India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ టెస్టుల్లో నం.1 బ్యాటర్గా నిలిచారు. 2022 సెప్టెంబర్లో తొలి అంతర్జాతీయ టెస్టు ఆడిన ఈ ప్లేయర్ కేవలం 26 నెలల్లోనే తొలి స్థానానికి ఎదిగారు. ఇప్పటివరకు 23 టెస్టులు ఆడిన బ్రూక్ 2,280 పరుగులు చేశారు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 8 సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి.

ప్రతిష్ఠాత్మక 2034 ఫుట్బాల్ వరల్డ్కప్కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఫిఫా ప్రకటించింది. మరోవైపు స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే దేశాలు సంయుక్తంగా 2030 వరల్డ్కప్ నిర్వహించనున్నాయని తెలిపింది. 2026 WCకు నార్త్ అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక 2022లో అర్జెంటీనా ప్రపంచకప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

TG: సినీ హీరో మంచు విష్ణుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి గొడవలు జరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారని సమాచారం. నాలుగు రోజులుగా కుటుంబంలో నెలకొన్న వివాదంపై ఆయన ఆరా తీశారు. జల్పల్లి నివాసం నుంచి ప్రైవేట్ సెక్యూరిటీని పంపించాలని విష్ణును సీపీ ఆదేశించారు. ఇంటి వద్ద ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు సమాచారం ఇవ్వాలన్నారు.

విజయ్ సేతుపతి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘మహారాజ’ చైనా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నవంబర్ 29న విడుదలైన ఈ మూవీ 12 రోజుల్లోనే దాదాపు 70 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో 2018లో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ తర్వాత చైనాలో అత్యధిక కలెక్షన్లు చేసిన చిత్రంగా నిలిచింది. తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ ఘనత అందుకున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం.

ఒకప్పుడు సాధారణ ఉద్యోగ జీవితం గడిపిన లక్ష్మణ్ దాస్ మిట్టల్.. 60 ఏళ్ల వయసులో వ్యాపారాన్ని మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు. 1990లో LIC నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత సోనాలికా ట్రాక్టర్స్ గ్రూప్ను స్థాపించారు. తర్వాత కుటుంబ సభ్యుల సపోర్ట్తో కలిసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రస్తుతం 94 సంవత్సరాల వయస్సులో రూ.49,110 కోట్లతో అత్యంత వృద్ధ బిలియనీర్గా ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT) తుది అంకానికి చేరింది. బరోడా, ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్ జట్లు సెమీస్లో అడుగుపెట్టాయి. ఎల్లుండి బరోడా-ముంబై, ఢిల్లీ-మధ్యప్రదేశ్ తలపడనున్నాయి. వీటిలో గెలిచిన జట్లు 15న ఫైనల్లో ఆడనున్నాయి. ఏ జట్లు ఫైనల్ చేరుతాయని భావిస్తున్నారో కామెంట్ చేయండి.

రాజులు, యోధుల విగ్రహాలు చూసినప్పుడు వారు ఎలా చనిపోయారో చెప్పవచ్చు. ముఖ్యంగా గుర్రంపై యోధులు ఉన్న విగ్రహాలను బట్టి మరణానికి గల కారణాలు చెప్పొచ్చని పురాణ పండితులు చెబుతున్నారు. ‘విగ్రహంలోని గుర్రం రెండు కాళ్లు పైకి లేపి ఉంచితే యుద్ధభూమిలో చనిపోయినట్టు. ఒక కాలు పైకి లేపి, మరొకటి నేలపై ఉంచితే యుద్ధంలో గాయపడి తర్వాత మరణించినట్లు గుర్తు. ఇక రెండు కాళ్లు భూమిపై ఉంటే అనారోగ్యంతో చనిపోయినట్లు’ అని ప్రతీతి.

TG:సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14వ తేదీన మంత్రులు, MLAలు, MLCలు, MPలు సంక్షేమ హాస్టళ్లను సందర్శించి అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులూ పాల్గొనాలని కోరారు. అటు కలెక్టర్లు తరచూ హాస్టళ్లను తనిఖీ చేసి, సరుకుల క్వాలిటీ, క్వాంటిటీపై దృష్టి సారించాలని ఆదేశించారు.

న్యూ ఇయర్ సందర్భంగా రిలయన్స్ జియో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.2025తో రీఛార్జ్ చేసుకునే ఈ ప్లాన్లో 200 రోజుల పాటు రోజుకు 2.5GB ఇంటర్నెట్, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, SMSలు చేసుకోవచ్చు. దీనికి తోడుగా రూ.2150 విలువైన(రూ.500 అజియో, ఈజ్ మై ట్రిప్ రూ.1500, స్విగ్గీ రూ.150) కూపన్లను అందిస్తోంది. డిసెంబర్ 11 నుంచి జనవరి 11, 2025 వరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉండనుంది.

‘పుష్ప-2’ సినిమా రూ.వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టి ఈ ఘనత సాధించిన ఎనిమిదో చిత్రంగా నిలిచింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా ‘దంగల్’. IMDb ప్రకారం ఈ చిత్రానికి రూ.2024 కోట్లు వచ్చాయి. దీని తర్వాత బాహుబలి-2(రూ.1742 కోట్లు), RRR(రూ.1250.9 కోట్లు), KGF-2 (రూ.1176 కోట్లు), జవాన్ (రూ.1157 కోట్లు), పఠాన్(రూ.1042 కోట్లు), కల్కి (రూ.1019 కోట్లు) ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.