India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విపక్ష నేత రాహుల్ గాంధీపై ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదైంది. తమ ఎంపీలపై దాడి చేశారని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో <<14924533>>ఇవాళ బీజేపీ ఫిర్యాదు<<>> చేసింది. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా రాహుల్పై BNS 109, 117, 125, 131, 351 సెక్షన్ల కింద కేసు పెట్టామన్నారు. 109 అటెంప్ట్ టు మర్డర్, 117 స్వయంగా గాయపరచడం కిందకు వస్తాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ను సినీ ఇండస్ట్రీ మొత్తం తీవ్రంగా ఖండించాలని డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ‘ఏ సినీ స్టార్ అయినా, పొలిటికల్ స్టార్ అయినా పాపులర్ కావడం వారి తప్పా? అలాగైతే ‘క్షణం క్షణం’ షూటింగ్ సమయంలో శ్రీదేవిని చూసేందుకు వచ్చిన వేలాది జనంలో ముగ్గురు చనిపోయారు. మరి తెలంగాణ పోలీసులు ఇప్పుడు స్వర్గానికి వెళ్లి శ్రీదేవిని అరెస్ట్ చేస్తారా?’ అని ఆయన పేర్కొన్నారు.

TG: ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై సీఎం రేవంత్ <<14924428>>సిట్ విచారణకు<<>> ఆదేశించడంపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ రెడ్డికి దమ్ముంటే, మగాడైతే ఫస్ట్ టెండర్ రద్దు చేయమనండి’ అని సవాల్ విసిరారు. తాము శాంతియుతంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని కేటీఆర్ తెలిపారు.

దేశ రాజకీయాల్లో ఈ రోజు కేసులకు ప్రత్యేకంగా నిలిచింది. TGలో KTRపై ACB కేసు నమోదైంది. ఔటర్ రింగు రోడ్డు లీజు వ్యవహారంపై CM రేవంత్ అసెంబ్లీలో విచారణకు ఆదేశించారు. మరోవైపు ఢిల్లీలో NDA, INDIA కూటముల పరస్పర నిరసనలు, తోపులాటతో పార్లమెంటు ప్రాంగణం దద్దరిల్లింది. రాహుల్ గాంధీపై BJP అటెంప్ట్ టు మర్డర్, స్వచ్ఛంద దాడి సెక్షన్లతో కేసు పెట్టింది. ‘BJP దౌర్జన్యం’పై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. వీటిపై మీ కామెంట్

బంగారం అంటే మహిళలకు ఎంతో ప్రీతి. ఒంటిపై నగ ఉండాలనే కోరిక వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా భారతీయ మహిళలు బంగారం కొనడంలో ముందుంటారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారంలో 11శాతం భారతీయ మహిళలే కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది. వీరి వద్ద 24వేల టన్నుల బంగారం ఉంది. ఇది ప్రపంచంలోని బంగారు నిల్వల్లో US, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యాల సంయుక్త నిల్వలను అధిగమించింది.

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికసార్లు 50కిపైగా పరుగులు సాధించిన బ్యాటర్గా ఆమె నిలిచారు. ఇప్పటివరకు స్మృతి 30సార్లు 50కిపైగా పరుగులు బాదారు. వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టీ20లో ఆమె ఈ ఘనత సాధించారు. న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్(29)ని ఆమె అధిగమించారు. వీరి తర్వాత బెత్ మూనీ (25), స్టెఫానీ టేలర్ (22), సోఫీ డివైన్ (22), వైట్ (20) ఉన్నారు.

ఇంట్లో బైక్ కీ, ఇతర గ్యాడ్జెట్స్ను ఎక్కడో పెట్టి మర్చిపోతున్న వారికి గుడ్ న్యూస్. అలాంటి వారికోసం జియో వినూత్న పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. JioTag Go పరికరం Find My Device ద్వారా వస్తువులను ట్రాక్ చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు వారి స్మార్ట్ఫోన్ల ద్వారా గ్యాడ్జెట్లు, కీలు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. కీచైన్ మాదిరిగా దీనిని వాడుకోవచ్చు.

AP: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో 100 గజాల్లో (2 సెంట్లు) ఇల్లు కట్టుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాగే 300 గజాల్లోపు ఇల్లు నిర్మించుకునేవారికి అనుమతులు సులభతరం చేయనుంది. కాగా ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

TG: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ అంగీకరించినట్లు టీడీపీ నేత టీడీ జనార్దన్ తెలిపారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు, నాయకుడని సీఎం తెలిపారు. కాగా విగ్రహంతో పాటు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని జనార్దన్ వివరించారు.

CROCS కంపెనీ చెప్పుల గురించి యువతకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది వీటిని ధరించేందుకు ఇష్టపడుతుంటారు. దీంతో ఈ అమెరికన్ కంపెనీ వ్యాపారం భారీగా పెరిగిపోతోంది. 2019లో $1.23 బిలియన్గా ఉన్న క్రాక్స్ బిజినెస్ 2023లో మూడింతలు పెరిగి $3.96 బిలియన్ల వ్యాపారం చేసింది. ఈ ఏడాది ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ చెప్పుల ధర రూ.2500 – రూ.10000 వరకు ఉంటుంది.
Sorry, no posts matched your criteria.