News March 17, 2024

కాంగ్రెస్‌లో చేరిన BRS ఎంపీ, ఎమ్మెల్యే

image

TG: BRS పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయమే కాంగ్రెస్ పార్టీలోకి గేట్లు తెరిచామని సీఎం రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో కాసేపటి క్రితం అన్నారు.

News March 17, 2024

వాళ్లను రాళ్లతో కొట్టించమంటారా?: CM రేవంత్

image

TG: గత పాలకులు చేసిన తప్పులకు ఎలాంటి శిక్షలుంటాయని ఎదురైన ప్రశ్నకు సీఎం రేవంత్ స్పందించారు. ‘ఓటమే వారికి పెద్ద శిక్ష. ఆ దెబ్బకు కిందపడి విరగడం కూడా మీరు చూశారు. అంతకంటే పెద్దశిక్ష ఏం ఉంటుంది. ఇంకా బలమైన శిక్షలేమైనా ఉంటే మీరే(రిపోర్టర్) సూచించాలి. అమరవీరుల స్తూపం వద్ద రాళ్లతో కొట్టించమంటారా?. మీ సూచనను ప్రభుత్వం పరిశీలిస్తుంది(నవ్వుతూ)’ అని రేవంత్ అన్నారు.

News March 17, 2024

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి?

image

TG: బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఎంపీ రంజిత్‌రెడ్డి ఇవాళ సాయంత్రం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఆయనకు హస్తం పార్టీ చేవెళ్ల లోక్ సభ సీటును కేటాయించనున్నట్లు తెలుస్తోంది. తొలుత పట్నం సునీతారెడ్డికి ఈ సీటును ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు రంజిత్‌రెడ్డి చేరికతో ఆమెను మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్ఠానం సూచించిందట.

News March 17, 2024

RS ప్రవీణ్‌కుమార్‌కు మంచి ఆఫర్ ఇచ్చా: సీఎం రేవంత్

image

TG: RS ప్రవీణ్ కుమార్ BRSలో చేరనున్నారనే వార్తలపై CM రేవంత్ రెడ్డి స్పందించారు. ‘ప్రవీణ్ BRSలో చేరతారని అనుకోను. ఆయన పట్ల నాకు గౌరవం ఉంది. సర్వీసులో ఉంటే DGP అయ్యేవారు. మొన్న కూడా నేను ఆయనకు TSPSC ఛైర్మన్ ఆఫర్ ఇచ్చా. కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. సమాజానికి ఇంకా ఏదో చేయాలన్న తపనతో ఉన్నారు. ఇప్పుడు KCRతో చేరితే దానిపై ఆయనే ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని అన్నారు.

News March 17, 2024

వారికి రైతు భరోసా ఇవ్వడం కుదరదు: CM

image

TG: రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘5 ఎకరాలలోపు ఉన్న దాదాపు 62 లక్షల మంది రైతులకు రైతుబంధు డబ్బు అందించాం. భవిష్యత్తులో రైతు భరోసా పథకం గుట్టలు, చెట్లు, లేఅవుట్లకు ఇవ్వడం కుదరదు. వ్యవసాయ భూమి ఉన్న వారెవరైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు’ అని రేవంత్ స్పష్టం చేశారు.

News March 17, 2024

ఏపీలో TDP కూటమికి ఒక్క సీటూ రాదు: విజయసాయి

image

AP: ఎంపీ ఎన్నికల్లో TDP-జనసేన-BJP కూటమికి ఒక్క సీటూ రాదని YCP MP విజయసాయిరెడ్డి అన్నారు. ‘TDP ఎంపీ సీట్లు గెలుస్తుందని BJP కూడా నమ్మడం లేదు. కమలం పార్టీ సొంతంగా 370 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. NDA టార్గెట్ 400గా ఉంది. అంటే NDAలోని శివసేన, TDP, జనసేన, NCP, JDU, RLD, LJP కలిసి 30 సీట్లు మాత్రమే గెలుస్తాయని అంచనా. కాబట్టి ఏపీలో TDP కూటమికి జీరో సీట్లు వస్తాయి’ అని ట్వీట్ చేశారు.

News March 17, 2024

అశ్విన్‌కు 500గోల్డ్ కాయిన్లు.. రూ.కోటి నజరానా

image

టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌‌ను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఇటీవల టెస్టు క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు, 500 వికెట్ల మైలురాయి చేరుకున్నందుకు అతడికి 500 గోల్డ్ కాయిన్లు, రూ.కోటి నజరానా ప్రకటించింది.

News March 17, 2024

అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తాం: CM

image

TG: ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్ స్పందించారు. ‘నా పేషీలో బ్రాహ్మిణ్, ముస్లిం, దళిత్, ఓబీసీ నుంచి ఒక్కొక్కరు, ఇద్దరు రెడ్లున్నారు. నలుగురిని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా తీసుకుంటే.. అందులో ముస్లిం, దళిత్, రెడ్డి, బ్రాహ్మిణ్ ఉన్నారు. కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకంలోనూ సామాజిక న్యాయం పాటించాం’ అని అన్నారు. సోషల్ మీడియాలో విమర్శలను పట్టించుకోవద్దన్నారు.

News March 17, 2024

కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలు పీకేస్తున్నా: రేవంత్ రెడ్డి

image

TG: ప్రభుత్వంలో కొందరు అధికారులు కేసీఆర్ కోవర్టులుగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. అవి వాసనలు వెదజల్లుతున్నాయి. ఇప్పటికే కొన్నింటిని పీకేశాను. ఇంకా పీకాల్సినవి ఉన్నాయి. అందుకు రోజుకు 18 గంటలు పనిచేస్తా. గంజాయి మొక్క అనేది లేకుండా చేస్తా’ అని వెల్లడించారు.

News March 17, 2024

నా భర్తంటే ఇష్టంలేదు.. అందుకే విడాకులిచ్చా: నటి

image

ఒకప్పుడు తన భర్తే తనకు శత్రువు అని హీరోయిన్ మనీషా కోయిరాలా అన్నారు. ‘నా భర్తకు నాపై ఎప్పుడూ ప్రేమ లేదు. నాకు కూడా అతనంటే ఇష్టం లేదు. పెళ్లైన కొద్ది రోజులకే నాకు శత్రువుగా మారాడు. ఓ స్త్రీ జీవితంలో ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది. అందుకే అతడికి విడాకులు ఇచ్చా’ అని చెప్పారు. కాగా 2010లో బిజినెస్ మేన్ సామ్రాట్ దహల్‌ను మనీషా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 6 నెలలకే విడాకులు తీసుకున్నారు.