India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

‘పుష్ప-2’ విడుదల నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవితో పాటు డైరెక్టర్ సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే ఆయన సినిమా చూస్తారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వార్ నేపథ్యంలో వీరు ఇలా కలవడం చర్చనీయాంశంగా మారింది.

బంగ్లా మాజీ PM షేక్ హసీనా ప్రసంగాల ప్రసారాన్ని ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్(ICT) కోర్టు నిషేధించింది. ఆమెపై ఉన్న హత్యారోపణలపై దర్యాప్తు జరుగుతోందని, ప్రసారాలు సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రమాదమున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని ప్రాసిక్యూటర్ హొస్సేన్ తమీమ్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ యూనస్ బంగ్లాలో హిందువులపై దాడుల్ని ఓ కుట్ర ప్రకారం అమలు చేస్తున్నారని హసీనా ఇటీవల ఆరోపించారు.

‘పుష్ప-2’ సినిమాకు దాదాపు 90% <<14713017>>బ్యాక్ గ్రౌండ్ స్కోర్<<>> తానే ఇచ్చినట్లు మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ వెల్లడించారు. ‘నేను స్క్రిప్ట్ చదవకుండా BGM ఇచ్చిన మూవీ ఇదొక్కటే. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఎడిటింగ్ అయిపోగానే నన్ను సంప్రదించారు. మొత్తం సినిమాకు పనిచేశాను. కొన్ని చోట్ల DSP ఇచ్చిన BGM అలాగే ఉంచారు. క్లైమాక్స్ ఫైట్లో వచ్చే BGM కూడా నాదే’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

TG: HYDలోని సచివాలయ ప్రాంగణం, నెక్లెస్ రోడ్డు, బుద్ధపూర్ణిమ ప్రాంతంలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో తెలంగాణ కార్నివాల్ జరుగుతుందని CM రేవంత్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే కార్యక్రమాలు, రాష్ట్ర పిండివంటలు, డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. సాయంత్రం వేళల్లో జరిగే సంబరాల్లో TG వాళ్లే కాకుండా ఇతర రాష్ట్రాల వారూ పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

టీజీపీఎస్సీ ఛైర్మన్గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నట్లు ఆయన చెప్పారు. కమిషన్ పరిధిలోని పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా మాయమాటలు చెబితే నమ్మవద్దని సూచించారు. నిరుద్యోగుల కోసం టోల్ ఫ్రీ నంబర్ అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు.

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆప్త మిత్రుడు శంతను నాయుడు జంతుప్రేమికుడు మాత్రమే కాదు రచయిత కూడా. పుస్తక ప్రేమికుల కోసం ఈ నెల 8న జైపూర్ ఎడిషన్ బుకీస్ను ఆవిష్కరించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ప్లేసుల్లో పుస్తక పఠనం చేయడం. ముందుగా ముంబైలో దీనిని ఆవిష్కరించిన శంతను తర్వాత పుణే, బెంగళూరుకు దీనిని విస్తరించారు.

AP: తనకు సీఐడీ <<14794478>>లుక్ ఔట్ సర్క్యులర్<<>> జారీ చేయడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ‘కేవీ రావుకు ఫోన్ చేసి బెదిరించినట్లు ఆధారాలున్నాయా? కాకినాడ పోర్టును కేవీ రావుకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నారు. నాకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఏంటి? చంద్రబాబు, కేవీ రావుపై పరువు నష్టం దావా వేస్తా. దీనిపై సీఐడీతో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలి’ అని అన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టీమ్పై HYD చిక్కడపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిన్న సంధ్య థియేటర్లో ప్రీమియర్స్ సందర్భంగా సినిమా చూసేందుకు బన్నీ వస్తున్నట్లు పోలీసులకు సరైన సమయంలో చెప్పలేదని ఆయన టీంపై అభియోగాలు మోపారు. చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పోలీసులు మండిపడ్డారు. కాగా ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో 30 లక్షలకు పైగా టికెట్లు ప్రీ సేల్ జరిగిన చిత్రంగా నిలిచింది. భారత సినిమాలోనే ఇది అపూర్వమైన రికార్డు అని పుష్ప టీమ్ పేర్కొంది. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది.
Sorry, no posts matched your criteria.