News September 21, 2024

ఏపీలో ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపు

image

Jr.NTR ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.60 వరకూ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అలాగే రిలీజ్ రోజున(SEP 27) 12AM నుంచి మొత్తం 6షోలు, 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

News September 21, 2024

జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్!

image

లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్‌పై పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టును కోరనున్నారు. మరోవైపు జానీపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ కోసం అతడి తరఫు న్యాయవాది పిటిషన్ వేయనున్నారు.

News September 21, 2024

ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి

image

AP: ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. ఇప్పటికే రెండు బోట్లను తొలగించిన అధికారులు తాజాగా మూడో పడవను బయటికి తీశారు. వీటిని పున్నమి ఘాట్‌కు తరలించారు. ఈ ప్రక్రియకు 15 రోజులు శ్రమించాల్సి వచ్చింది. ఈనెల 1న భారీ ప్రవాహానికి 5 పడవలు బ్యారేజీని ఢీకొట్టాయి. వాటిలో ఒకటి దిగువకు కొట్టుకుపోగా, మిగతావి గేట్ల వద్ద చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

News September 21, 2024

పీఏసీ సమావేశం నుంచి BRS ఎమ్మెల్యేలు వాకౌట్

image

TG: పీఏసీ సమావేశం నుంచి BRS ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అధ్యక్షతన పీఏసీ సమావేశం ప్రారంభం కాగా, ఛైర్మన్ ఎన్నిక చెల్లదని BRS ఎమ్మెల్యేలు చెప్పారు. ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి, రమణ వాకౌట్ చేసి వెళ్లిపోయారు.

News September 21, 2024

ఈనెల 26న OTTలోకి ‘సరిపోదా శనివారం’

image

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈనెల 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్, విలన్‌గా ఎస్‌జే సూర్య నటించారు.

News September 21, 2024

రాజకీయాలొద్దు.. చేతనైతే విచారణ చేయించండి: బొత్స

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో వేగంగా విచారణ జరిపి నిజాలు తేల్చాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవద్దు. చేతనైతే విచారణ జరిపించాలి, అంతేగాని రాజకీయం చేయవద్దు. దేవుడికి అపచారం చేస్తే ఎప్పటికైనా శిక్ష పడుతుంది. ప్రజల మనోభావాలతో రాజకీయాలు సమంజసం కాదు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం’ అన్నారు.

News September 21, 2024

లంచ్: భారత్ ఆధిక్యం 432 రన్స్

image

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత్ 432 రన్స్ ఆధిక్యం సాధించింది. మూడో రోజు లంచ్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. క్రీజులో గిల్(86), పంత్(82) ఉన్నారు. వీరిద్దరూ 138 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. బంగ్లా బౌలర్లు లంచ్ వరకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 376, బంగ్లా 149 రన్స్ చేసిన విషయం తెలిసిందే.

News September 21, 2024

ఎల్లుండి అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించిందని, ఇవాళ మరో ఆవర్తనం ఏర్పడనుందని IMD వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా కదలి ఎల్లుండి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు విస్తారంగా వానలు కురుస్తాయంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మరోవైపు ఈవారంలోనే దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు.

News September 21, 2024

వెయ్యి రన్స్ కొట్టిన ఓల్డెస్ట్ కెప్టెన్‌గా రోహిత్

image

కెప్టెన్ రోహిత్‌శర్మ బంగ్లాదేశ్‌తో టెస్టులో(5, 6రన్స్) రాణించలేకపోయినా ఒక రికార్డు నమోదు చేశారు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యికిపైగా రన్స్ చేసిన ఓల్డెస్ట్ భారత కెప్టెన్‌‌గా నిలిచారు. 37Y రోహిత్ 2024లో 3 వన్డేలు(157), 11 T20లు(378), 7 టెస్టుల్లో(466) మొత్తం 1,001 రన్స్ చేశారు. ఈ ఏడాది టాప్ స్కోరర్లుగా శ్రీలంక క్రికెటర్లు నిస్సాంక, కుశాల్ మెండిస్, 3లో జైస్వాల్, 4లో కమిందు మెండిస్, 5లో రోహిత్ ఉన్నారు.

News September 21, 2024

ట్రంప్‌పై హత్యాయత్నం: తప్పంతా సీక్రెట్ సర్వీస్‌దే!

image

పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు భద్రతా వైఫల్యానికి US సీక్రెట్ సర్వీస్‌దే బాధ్యతని కొత్త రిపోర్టు వచ్చింది. టెక్నాలజీని వాడటంలో ఏజెంట్లు నిర్లక్ష్యం ప్రదర్శించినట్టు తెలిపింది. లేదంటే ర్యాలీకి కొన్ని గంటల ముందే డ్రోన్ ఎగరేసిన అటాకర్‌ను గుర్తించేవాళ్లని పేర్కొంది. వైఫల్యానికి తోడు సీక్రెట్ సర్వీస్ అడ్వాన్స్ టీమ్‌, స్థానిక పోలీసుల మధ్య సమన్వయమే లేదని ఎత్తిచూపింది.