India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చదరంగం అంటేనే మైండ్ గేమ్. చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోరులో గుకేశ్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు చైనా ప్లేయర్ డింగ్ లిరెన్ ప్రయత్నించారు. కానీ అతడు ట్రాప్లో పడలేదు. అందుకు కారణం ప్యాడీ ఆప్టన్. గుకేశ్కు ఆయన మెంటల్ కండిషనింగ్ అండ్ స్ట్రాటజిక్ కోచ్గా ఉన్నారు. ఆప్టన్ శిక్షణలో గుకేశ్ అంతలా రాటుదేలారు. 2011 WC గెలిచిన టీమ్ ఇండియాకు, ప్యారిస్ ఒలింపిక్స్లో మెడల్ సాధించిన IND హాకీ టీమ్ వెనుకుందీ ఆప్టనే.

TG: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్ధుడిని గ్రామస్థులు కొట్టి చంపారు. ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా నిర్వాహకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో అతడిపై దాడి చేశారు. బలమైన గాయాలు కావడంతో వృద్ధుడు మరణించాడు. పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.

జల్పల్లిలోని నటుడు మోహన్బాబు ఇంటికి కాసేపట్లో పహాడీ షరీఫ్ పోలీసులు వెళ్లనున్నారు. రిపోర్టర్పై హత్యాయత్నం కేసులో ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. మోహన్బాబు వెపన్ను సీజ్ చేయనున్నారు. రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు.

మొబైల్, కంప్యూటర్ను విపరీతంగా చూడటం వల్ల నేత్ర సమస్యలు పెరుగుతున్నాయి. ఉసిరితో వీటిని తగ్గించుకోవచ్చని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. ఇందులోని విటమిన్-సి కంట్లో ఆక్సిడేషన్ స్ట్రెస్ను తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఫ్రీ ర్యాడికల్స్ నుంచి కణాలను కాపాడతాయి. కంటి అలసట, పొడిబారడం, చిరాకు, మసక చూపుకు విటమిన్-ఏ చెక్ పెడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో కంటి నొప్పి, ఎర్రబారడం తగ్గుతాయి.

హీరో సిద్ధార్థ్ నటించిన ‘మిస్ యూ’ ఈరోజు రిలీజైంది. తమిళనాడులో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తున్నా తెలంగాణలో మాత్రం టికెట్స్ కొనుగోలు జరగట్లేదని సినీవర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ బుకింగ్స్లో నిన్నటి వరకు కేవలం 50 టికెట్లే బుక్ అయినట్లు వెల్లడించాయి. సుదర్శన్లో 5 టికెట్లు బుక్కయ్యాయి. ‘పుష్ప-2’ ఈవెంట్పై ఆయన చేసిన<<14838054>> జేసీబీ<<>> వ్యాఖ్యలే దీనికి కారణం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ ఆగంతుకులు బెదిరించారు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్కు బెదిరింపు మెయిల్ చేశారు. రష్యన్ భాషలో ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు కూడా ఇవాళ వరుస బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటన్నింటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ తమిళనాడు వద్ద గురువారం అర్ధరాత్రి తీరం దాటింది. కాగా, ఇవాళ ఉదయం బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నట్లు పేర్కొంది. అటు, అల్పపీడనం తీరం దాటిన సందర్భంగా TNలో భారీ వర్షాలు పడుతున్నాయి.

స్టాక్మార్కెట్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 24,389 (-156), సెన్సెక్స్ 80,742 (-540) వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు రూ.2.5లక్షల కోట్ల మేర సంపద కోల్పోయారు. అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, IT, ఫార్మా, మెటల్, కమోడిటీస్, ఎనర్జీ రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. టాటా స్టీల్, JSW స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, INDUSIND టాప్ లూజర్స్. AIRTEL, ADANIENT టాప్ గెయినర్స్.

తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు భారత మాజీ క్రికెటర్, సచిన్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ తెలిపారు. తనకు వచ్చే రూ.30 వేల పింఛన్తో కాలం వెళ్లదీస్తున్నట్లు చెప్పారు. ‘యూరిన్ సమస్యతో బాధపడుతున్నా. నా కుటుంబం సాయంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. గతంలో రెండు సర్జరీలకు సచిన్ సహాయం చేశారు. కపిల్ దేవ్ ఆఫర్ మేరకు నేను రిహాబిలిటేషన్ సెంటర్కు వెళ్లేందుకు సిద్ధం’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఫ్రాన్స్కు తదుపరి ప్రధానిని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నేడు ప్రకటించనున్నారు. 48 గంటల్లో కొత్త ప్రధానిపై ప్రకటన ఉంటుందని రెండు రోజుల క్రితం ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంలో గత ప్రధాని మైకేల్ బార్నియర్ ఓడిపోవడంతో ఆయన గత వారం తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయంగా ఆ దేశంలో ఆరు నెలల్లో ఇది రెండో సంక్షోభం కావడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.