News October 16, 2024

డెన్మార్క్ ఓపెన్‌లో ముగిసిన మిక్స్‌డ్, మహిళల డబుల్స్ పోరాటం

image

‘డెన్మార్క్ ఒపెన్ సూపర్ 750’ టోర్నీలో భారత మిక్స్‌డ్ డబుల్స్, మహిళల డబుల్స్‌ విభాగాల కథ ముగిసింది. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ, మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి, సిక్కిరెడ్డి జోడీ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలయ్యారు. ఇక సింగిల్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు తొలి రౌండ్‌లో ప్రత్యర్థి అస్వస్థతకు గురవ్వడంతో ఆమె రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

News October 16, 2024

శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేత

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తిరుమల శ్రీవారి మెట్ల మార్గాన్ని మూసివేసింది. అయితే అలిపిరి నడక మార్గం కొనసాగనుంది. పాపవినాశనం, శ్రీవారి పాదాల వద్దకు భక్తుల అనుమతిని అధికారులు రద్దు చేశారు. ఇటు తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

News October 16, 2024

HATSOFF: రామ్ చరణ్ మంచి మనసు!

image

చిరంజీవి పుట్టినరోజైన AUG 22న జన్మించిన ఓ పాప పాలిట ప్రాణదాతలా నిలిచారు రామ్‌చరణ్. ‘పల్మనరీ హైపర్‌టెన్షన్’ ఉండటంతో ఆమె బతకదని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులు బిడ్డను ‘అపోలో’కు తీసుకెళ్లారు. రూ.లక్షలు వెచ్చించే స్తోమత వారికి లేదు. విషయం తెలుసుకున్న చెర్రీ ఖర్చంతా భరించి పాపకు వైద్య సాయం అందించారు. ఈరోజు ఆ పసిపాప డిశ్చార్జి అయింది. దీంతో సేవలో తండ్రికి తగ్గ తనయుడని చరణ్‌పై ప్రశంసలు వస్తున్నాయి.

News October 16, 2024

GHMC కమిషనర్‌గా ఇలంబర్తి

image

TG: ఏపీకి అలాట్ చేసిన ఐఏఎస్‌లను <<14375321>>రిలీవ్<<>> చేసిన ప్రభుత్వం వారి స్థానాల్లో సీనియర్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది. GHMC కమిషనర్‌గా ఇలంబర్తి, ఎనర్జీ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా, ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా శ్రీదేవి, టూరిజం అండ్ కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్, ఆరోగ్య శ్రీ సీఈవోగా ఆర్వీ కర్ణన్‌కు అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News October 16, 2024

ఐఏఎస్‌లను రిలీవ్ చేస్తూ TG ప్రభుత్వం ఉత్తర్వులు

image

ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌లను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, వాణి ప్రసాద్‌ను ఏపీకి అలాట్ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

News October 16, 2024

గ్రూప్-1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

image

TG: గ్రూప్-1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 నియామకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపింది. నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తిస్థాయి వాదనల కోసం విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. కాగా ఈనెల 21 నుంచి మెయిన్స్ పరీక్షలున్నాయని, 3 నెలల్లో ఫలితాలు విడుదల చేస్తామని TGPSC కోర్టుకు తెలిపింది.

News October 16, 2024

SRH రిటెన్షన్స్: క్లాసన్‌కు రూ.23 కోట్లు?

image

IPL-2025 వేలానికి ముందు SRH రిటైన్ చేసుకునే ప్లేయర్ల లిస్టును ESPNcricinfo విడుదల చేసింది. క్లాసన్‌కు ₹23 కోట్లు, కమిన్స్‌కు ₹18కోట్లు, అభిషేక్ శర్మకు ₹14కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకోవాలని SRH నిర్ణయించిందని పేర్కొంది. హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిని కూడా అంటిపెట్టుకోనుందని ఓ ఆర్టికల్‌ను ప్రచురించింది. కాగా ప్లేయర్ల రిటెన్షన్స్‌ను ఫైనల్ చేసేందుకు ఫ్రాంచైజీలకు ఇచ్చిన గడువు ఈనెల 31తో ముగియనుంది.

News October 16, 2024

ALERT: రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబాబాద్, సూర్యాపేట, మహబూబ్ నగర్, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, JGL, సిరిసిల్ల, HYD, మేడ్చల్, వనపర్తి, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, ములుగు, జనగాం, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 16, 2024

వచ్చింది తినమన్న జొమాటో.. జనం ఆగ్రహం

image

హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి జొమాటోలో చికెన్ మంచూరియా ఆర్డర్ పెట్టగా చికెన్-65 వచ్చింది. జొమాటో ప్రతినిధికి ఫిర్యాదు చేయగా, సమస్యను పరిష్కరించలేదు సరికదా వచ్చిన ఆర్డర్‌ తిని చూడాలంటూ సూచించారు. ఆమెకు నచ్చుతుందని ఉచిత సలహా ఇచ్చారు. ఆ స్క్రీన్ షాట్‌ను ఆమె నెట్టింట పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఆర్డర్ తప్పుగా డెలివర్ చేసి, పైగా అదే తినాలని చెప్పడమేంటంటూ జొమాటోపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

News October 16, 2024

సుభాష్ చంద్రబోస్ అన్న కుమార్తె కన్నుమూత

image

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్న శరత్ చంద్ర బోస్ కుమార్తె రోమా రే(95) స్వర్గస్థులయ్యారు. దక్షిణ కోల్‌కతాలోని వారి నివాసంలో వృద్ధాప్య కారణాలతో ఆమె కన్నుమూశారని కుటుంబీకులు తెలిపారు. రోమాకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, ఐదుగురు మనుమలు ఉన్నారు. స్వాతంత్ర్య సమరంలో నేతాజీ పోరాటానికి రోమా ప్రత్యక్ష సాక్షి. ఆయన భార్య ఎమిలీ షెంకిల్‌తోనూ రోమాకు స్నేహం ఉంది.