News September 10, 2024

వారిపై దేశద్రోహం కింద కేసులు పెడతాం: హోంమంత్రి

image

AP: ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనపై విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయని హోంమంత్రి అనిత తెలిపారు. ‘బోట్ల ఘటనపై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు. ఇది మానవ చర్యే. బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయి. కావాలనే వాటిని కొట్టుకువచ్చేలా చేశారు. అవి తలశిల రఘురాం, నందిగం సురేశ్ బంధువులకు చెందినవిగా గుర్తించాం. విచారణలో తేలితే ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. దేశద్రోహం కింద కేసులు పెడతాం’ అని అన్నారు.

News September 10, 2024

దులీప్ ట్రోఫీ జట్లలో మార్పులు

image

దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌లో పాల్గొన్న పలువురు ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్టుల కోసం జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. దీంతో రెండో రౌండ్ కోసం ఇండియా-C మినహా మిగతా 3 జట్లలో బీసీసీఐ మార్పులు చేసింది. ఇండియా-A కెప్టెన్‌గా గిల్ స్థానంలో మయాంక్‌ను నియమించింది. జైస్వాల్, పంత్ స్థానంలో ఇండియా-Bకి రింకూ సింగ్, ప్రభుదేశాయ్‌ను, అక్షర్ పటేల్ స్థానంలో ఇండియా-Dకి నిషాంత్ సింధును సెలక్ట్ చేసింది. జట్ల పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 10, 2024

LPGతో వంట ఖర్చు 5 రూపాయలే: కేంద్ర మంత్రి

image

పీఎం ఉజ్వల స్కీమ్‌లో ప్రతిరోజూ వంటకయ్యే ఖర్చు రూ.5 అని పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ పురి అన్నారు. ఆ స్కీమ్‌లో లేనివాళ్లకు రూ.12 అవుతుందన్నారు. ‘గతంలో గ్రామాల్లో స్వచ్ఛ వంట ఇంధనం పరిమితంగా లభించేది. 2014లో 14 కోట్లున్న LPG కనెక్షన్లు 2024కు 33 కోట్లకు పెరిగాయి. సిలిండర్ ధరలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటాయి. నన్నడిగితే వారి హయాంలో అసలు సిలిండర్లే లేవంటాను’ అని పేర్కొన్నారు.

News September 10, 2024

లక్ష మందిని చంపటమే జగన్ లక్ష్యం: లోకేశ్

image

AP: ప్రకాశం బ్యారేజీ కూల్చి లక్ష మందికిపైగా ప్రజలను చంపటమే జగన్ లక్ష్యమని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ‘అధికారం అండగా సైకో జ‌గ‌న్ త‌న ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపి, 5 ఊర్ల నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి కూల్చేసి, విజయవాడతో పాటు లంక గ్రామాలను నామ రూపాలు లేకుండా చేయాలని ప‌న్నిన కుట్ర బ‌ట్ట‌బ‌య‌లైంది’ అని ట్వీట్ చేశారు.

News September 10, 2024

Be Careful: నెయిల్ పాలిష్‌లో విష పదార్థాలు!

image

మహిళలు ఇష్టంగా వేసుకొనే నెయిల్ పాలిష్‌లో విష పదార్థాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వాటితో ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
*టొలూనీ: నరాలకు నష్టం, మెదడు పనితీరు మందగింపు, శ్వాస సమస్యలు, జుట్టు రాలడం, వికారం
*డైబ్యుటైల్ ఫటాలేట్, TPHP: అంతస్రావి గ్రంథులకు హానికరం, హార్మోన్ల అసమతుల్యత, గర్భధారణ సమస్యలు
*ఫార్మాల్డిహైడ్: క్యాన్సర్ కారకం, చర్మం, కళ్లు, శ్వాస వ్యవస్థకు హానికరం, అలర్జీ కారకం

News September 10, 2024

ఇదెక్కడి మాస్ మావా.. పోర్న్‌హబ్‌లో మ్యాథ్స్ చెబుతూ ఏడాదికి రూ.2కోట్లు

image

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అంటే యూట్యూబ్‌లోనో లేక యాప్స్‌లోనో పాఠాలు చెప్పడం చూస్తుంటాం. కానీ తైవాన్‌కు చెందిన మ్యాథ్స్ టీచర్ చాంగ్ హ్సు విభిన్నంగా మార్కెటింగ్ చేయాలనుకున్నారు. ఇంకేముంది 2020 నుంచి పోర్న్‌హబ్‌లో పాఠాలు చెప్పడం స్టార్ట్ చేశారు. వీడియోలు పెడుతూ ఏడాదికి ₹2కోట్లు సంపాదిస్తున్నారు. అక్కడ చాలామంది యూజర్లు తన పాఠాలను పట్టించుకోరని, కానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కోసమే ఇలా చేస్తున్నానన్నారు.

News September 10, 2024

రూ.6.85 లక్షల కోట్ల అప్పుంది.. కేంద్రం సహకరించాలి: CM రేవంత్

image

TG: రాష్ట్రం రూ.6.85 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉందని సీఎం రేవంత్ అన్నారు. కేంద్రం అదనపు సహాయాన్ని అందించాలని కోరారు. ప్రజాభవన్‌లో జరుగుతున్న 16వ ఆర్థిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని సీఎం అన్నారు.

News September 10, 2024

తమిళ ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక్కడు!

image

భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుని ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు తనవంతు సాయంగా రూ.6 లక్షలు విరాళం అందిస్తున్నట్లు తమిళ నటుడు శింబు ప్రకటించారు. తెలంగాణ, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.3 లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇతర ఇండస్ట్రీల నుంచి స్పందించిన నటుడు ఆయనొక్కరేనని నెటిజన్లు అభినందిస్తున్నారు.

News September 10, 2024

బీసీ కులగణనపై హైకోర్టు కీలక ఆదేశాలు

image

TG: మూడు నెలల్లో బీసీ కులగణన పూర్తిచేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ కులగణన చెయ్యాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం మూడు నెలల్లో కులగణన పూర్తిచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.

News September 10, 2024

16 ఏళ్లు నిండనివారు సోషల్‌మీడియా వాడొద్దన్న AUS ప్రభుత్వం!

image

సోషల్‌మీడియా వినియోగం పిల్లలను తప్పుదారి పట్టిస్తోందని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం 16 ఏళ్లు నిండనివారు సోషల్‌మీడియా వినియోగించకుండా నిషేధం విధించనుంది. మొబైల్‌కే పరిమితం కాకుండా పిల్లలు మైదానంలోకి వచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పీఎం వెల్లడించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, టిక్‌టాక్‌ తదితర యాప్స్‌ను పిల్లలు వాడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.