India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96వేలకు పైగా భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. మండల పూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజ సీజన్, డిసెంబర్ 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. DEC 22 నుంచి రోజుకు లక్షకు పైగా భక్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు.

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది విశాఖకు 450 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన ఉన్నట్లు వెల్లడించింది. అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అన్ని పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

TG: తెలంగాణ భవన్(బీఆర్ఎస్ కార్యాలయం) TOLETకు ఉందంటూ తెలంగాణ కాంగ్రెస్ Xలో పోస్ట్ చేసింది. ‘అమెరికా(మనమడి దగ్గరికి)కు వెళ్లిపోయిన తాత, లిక్కర్ స్కామ్ కేసులో జైలుకెళ్లొచ్చిన చెల్లి, ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో జైలుకు వెళ్లనున్న అన్న’ అని పేర్కొంది. TOLETతో పాటు ఫర్ సేల్ ఆప్షన్ కూడా ఉందని క్యాప్షన్ ఇచ్చింది.

అమెరికా పౌరసత్వం తీసుకుంటున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. FY 2024లో అమెరికా పౌరసత్వం పొందిన వివిధ దేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. US Citizenship and Immigration Services లెక్కల ప్రకారం గత ఏడాది 49,700 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు. తద్వారా కొత్తగా పౌరసత్వం పొందిన వారిలో 6.1% వాటా భారతీయులదే కావడం గమనార్హం. అత్యధికంగా మెక్సికో 13.1% వాటాతో జాబితాలో ముందుంది.

జమిలి బిల్లుపై అధ్యయనం చేసేందుకు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన <<14936882>>జేపీసీలో<<>> మొత్తం 39 మందికి చోటు దక్కింది. ఇందులో 16 మంది బీజేపీ, ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలున్నారు. ఎస్పీ, టీఎంసీ, డీఎంకే నుంచి ఇద్దరు చొప్పున ఎంపిక చేశారు. టీడీపీ, జనసేన, వైసీపీ, శివసేన, జేడీయూ, ఆర్ఎల్డీ, ఎల్జేఎస్పీ(ఆర్వీ), శివసేన(యూబీటీ), ఎన్సీపీ-ఎస్పీ, ఆప్, బీజేడీ, సీపీఐ(ఎం) తరఫున ఒక్కో సభ్యుడికి అవకాశం దక్కింది.

స్టాక్ మార్కెట్లకు ఈ వారం ఓ పీడకలే అని చెప్పాలి. బెంచ్ మార్క్ సూచీలు రెడ్ తప్ప గ్రీన్లో ముగిసిన రోజంటూ లేకుండాపోయింది. Sensex 4 వేల పాయింట్లు, Nifty 1,200 పాయింట్లు నష్టపోయాయి. సూచీల్లో 5% మేర తరుగుదల కనిపించింది. Over Valuation భయాలు, Fed కఠిన నిర్ణయాల సూచనలు, క్రిస్మస్ సెలవులతో FIIల డిజిన్వెస్ట్మెంట్ (ఈ రోజు -3597 Cr), వీక్ కార్పొరేట్ ఎర్నింగ్స్ సెంటిమెంట్ను బలహీనపరిచాయి.

జమిలి ఎన్నికలపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరీ ఛైర్మన్గా నియమితులయ్యారు. తొలుత 31 మంది సభ్యులతో జేపీసీని ఏర్పాటు చేయగా, తాజాగా సభ్యుల సంఖ్యను 39కి పెంచారు. లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులకు కమిటీలో చోటు దక్కింది. అంతకుముందు ఉదయం జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపాలని రాజ్యసభ తీర్మానించిన విషయం తెలిసిందే.

‘పుష్ప 2’ మూవీ ఓటీటీ రిలీజ్పై చిత్ర యూనిట్ స్పందించింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని తెలిపింది. మూవీ విడుదలైన 56 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలోకి వస్తుందని పేర్కొంది. అప్పటివరకు బిగ్ స్క్రీన్లోనే ఈ మూవీని ఎంజాయ్ చేయాలని కోరింది. దీని ప్రకారం జనవరి చివరి లేదా FEB మొదటి వారంలో OTTలోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ మూవీ JAN 9న ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మందిర్-మసీదు <<14933080>>వివాదాలకు<<>> ఇక తెరదించాలని RSS చీఫ్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై SP చీఫ్ అఖిలేశ్ స్పందించారు. UPలోని సంభల్లో మసీదు సర్వే సందర్భంగా చెలరేగిన అల్లర్లలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన అనంతరం భాగవత్ స్పందించడాన్ని ఆయన తప్పుబట్టారు. పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేరని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పెట్టిన తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవచ్చని, BJP ఆ పని చేయాలన్నారు.

TG: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో కేంద్రానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ FIR <<14930659>>ఆధారంగా<<>> ECIR నమోదు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేటీఆర్, అర్వింద్ కుమార్, BLN రెడ్డిలపై కేసు నమోదు చేసింది. ఏసీబీ FIRలో ఉన్న అంశాలనే ఈడీ ECIRలో ప్రస్తావించింది. రూ.55 కోట్ల ఆర్థిక లావాదేవీల్లో ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపై దర్యాప్తు చేయనుంది.
Sorry, no posts matched your criteria.