News October 16, 2024

ఆక్వా కల్చర్ హబ్‌గా AP: చంద్రబాబు

image

దెబ్బతిన్న AP బ్రాండ్‌ను పునర్మిర్మించాల్సి ఉందని CM చంద్రబాబు తెలిపారు. ‘APని ఆక్వా హబ్‌గా మారుస్తాం. ఫుడ్ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమను మారిస్తే రత్నాలసీమగా తయారవుతుంది. సీమలో ప్రతి ఎకరాకు నీళ్లిస్తే, అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. అభివృద్ధిలో మిన్నగా మారుతుంది. నవంబర్‌లో స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్ విడుదల చేస్తాం. భారీగా విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి’ అని సీఎం వెల్లడించారు.

News October 16, 2024

హైడ్రా ఏర్పాటును తప్పు పట్టలేం: హైకోర్టు

image

TG: హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తెలిపింది. హైడ్రా ఏర్పాటును తప్పు పట్టలేమని వ్యాఖ్యానించింది. జీవో 99, హైడ్రా చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జడ్జి ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు GHMC చట్టంలోని విశేషాధికారాలను హైడ్రాకు కల్పిస్తూ పురపాలక శాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది.

News October 16, 2024

8113 ఉద్యోగాలు.. మరో నాలుగు రోజులే గడువు

image

రైల్వేలో 8113 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజర్, టైపిస్ట్, క్లర్క్ పోస్టుల్లో ఖాళీలున్నాయి. 18 నుంచి 36 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు ఈ నెల 20 తేదీలోపు అప్లై చేసుకోవాలి. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. సికింద్రాబాద్ రీజియన్లో-478 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసేందుకు ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేయండి.

News October 16, 2024

శ్రీవారి భక్తులకు శుభవార్త

image

AP: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి నెల టికెట్ల బుకింగ్‌‌ తేదీలను TTD వెల్లడించింది. రూ.300 దర్శనం టోకెన్లు ఈ నెల 24వ తేదీ ఉ.10 గంటల నుంచి TTD వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 19 నుంచి 21 వరకు ఆర్జిత సేవా టికెట్లు, 22న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, 23వ తేదీ అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల కానున్నాయి. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో గదుల బుకింగ్ ఓపెన్ కానుంది.

News October 16, 2024

అమరావతిలో టాటా ఇన్నోవేషన్ హబ్: CM

image

AP: 6 కొత్త <<14373945>>పాలసీలు <<>>రాష్ట్ర ప్రగతిని మారుస్తాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఐదు జోన్లలో 5 ఇన్నోవేషన్ రతన్‌టాటా హబ్‌లు వస్తాయని, అమరావతి కేంద్రంగా విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ/గుంటూరు, తిరుపతి, అనంతపురంలో హబ్‌లు వస్తాయన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ ఇన్నోవేషన్ హబ్‌గా మారాలనేది తమ టార్గెట్ అని బాబు చెప్పారు.

News October 16, 2024

UK ఒబెసిటీ నిరుద్యోగులకు వెయిట్‌లాస్ ఇంజెక్షన్లు!

image

ఒబెసిటీ నిరుద్యోగులకు వెయిట్ లాస్ మెడికేషన్స్ ఇస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. వారు తిరిగి పనిలోకి వెళ్లేందుకు సాయపడాలనే ఈ నిర్ణయం తీసుకున్నామంది. ఒబెసిటీ సమస్యలతో NHSపై ఏటా 11bn పౌండ్ల భారం పడుతోందని వెల్లడించింది. చెడు అలవాట్లతో ఇది ఇంకా పెరగొచ్చని ఆవేదన చెందింది. దీంతో ఎకానమీ వెనక్కి పోతోందని, ప్రజలు అదనంగా 4 రోజులు ఎక్కువ సిక్ లీవ్స్ తీసుకుంటున్నారని UK మంత్రి స్ట్రీటింగ్ అన్నారు.

News October 16, 2024

ఏపీలో 6 కొత్త పాలసీలకు ఆమోదం: సీఎం

image

AP:క్యాబినెట్ సమావేశంలో 6 కొత్త పాలసీలను ఆమోదించామని CM చంద్రబాబు ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక, IT-వర్చువల్ వర్కింగ్ పాలసీలు తీసుకొచ్చామన్నారు. వచ్చే 5ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా వీటిని రూపొందించామన్నారు. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. యువత ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరాలనేది తమ ఆకాంక్ష అని చెప్పారు.

News October 16, 2024

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్ తేజ తనయుడు

image

డైరెక్టర్ తేజ కుమారుడు అమితోవ్ తేజ హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నవంబర్ లేదా డిసెంబర్‌లో షూటింగ్ మొదలు కావొచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ చిత్రానికి తేజానే దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాను ఆయనే నిర్మిస్తారా? వేరే నిర్మాత ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News October 16, 2024

హైదరాబాద్‌లో ఈసారి మరింత చలి: IMD

image

హైదరాబాద్‌లో వచ్చే 3 నెలల పాటు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. ఈ ఏడాది జనవరిలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. వచ్చే జనవరిలో 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావొచ్చని పేర్కొంది. అక్టోబరు-నవంబరు మధ్యకాలంలో పసిఫిక్‌ సముద్రంలో ఏర్పడే ‘లా నినా’యే దీనికి కారణమని వివరించింది. పొగ మంచు కూడా ఎక్కువగా ఉంటుందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

News October 16, 2024

కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారు: సజ్జల

image

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ‘వైసీపీ నేతలను కేసుల్లో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ఘటనలో ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. కేసు ముగిసే సమయానికి నోటీసులు ఏంటి? నటి జెత్వానీ కేసులోనూ ఇలాగే నన్ను ఇరికించారు. స్కిల్ కేసులో CBNకు ఈడీ క్లీన్ చిట్ ఎలా ఇస్తుంది? ఇంతకన్నా బరితెగింపు ఉంటుందా?’ అని ఫైర్ అయ్యారు.