹1.50L, పట్టణాల్లో ₹2L ఉండగా, దాన్ని మరో ₹20K పెంచుతారని తెలుస్తోంది. ప్రజా పాలనలో 10L దరఖాస్తులు రాగా JAN మొదటి వారం నుంచి మరో అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. కార్డుల్లో మార్పులపై కూడా దరఖాస్తులు స్వీకరిస్తారని సమాచారం. 30న జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కార్ల ధరలు పెంచుతామని ప్రకటించిన పలు కంపెనీలు కొత్త ఏడాది నుంచి వాటిని అమల్లోకి తీసుకురానున్నాయి. దీంతో పాటు NBFC, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లలో నిబంధనలతో పాటు GST పోర్టల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. యూపీఏ 123పే ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.5వేల నుంచి రూ.10వేలకు పెరగనుంది.

శబరిమల ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండల పూజలు ముగియడంతో దర్శనాలు ఆపేశారు. ఈ నెల 30న ఆలయం తిరిగి తెరుచుకోనుంది. ఇప్పటివరకు 32.50 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శబరిమల కొండపై జనవరి 14న మకరజ్యోతి దర్శనం జరగనుంది. జనవరి 20న పడిపూజతో యాత్ర ముగియనుంది.

‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. తాజాగా KBCలో తాను అల్లు అర్జున్, అమితాబ్ ఫ్యాన్ అని ఓ కంటెస్టెంట్ చెప్పారు. దీనికి అల్లు అర్జున్ అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడని, ఈ గుర్తింపునకు అతను అర్హుడని పేర్కొన్నారు. తాను కూడా పుష్ప-2తో AAకు అభిమానిని అయ్యానని చెప్పారు. ఆయనతో తనను పోల్చవద్దని బిగ్ బీ పేర్కొన్నారు.

గతేడాది కేంద్రం ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను పొడిగించేందుకు ‘ఢిల్లీ సర్వీసెస్ బిల్లు’ను రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు పాసైతే ఢిల్లీ అధికారాలు కేంద్రం చేతుల్లోకి వెళ్తాయని, అడ్డుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ మన్మోహన్ సింగ్ను అభ్యర్థించారు. 90 ఏళ్ల వయసు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా వీల్ఛైర్లో వచ్చి ఓటు వేశారు. మన్మోహన్ అంకితభావాన్ని ప్రధాని మోదీ సైతం కొనియాడారు.

TG: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ విజృంభిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ సైట్ meeseva.telangana.gov.in కాగా meesevatelangana.in పేరుతో నకిలీది సృష్టించారు. కొత్తగా మీ సేవ కేంద్రాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ HYD కలెక్టర్ పేరుతో ఫేక్ ఉత్తర్వులు రూపొందించారు. అది చూసి చాలా మంది ఆన్లైన్లో చెల్లింపులు చేశారు. ఈ స్కామ్పై సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోంది. నకిలీ సైట్ను బ్లాక్ చేసింది.

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. నిన్న 59,564 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీకి రూ.4.18 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

మాజీ ప్రధాని, భారత ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయనకు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. నిజమైన భారత రత్నం ఇతడేనని, ఈయనకు భారత అత్యున్నత పురస్కారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు సార్లు ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తుచేస్తున్నారు. సింగ్కు 1987లోనే పద్మవిభూషణ్ వరించింది.

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్సులో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ 140, లబుషేన్ 72, ఖవాజా 57, కొన్ట్సస్ 60, కమిన్స్ 49 పరుగులతో రాణించారు. బుమ్రా4 , జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక వికెట్ తీశారు.
Sorry, no posts matched your criteria.