India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్నికల నిర్వహణ నిబంధనలు- 1961లోని రూల్ 93కి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కాంగ్రెస్ ఆశ్రయించింది. ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు(CCTV, వెబ్కాస్టింగ్ ఫుటేజీ) సామాన్యులకు అందుబాటులో ఉంచకుండా నిబంధనలు సవరించారు. సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా రూల్స్ మార్చడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా రికార్డులు నెలకొల్పుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద రూ.704.25 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో హిందీ సినిమా చరిత్రలో రూ.700+ కోట్లు(NET) సాధించిన తొలి సినిమాగా చరిత్ర లిఖించిందని మేకర్స్ ట్వీట్ చేశారు. కేవలం 19 రోజుల్లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ1700+ కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

జమిలి ఎన్నికలపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తొలిసారిగా Jan 8న భేటీ కానుంది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల న్యాయ బిల్లును కేంద్రం గత వారం లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జేపీసీ తొలి సమావేశంలో అధికారులు ఈ రెండు బిల్లులపై సభ్యులకు వివరించనున్నారు. JPCలో 39 మంది సభ్యులున్నారు.

టాలీవుడ్లో మరోసారి రీరిలీజ్ మేనియా మొదలైంది. సిద్ధార్థ్ హీరోగా ఆనంద్ రంగా తెరకెక్కించిన ‘ఓయ్’ మూవీ మరోసారి రీరిలీజ్కు సిద్ధమైంది. కొత్త ఏడాదిని ఓయ్తో ప్రారంభించేందుకు జనవరి 1న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఈ చిత్రం రీరిలీజైంది. అలాగే మాస్ మహారాజా రవితేజ బర్త్ డే సందర్భంగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘నేనింతే’ మూవీ జనవరి 26న విడుదల కానుంది.

సరికొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచ్చేందుకు ఏడాది సమయం పట్టొచ్చని సమాచారం. 2025 బడ్జెట్ సెషన్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం లేదని తెలిసింది. ప్రస్తుత IT చట్టంలో 23 ఛాప్టర్లు ఉన్నాయి. వాటన్నిటినీ సింప్లిఫై చేయడం అంత సులభం కాదు. కొత్త నిబంధనలు, అనుబంధ వ్యవస్థలు, ఫార్ములేషన్స్ను పక్కాగా పరీక్షించాల్సి ఉంటుంది. బ్యాక్ఎండ్ సిస్టమ్స్ అప్గ్రెడేషనూ ముఖ్యమే. అందుకే కేంద్రం మరింత సమయం తీసుకుంటోంది.

AP: మాజీ MP నందిగం సురేశ్పై అక్రమ కేసులు పెట్టారని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. లొసుగులు ఉపయోగించి YCP నేతలను జైల్లో ఉంచుతున్నారని ఆరోపించారు. జైలులో మాజీ MPకి కనీస సదుపాయాలు కల్పించలేదని చెప్పారు. రాష్ట్రంలో YCPని లేకుండా చేయాలని చూస్తున్నారని సజ్జల అన్నారు. అటు, పేర్ని నాని దాఖలు చేసిన పిటిషన్ను విత్ డ్రా చేసుకోవాలన్న హైకోర్టు.. పోలీసులు నోటీసులిస్తే విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

అత్యల్ప క్లెయిమ్స్ రిజెక్షన్ రేషియో 0.2%తో న్యూఇండియా అస్యూరెన్స్ రికార్డు సృష్టించింది. దాదాపుగా క్లెయిమ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ బీమా డబ్బును బదిలీ చేసింది. ప్రైవేటులో HDFC Ergo, Future Generali, ఆదిత్య బిర్లా హెల్త్, శ్రీరామ్ ముందున్నాయి. ఇక 2022-23లో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ టు సెటిల్మెంట్ రేషియో 86 శాతమని IBAI డేటా ద్వారా తెలుస్తోంది. FY22తో పోలిస్తే ఒకశాతం తగ్గడం గమనార్హం.

TG: ఒకప్పుడు సమాజాన్ని మార్చడానికి సినిమా ఉపయోగపడేదని, ఇప్పుడు విలన్లను హీరోల్లా చూపిస్తున్నారని CPI MLA కూనంనేని సాంబశివరావు తెలిపారు. సెన్సార్ బోర్డు పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. సంధ్య థియేటర్ వద్ద రేవతి చనిపోవడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటనలో సినిమా వర్సెస్ ప్రభుత్వం అనేలా చర్చ జరిగిందని చెప్పారు. విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శ్రీతేజ్ను పరామర్శించిన తర్వాత ఆయన చెప్పారు.

ప్రజలు తమలోని భావాలను వ్యక్తపరిచేందుకు ఎమోజీలను వినియోగిస్తుంటారు. అందులో ఎక్కువగా వాడే స్మైలీని అమెరికన్ కమర్షియల్ ఆర్టిస్ట్ హార్వే రాస్ బాల్ రూపొందించారు. 1963లో ఈ ఐకానిక్ స్మైలీ ఫేస్ని డిజైన్ చేశారు. నవ్వుతున్న ముఖంతో ప్రకాశవంతమైన పసుపు వృత్తాన్ని కలిగి ఉన్న ఈ డిజైన్ ఎంతో ప్రజాదరణ పొందగా, అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి వచ్చింది. దీనిని రూపొందించినందుకు హర్వేకి $45 ఇచ్చారు.

అల్లు అర్జున్ను ప్రశ్నించిన అనంతరం చిక్కడపల్లి పోలీసులు ఆయనను సంధ్య థియేటర్కు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈనెల 4న జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీని సెంట్రల్ జోన్ డీసీపీ విచారిస్తున్నారు. అటు సంధ్య థియేటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.