India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రపంచ ఆర్థిక, రాజకీయాల్లో అత్యంత కీలకమైన భారత్ను విస్మరించరాదని, అలాగే తక్కువ అంచనా వేయలేరని కాంగ్రెస్ MP శశి థరూర్ స్పష్టం చేశారు. ‘వేగంగా పెరుగుతున్న జనాభా, ఎకానమీ అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ను అత్యంత కీలకంగా మార్చేశాయి. జియో పాలిటిక్స్లో చైనా, పాక్, USతో సవాళ్లు ఎదురవుతున్నా సమతూకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం భారత్ తీసుకొనే నిర్ణయాలు ప్రపంచంపై సుదీర్ఘకాలం ప్రభావం చూపిస్తాయి’ అని అన్నారు.
TG: తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని శేరిలింగంపల్లి MLA అరికెపుడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానింకా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని వెల్లడించారు. తనకు CM రేవంత్ కప్పింది కాంగ్రెస్ కండువా కాదని, ఆలయానికి సంబంధించిన శాలువా అని చెప్పారు. గాంధీ ఇటీవల కాంగ్రెస్లో చేరారని వార్తలు వినిపించాయి. ఆయనకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడంపై BRS అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇలా స్పందించారు.
TG: HYDలోని హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ GHMC అధికారులు, పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతి లేదంటూ ట్యాంక్ బండ్ వైపు ఫ్లెక్సీలు పెట్టారు. పెద్ద ఎత్తున ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. కాగా ఏటా నగరం నలువైపుల నుంచి భారీగా వినాయక విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేస్తున్న సంగతి తెలిసిందే.
భారత్ ‘ఫెయిర్ ప్లేస్’గా మారాక కాంగ్రెస్ రిజర్వేషన్ల రద్దుపై ఆలోచిస్తుందని LoP రాహుల్ గాంధీ USలో అన్నారు. ‘90% ఉన్న OBC, దళిత, ఆదివాసీలకు సరైన ప్రాతినిధ్యమే లేదు. టాప్-10 వ్యాపారాలు, మీడియా పరిశ్రమ, బ్యూరోక్రాట్లు, అత్యున్నత కోర్టుల్లో వెనకబడిన వర్గాల వారు కనిపించరు. అందుకే కులగణన అవసరం. ఈ కులాల వారి సామాజిక, ఆర్థిక పరిస్థితి తెలుసుకొనేందుకు సోషియో ఎకనామిక్ సర్వే సైతం చేపట్టాలి’ అని ఆయన అన్నారు.
AP: విజయవాడ వరద బాధితులకు త్వరలో నష్టపరిహారం అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. తాజాగా వరద ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, సాయంత్రానికి వరద పూర్తిగా తగ్గుతుందన్నారు. 1.7లక్షల మందికి నిత్యావసర సరుకులు అందించామని, ఆస్తి నష్టంపై సర్వే జరుగుతోందని చెప్పారు.
ఈరోజు జరిగే ‘దేవర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్గా హాజరవుతారనే చర్చ నడుస్తోంది. తారక్, బన్ని ‘బావ’ అని ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘దేవర’ ఈవెంట్కు బన్ని రానున్నారని సమాచారం. కొరటాల శివ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. పాటలు హిట్ అయిన తరుణంలో ట్రైలర్పైనా భారీ అంచనాలున్నాయి.
బంగ్లా పవర్ బోర్డు నుంచి రావాల్సిన $800 మిలియన్ల బకాయిలను త్వరగా ఇప్పించాలని ఆ దేశ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ను అదానీ పవర్ కోరింది. ఈ అంశంలో జోక్యం చేసుకొని బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని లేఖ రాసింది. ఝార్ఖండ్ ప్లాంట్ నుంచి అదానీ కంపెనీ బంగ్లాకు విద్యుత్ సరఫరా చేస్తోంది. నెలకు $90-95 మిలియన్లు తీసుకుంటుంది. కొన్ని నెలలుగా అందులో సగం వరకే చెల్లిస్తుండటంతో బకాయిలు పేరుకుపోయాయి.
TG: భారీ వర్షాల సమయంలో రైల్వే ట్రాక్లు ధ్వంసమైన ప్రదేశాలను గుర్తించి పైఅధికారులకు చెప్పి, ప్రమాదాలను నివారించిన వారిని రైల్వేశాఖ సన్మానించింది. సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆరుగురు సిబ్బందికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. G.మోహన్(ఇంటికన్నె), B.జగదీశ్(తాళ్లపూసపల్లి), K.కృష్ణ, B.జైల్సింగ్, V.సైదానాయక్, P.రాజమౌళి(మహబూబాబాద్) ఉన్నారు.
పంజాబ్లోని జలంధర్కు చెందిన ప్రీతమ్ లాల్ పాత సామాన్లు కొనుగోలు చేస్తుంటారు. అలా వచ్చిన డబ్బులతో గత 50 ఏళ్లుగా లాటరీ టికెట్స్ కొంటున్న ఆయనకు ప్రతిసారి నిరాశే ఎదురయ్యేది. ఇక లాటరీలు కొనవద్దు అనుకోగా.. భార్య చెప్పడంతో ఇదే చివరిదని రూ.500 పెట్టి కొనుగోలు చేశారు. ఇన్నిరోజులు అతని సహనాన్ని పరీక్షించిన అదృష్టం ఆ లాటరీతో ప్రీతమ్ ఇంటి తలుపు తట్టింది. పంజాబ్ స్టేట్ లాటరీలో ఆయన రూ.2.5 కోట్లు గెలుపొందారు.
లోక్సభ ఎన్నికలు న్యాయంగా జరిగినట్టు తాను విశ్వసించడం లేదని LoP రాహుల్ గాంధీ అమెరికాలో అన్నారు. ‘BJPకి 240 సీట్లలోపు వచ్చుంటే నేను ఆశ్చర్యపోయేవాడిని. వారికి అర్థబలం చాలా ఎక్కువ. వారు కోరుకున్నట్టే EC పనిచేసింది. తన అజెండాకు తగిన విధంగా ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేసేందుకు మోదీకి అవకాశం దొరికింది. బ్యాంకు ఖాతాలు స్తంభించినా కాంగ్రెస్ పోటీ చేసింది. మోదీ ఆలోచనను నాశనం చేసింది’ అని ఆయన అన్నారు.
Sorry, no posts matched your criteria.