News September 22, 2024

పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ నారీమణులు

image

తెలంగాణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. మొత్తం 1.88 కోట్లకు పైగా మహిళలుంటే ప్రతి 1000 మందిలో 3.1 మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. MSME పాలసీలో తీసుకున్న వివిధ చర్యలతో Udyam పోర్టల్‌లో 58,644 మంది మహిళా పారిశ్రామికవేత్తలు నమోదు చేసుకున్నారు. మహిళల నేతృత్వంలోని MSMEల వాటా విషయానికి వస్తే టాప్-3లో తెలంగాణ నిలిచింది.

News September 22, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

image

AP: తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సీఎంకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు సీఎం చంద్రబాబుకు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు.

News September 22, 2024

హిందువుల మనోభావాలను దెబ్బతీశారు: హీరో

image

తిరుమల లడ్డూ వ్యవహారంపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ‘లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వాడటం ఆందోళనకరం. ఇది లోపం కాదు. విశ్వాసాన్ని దెబ్బతీసినట్లే. హిందువులను అవమానపరిచారు. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి బాధ్యులను గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఉంది. సంప్రదాయాల ఉల్లంఘనలను సహించబోమని మనం ఒక ఉదాహరణగా నిలవాలి’ అని ట్వీట్ చేశారు.

News September 22, 2024

చంద్రబాబు పాలకుడిగా రావటం ప్రజల దురదృష్టం: VSR

image

AP: తప్పులు చేస్తూ ఎదుటివారి మీద నిందలు వేయడంలో చంద్రబాబు ఆద్యుడు అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘100 రోజుల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రూ.40వేల కోట్ల అప్పులు చేశారు. నేరాలు దారుణంగా పెరిగిపోయాయి. మిగతా 1725 రోజుల చంద్రబాబు పాలనలో ప్రజలకు కష్టాలు, రాష్ట్ర విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోండి. చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి పాలకుడిగా రావటం ప్రజల దురదృష్టం’ అని ట్వీట్ చేశారు.

News September 22, 2024

ట్రాఫిక్‌లో చిక్కుకున్న CM.. ఇద్దరు అధికారులు సస్పెండ్!

image

UP CM యోగి Sept 10న నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అప్పటికే కురిసిన వర్షం వల్ల రోడ్లను వరదలు ముంచెత్తడంతో ట్రాఫిక్ జామైంది. అప్పుడే ఇండియా ఎక్స్‌పో మార్ట్‌ నుంచి తిరిగి గౌతమ్‌బుద్ధ వర్సిటీకి వెళుతున్న CM యోగి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీంతో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు. వారి సస్పెన్షన్‌కు ట్రాఫిక్ కారణం కాదని చెప్పడం గమనార్హం.

News September 22, 2024

కొరటాల శివ-ప్రభాస్ కాంబోలో మరో సినిమా?

image

ప్రభాస్ కోసం దర్శకుడు కొరటాల శివ ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘దేవర’ పార్ట్-2 తర్వాత వీరి కాంబోలో సినిమా రానున్నట్లు సమాచారం. గతంలో కొరటాల డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆయన డైరెక్ట్ చేసిన ‘దేవర’ పార్ట్-1 ఈనెల 27న రిలీజ్ కానుంది. ఇది హిట్ అయితేనే కొరటాలకు నెక్స్ట్ బిగ్ స్టార్స్‌తో అవకాశాలు దక్కుతాయని పలువురు నెటిజన్లు అంటున్నారు.

News September 22, 2024

విచారణ జరగాలి.. దోషులను శిక్షించాలి: పవన్

image

AP: తిరుమలలో జరిగిన ఘటన భవిష్యత్తులో మళ్లీ జరగకుండా NDA ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని Dy.CM పవన్ హామీ ఇచ్చారు. ‘దీనిపై CBIతో విచారణ జరిపించడంపై క్యాబినెట్‌లో చర్చిస్తాం. దీనిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరుతున్నా. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు ఉంటుంది. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలి. దోషులను శిక్షించాలి’ అని అన్నారు.

News September 22, 2024

ఖడ్గమృగాల దినోత్సవం.. మోదీ స్పెషల్ ట్వీట్

image

ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పంచుకున్నారు. ‘అత్యంత ప్రసిద్ధ జాతులలో ఒకటైన ఖడ్గమృగాలను రక్షించడానికి మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం. ఏళ్లుగా ఖడ్గమృగాల సంరక్షణ ప్రయత్నాలలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు. దేశంలో అత్యధికంగా ఖడ్గమృగాలు కలిగి ఉండటం గర్వించదగ్గ విషయం. వీటిని చూసేందుకు కజిరంగా ఫారెస్ట్‌ను అంతా సందర్శించండి’ అని తెలిపారు.

News September 22, 2024

చర్చిలో అపవిత్రం జరిగితే జగన్ ఊరుకుంటారా?: పవన్

image

తిరుమలలో జరిగినట్లు చర్చి/మసీదులో ఏదైనా అపవిత్రత చోటుచేసుకుంటే దేశమంతా అల్లకల్లోలం చేసేవారని, ప్రపంచమంతా తెలిసేదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ‘మేము అన్ని మతాలను గౌరవిస్తాం. కానీ ఈ వివాదంపై మాట్లాడొద్దంటే ఎలా? దీని వల్ల కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇదే చర్చి/మసీదులో జరిగితే మాజీ సీఎం జగన్ ఊరుకుంటారా? దోషులను ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ‘ అని ఫైరయ్యారు.

News September 22, 2024

చైనాపై బైడెన్ కీలక వ్యాఖ్యలు.. మైక్‌లో రికార్డ్ అవ్వడంతో చర్చ

image

క్వాడ్ దేశాధినేత‌ల‌తో చైనాను ఉద్దేశించి అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ చేసిన కీల‌క వ్యాఖ్య‌లు మైక్‌లో రికార్డ్ అవ్వ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. ‘చైనా దూకుడుగా ప్రవర్తిస్తూనే ఉంది. ఆర్థిక-సాంకేతిక సమస్యలతో సహా అనేక రంగాలలో మనందరినీ పరీక్షిస్తోంది’ అని బైడెన్ చేసిన వ్యాఖ్య‌లు హాట్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. దీంతో చైనా తీరుపై అమెరికా గుర్రుగా ఉంద‌న్న విష‌యం మరోసారి స్ప‌ష్ట‌మైంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది.