India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: జగన్ను రాజకీయంగా అంతం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ ఆరోపించారు. ‘లడ్డూ వివాదంపై CBI లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసి ఉండొచ్చని గతంలో టీటీడీ ఈవో చెప్పారు. చంద్రబాబు బెదిరించిన తర్వాత మాట మార్చారు. 2014-19 మధ్య టీటీడీలో నందిని నెయ్యి ఎందుకు వాడలేదు? కలుషితమైంది నెయ్యి కాదు.. చంద్రబాబు మానసిక స్థితి’ అని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 56 మిలియన్లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని అంచనా. దీని ప్రకారం నెలకు 4.6 మిలియన్లు, రోజుకు 1.50 లక్షలు, గంటకు 6వేలు, నిమిషానికి 106, సెకనుకు ఇద్దరు జీవిడుస్తున్నారు. ఇందులో అత్యధికంగా చైనాలో గంటకు 1,221 మంది చనిపోతున్నారు. ఆ తర్వాత ఇండియా (1,069), అమెరికా (332), నైజీరియా(313), ఇండోనేషియా (238), రష్యా (198), పాకిస్థాన్ (181), జపాన్ (180) ఉన్నాయి.
దేశంలో ₹10, ₹20, ₹50 నోట్ల కొరత వల్ల గ్రామీణ భారతం ఇబ్బందులు పడుతోందని, ఈ సమస్యను తీర్చాలంటూ కేంద్రానికి కాంగ్రెస్ లేఖ రాసింది. UPI, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి RBI ఈ నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు తెలుస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో MP మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. ఇది అర్థం చేసుకోదగినదే అయినా వసతులు లేని గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు.
మన వద్ద కూడా అతని దగ్గరున్నటువంటి ఫోన్ ఉండాలి అనే స్థాయి నుంచి ఎవ్వరికీ ఉండని ఫోన్ కొనేందుకు రూ.లక్షలు వెచ్చించే స్థాయికి చేరుకున్నాం. మొబైల్ ఫోన్ వచ్చిన తొలినాళ్లలో ప్రతి ఇంట్లో ‘నోకియా 1100’ ఫోన్స్ ఉండేవి. ఇప్పటివరకూ అత్యధికంగా అమ్ముడైన ఫోన్ మోడల్ ఇదేనని మీకు తెలుసా? మొత్తం 250 మిలియన్ల ‘నోకియా 1100’ ఫోన్ల విక్రయాలు జరిగాయి. దీని తర్వాత ‘నోకియా 1110’ (248M), iPhone 6/6+ (222M) ఉన్నాయి.
AP: తిరుమల లడ్డూ వివాదంపై ప్రధాని మోదీకి మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించారు. ‘2014-19లో 14-15 సార్లు నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. 2019-24లో 18 సార్లు రిజెక్ట్ చేశాం. 2 నెలల కింద ఒక ట్యాంకర్ రిజెక్ట్ అయింది. అలాంటప్పుడు లడ్డూల తయారీలో ఈ నెయ్యిని వాడేందుకు వీలులేదు. దీనిపై వాస్తవాలను నిగ్గు తేల్చండి’ అని కోరారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ‘గేమ్ ఛేంజర్’ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ ట్విటర్లో ‘GameChangerOffl’ అనే అకౌంట్ను క్రియేట్ చేశారు. ఈ అకౌంట్లో త్వరలోనే అదిరిపోయే అప్డేట్ రాబోతోందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. కాగా, సెకండ్ సింగిల్ విడుదల అవుతుందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
HIV వ్యాక్సిన్ తయారీలో ఎంఐటీ పరిశోధకులు పురోగతి సాధించారు. వైరస్ నియంత్రణ కోసం ఈ టీకాను వారం వ్యవధిలో రెండు డోసులు ఇస్తారు. తొలి డోసును కొద్ది మోతాదులో, రెండో డోసును అధిక మోతాదులో రోగికి వేస్తారు. తద్వారా వైరస్ మ్యుటేషన్ జరిగేలోగా అవసరమైన రోగనిరోధక వ్యవస్థను వ్యాక్సిన్ ఉత్తేజితం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు వెల్లడించారు.
భారీ వర్షాలతో తాజ్ మహల్ గోడలపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఇతర భాగాలూ దెబ్బతిన్నాయి. ప్రధాన గోపురం చుట్టూ ఉన్న తలుపులపై అరబిక్లో ఖురాన్లోని సూరాలను చెక్కారు. ఈ ఆక్షరాలు చెదిరిపోయినట్టు TGFI తెలిపింది. తాజ్ మహల్లో ఎలాంటి సమస్యలూ లేవంటున్న ASI ఇటీవల ఏం సర్వే చేసిందని ప్రశ్నించింది. ప్రపంచ ప్రఖ్యాత తాజ్ మహల్పై ప్రతికూల ప్రచారం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని పేర్కొంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ‘దేవర’ ట్రైలర్ రిలీజ్పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఉదయం 11.05కు రిలీజ్ అవ్వాల్సిన ట్రైలర్ను మధ్యాహ్నం 2.07 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దేవర మాస్ను చూసేందుకు అంతే ఆత్రుతగా మరికొద్దిసేపు వేచి ఉండాలని పేర్కొన్నారు. ‘దేవర’ రిలీజ్ ట్రైలర్ గురించి మీరూ ఎదురుచూస్తున్నారా? కామెంట్ చేయండి.
TG: ఎంఐఎం పార్టీ నేతలు, ఒవైసీ సోదరులకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అందుకు సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. కరీంనగర్లో పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్రం విచారణ చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.