News December 6, 2024

అంబేడ్కర్ కీర్తిని చాటేందుకు కృషి చేశాం: KCR

image

TG: అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా BRS అధినేత KCR ఆయన సేవలను స్మరించుకున్నారు. ‘సమసమాజ నిర్మాణ దార్శనికుడు అంబేడ్కర్. వివక్షకు వ్యతిరేకంగా జీవితకాలం పోరాడారు. ఆయన కీర్తిని ప్రపంచానికి చాటేందుకు కృషి చేశాం. అణగారిన వర్గాలకు సమన్యాయం దక్కేలా అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిది. ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 తెలంగాణ ఏర్పాటుకు మార్గం చూపింది’ అని KCR గుర్తుచేసుకున్నారు.

News December 6, 2024

ఐశ్వర్య-అభిషేక్.. విడాకుల వార్తలకు ఫుల్‌స్టాప్?

image

తాము విడిపోనున్నామని వస్తున్న వార్తలకు బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ తాజాగా ఫొటోలతో జవాబిచ్చారు. గురువారం రాత్రి జరిగిన ఓ పార్టీలో పలు సెల్ఫీలతో ఆ రూమర్లకు వారు ఫుల్‌స్టాప్ పెట్టినట్లైంది. ఐశ్వర్య, అభిషేక్ 17 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అభిషేక్ మరో నటితో సన్నిహితంగా ఉంటున్నారని, ఐష్ నుంచి విడిపోనున్నారని గత కొంతకాలంగా బీటౌన్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి.

News December 6, 2024

వైసీపీ సంచలన ట్వీట్

image

శ్రీకాకుళంలో కేంద్ర‌మంత్రి రామ్మోహన్‌ నాయుడు అనుచరుడు రమణ ఘరానా <<14802527>>మోసం<<>> బట్టబయలు అయిందని YCP సంచలన ట్వీట్ చేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు శిక్షణ పేరుతో సెంటర్‌కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేశారని ఆరోపించింది. ఈ విషయాన్ని బయటపెట్టిన కుర్రాళ్లను చిత్రహింసలు పెట్టారంది. నిందితుడు శ్రీకాకుళం MLA గొండు శంకర్‌‌కి సన్నిహితుడు అని పేర్కొంది.

News December 6, 2024

భారత సరిహద్దుల్లో బంగ్లా డ్రోన్లు

image

భారత్‌తో సరిహద్దుల్లో బంగ్లాదేశ్ బేరక్తర్ టీబీ2 డ్రోన్లను మోహరించినట్లు సమాచారం రావడంతో భారత్ అప్రమత్తమైంది. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల వెంబడి నిఘాను పెంచింది. మానవరహిత టీబీ2 డ్రోన్లను బంగ్లాదేశ్ టర్కీనుంచి దిగుమతి చేసుకుంది. కాగా, మాజీ పీఎం హసీనా హయాంలో అణచివేసిన ఉగ్రమూకలు ఆ దేశ సరిహద్దుల్లో ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నట్లు సమాచారం. బెంగాల్ మీదుగా భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

News December 6, 2024

నాగచైతన్య పెళ్లి ఫొటో వైరల్.. ఎందుకంటే?

image

నాగచైతన్య- శోభిత వివాహం ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు పెళ్లి వేడుక జరగ్గా, సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ దిగిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. అఖిల్‌కు కాబోయే భార్య జైనాబ్ రవడ్జీ అందులో ఉండటమే కారణం. అఖిల్ ముందు ఆమె నిల్చొని ఉన్న ఫొటోను అభిమానులు షేర్ చేస్తూ కాబోయే జంటకు విషెస్ చెబుతున్నారు.

News December 6, 2024

REVATHI: భర్త, కుమారుడిని కాపాడిన మాతృమూర్తి..!

image

‘పుష్ప 2’ ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లి మృత్యువాత పడిన రేవతి వెనుక విషాద గాథ దాగి ఉంది. గతేడాది తన భర్త భాస్కర్ అనారోగ్యం పాలైతే ఆమె తన లివర్‌ను కొంత భాగం దానం చేసి ఆయనను బతికించుకున్నారు. అలాగే నిన్న తొక్కిసలాటలో కూడా కుమారుడిని తన పొత్తిళ్లలో ఉంచుకుని రక్షించుకున్నారు. కానీ ఆమె చివరకు తన ప్రాణాలే కోల్పోయారు. ఈ విషయాలన్నీ చెబుతూ ఆమె భర్త కన్నీరుమున్నీరు అయ్యారు.

News December 6, 2024

నగదు విషయం తొలిసారి వింటున్నా: సింఘ్వీ

image

రాజ్యసభలో తన సీటు వద్ద భారీగా <<14804617>>నగదు దొరకడంపై<<>> కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ స్పందించారు. నగదు విషయం తొలిసారి ఇప్పుడే విన్నానని చెప్పారు. ‘నేను సభకు వెళ్తున్నప్పుడు ఒక్క రూ.500 నోటు మాత్రమే తీసుకెళ్తా. నిన్న మధ్యాహ్నం 3 నిమిషాలే సభలో ఉన్నా. తర్వాత క్యాంటీన్‌లో అయోధ్య రామిరెడ్డితో కలిసి పలు అంశాలపై 30 నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయా’ అని ట్వీట్ చేశారు.

News December 6, 2024

BREAKING: రైతులకు శుభవార్త

image

చిన్న, సన్నకారు రైతులకు RBI శుభవార్త అందించింది. ఎలాంటి తనఖా లేకుండా రైతులు తీసుకునే వ్యవసాయ రుణాల పరిమితిని రూ.1.6 లక్షల నుంచి రూ.2లక్షలకు పెంచుతున్నట్లు RBI గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. పెట్టుబడి ఖర్చులు, ద్రవ్యోల్బణం, ఇతర అంశాల ఆధారంగా రుణపరిమితిని సవరించినట్లు చెప్పారు. 2019లో చివరిసారిగా రూ.లక్ష నుంచి రూ.1.6 లక్షలకు రుణపరిమితిని సవరించారు.

News December 6, 2024

మోదీ.. భూటాన్ రాజు.. చికెన్ నెక్..

image

భూటాన్ రాజు జిగ్మే కేసర్‌కు PM మోదీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. 2024లో వీరు 4 సార్లు కలిశారు. రెండో టర్ములో ఆఖరి, మూడో టర్ములో మోదీ తొలి పర్యటన భూటాన్‌లోనే కావడం విశేషం. పొరుగుదేశాలతో సహకారం గురించి చర్చిస్తున్నారని చెప్తున్నా మరేదో సీక్రెట్ మిషన్ ఉన్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కీలకమైన సిలిగుడి కారిడార్ ‘చికెన్ నెక్’ను విస్తరించి ‘గోట్ నెక్’గా మార్చే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.

News December 6, 2024

KCRను ఆహ్వానిస్తాం: పొన్నం ప్రభాకర్

image

TG: డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు విపక్ష నేతలను కూడా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ఆహ్వానిస్తున్నామని, సమయం ఇవ్వాలని ఆయా నేతలను కోరినట్లు చెప్పారు. నేతలు సమయం ఇస్తే ప్రభుత్వం తరఫున వేడుకలకు పిలుస్తామన్నారు.