News September 19, 2024

హాఫ్ సెంచరీతో మెరిసిన జడేజా

image

భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి బ్యాటు ఝళిపించారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో క్లిష్ట సమయంలో హాఫ్ సెంచరీ 50 (73బంతుల్లో) చేశారు. 144 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును మరో సీనియర్ ఆల్‌రౌండర్ అశ్విన్‌తో (73*) కలిసి ఆదుకున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 272/6గా ఉంది.

News September 19, 2024

నాకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం ఇవ్వాలి: జెత్వానీ

image

AP: తనకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఏపీ ప్రభుత్వానికి సినీ నటి జెత్వానీ ధన్యవాదాలు తెలిపారు. హోంమంత్రి అనితతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు ఎదురైన పరిస్థితులు మరెవ్వరికీ రాకూడదన్నారు. కేసును మరింత త్వరగా విచారణ చేయాలని కోరారు. తనకు జరిగిన నష్టానికి ప్రభుత్వాన్ని పరిహారం కోరుతున్నట్లు పేర్కొన్నారు. కాగా జెత్వానీ వ్యవహారంలో ముగ్గురు IPSలపై ప్రభుత్వం వేటు వేసింది.

News September 19, 2024

కాసేపట్లో పవన్‌తో బాలినేని, ఉదయభాను భేటీ?

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మరికాసేపట్లో వైసీపీ మాజీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను కలవనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ తమ అనుచరులతో విజయవాడకు చేరుకున్నారు. పవన్‌తో భేటీ అనంతరం జనసేనలో చేరేదానిపై వీరు స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. వీరి బాటలోనే మరికొందరు వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది.

News September 19, 2024

Stock Market: ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు

image

ఫెడ్ వ‌డ్డీ రేట్ల కోత‌ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 316 పాయింట్ల లాభంతో 83,264 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 25,445 వద్ద స్థిరపడ్డాయి. ఆరంభ లాభాలను సూచీలు నిలుపుకోలేకపోయాయి. నిఫ్టీ 25,612 వ‌ద్ద‌- సెన్సెక్స్ 83,773 వ‌ద్ద రివ‌ర్స‌ల్‌ తీసుకున్నాయి. సూచీలు ఏ సెషన్‌లోనూ Day High క్రాస్ చెయ్య‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

News September 19, 2024

వరద బాధితులకు అదానీ రూ.25 కోట్ల విరాళం

image

AP: విజయవాడ వరద బాధితులకు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రూ.25 కోట్ల భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆ సంస్థ ప్రతినిధి సీఎం చంద్రబాబుకు అందజేశారు. ‘ఏపీలో వరదల కారణంగా అపార నష్టం సంభవించడం బాధాకరం. అదానీ గ్రూప్ తరఫున రాష్ట్ర ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నాం’ అని అదానీ ట్వీట్ చేశారు.

News September 19, 2024

అశ్విన్ హాఫ్ సెంచరీ

image

బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో లోకల్ బాయ్ అశ్విన్ అదరగొడుతున్నారు. టాప్ బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై బ్యాటుతో రాణించి హాఫ్ సెంచరీ చేశారు. 58బంతుల్లో 50 రన్స్ చేశారు. 144/6 వద్ద బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. మరో ఎండ్‌లో జడేజా(34) ఉన్నారు. వీరిద్దరు 102 బంతుల్లో 89 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 233/6గా ఉంది.

News September 19, 2024

YSRను తిట్టినవారికే మంత్రి పదవులు ఇచ్చారు: బాలినేని

image

AP: తాను ఏ తప్పూ చేయకపోయినా మంత్రి పదవి నుంచి తీసేశారని వైసీపీ మాజీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కానీ వైఎస్ఆర్‌ను తిట్టినవారిని మాత్రం మంత్రి పదవుల్లో కొనసాగించారని ఆయన అన్నారు. ‘నేనెప్పుడూ వ్యక్తిగత అవసరాల కోసం జగన్‌ను కలవలేదు. ప్రజా సమస్యల కోసమే ఆయనను కలిశాను. జగన్ కోసం ఉప ఎన్నికలకు వెళ్లిన 17 మందిలో ఇప్పుడు ఒక్కరైనా ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారా?’ అని ఆయన ప్రశ్నించారు.

News September 19, 2024

జానీ మాస్టర్ ఘటనపై స్పందించిన మనోజ్

image

జానీ మాస్టర్ కేసుపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ‘ఈ స్థాయికి వచ్చేందుకు ఆయన ఎంతగా శ్రమించారో అందరికీ తెలుసు. ఆయనపై ఆరోపణలు చూస్తుంటే నా గుండె ముక్కలవుతోంది. తప్పు ఎవరిది అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం భావి తరాలకు ప్రమాదకర మెసేజ్ ఇస్తోంది. త్వరగా స్పందించిన HYD పోలీసులకు అభినందనలు. మాస్టర్ తప్పు చేయకపోతే పోరాడండి. దోషి అయితే అంగీకరించండి’ అని మనోజ్ సూచించారు.

News September 19, 2024

సంక్రాంతికి స్పెషల్ ట్రైన్లు ఎన్నంటే?

image

సంక్రాంతికి 400 ప్రత్యేక రైళ్లను నడిపే యోచనలో రైల్వే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనవరి 11, 12, 13 తేదీల్లో రెగ్యులర్ రైళ్ల టికెట్లన్నీ అమ్ముడవ్వగా వెయిటింగ్ లిస్ట్ కూడా పెరిగిపోయింది. ఈ వెయిటింగ్ లిస్ట్‌ను ఫిల్ చేసేందుకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రద్దీని బట్టి పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్లు నడపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

News September 19, 2024

జమిలి ఎన్నికలను వ్యతిరేకించిన CPI(M)

image

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జమిలి ఎన్నిక(ఒకే దేశం. ఒకే ఎన్నిక)ను వ్యతిరేకిస్తున్నట్లు CPI(M) ప్రకటించింది. ఇది BJP-RSS ఆలోచన అని ఆరోపించింది. ఈ జమిలి ఎన్నిక అమలైతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బ తింటుందని అభిప్రాయపడింది. దీనివల్ల పలు రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు వస్తాయని, ఫలితంగా ప్రజల ఓటు హక్కుకు విలువలేకుండా పోతుందని పేర్కొంది. కేంద్రం ఈ జమిలి ఎన్నికలకు నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.