India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. రెండో పాట రిలీజ్ డేట్ ఈ Septలో అనౌన్స్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో వినాయక చవితి కానుకగా అప్డేట్ కోసం ఎంతో ఎదురు చూసిన ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. కాగా ఈ మూవీలో చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సందడి చేయనున్నారు.
మణిపుర్లో మళ్లీ విధ్వంసం చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో మైతేయి, కుకీ తెగల మధ్య మరోసారి వివాదం మొదలైంది. జిల్లాలోని నుంగ్సిప్పి, రషీద్పూర్ గ్రామాలలోని తేయాకు తోటల్లో ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు జరిగినట్లు సమాచారం. ఇందులో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-Aతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-B బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మెరుపులు మెరిపిస్తున్నారు. ఆకాశ్ దీప్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో బౌండరీల వర్షం కురిపించారు. ఆ ఓవర్ తొలి బంతిని డిఫెండ్ చేసిన సర్ఫరాజ్ మిగిలిన 5 బంతుల్లో 5 బౌండరీలు బాదారు. దీంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్(32), పంత్(29) ఉన్నారు.
కశ్మీరీ వేర్పాటువాది అఫ్జల్ గురును ఉరి తీయడం వల్ల ఏదైనా ప్రయోజనం నెరవేరినట్టు తాను భావించడం లేదని JK మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ ఎప్పటికీ ఉగ్రవాదులతోనే ఉంటుందంటూ ఆరోపించింది. అఫ్జల్ను ఉరితీయడం వల్ల ఎలాంటి మంచి జరగలేదంటున్న ఇండియా కూటమి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రశ్నిస్తోందా అని నిలదీసింది.
AP: వరదలతో తలెత్తే ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో లక్ష మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. దోమ తెరలు కూడా సరఫరా చేస్తున్నామని, కలుషిత నీటితో వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది సోమవారానికి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. రేపు ఏలూరు, అల్లూరి, ఉ.గో, NTR జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, కృష్ణా జిల్లాల్లో భారీ వానలు పడతాయంది. పూర్తి జాబితా కోసం ఇక్కడ <
చెట్ల నుంచి వచ్చే ఒకరకమైన స్రావం గట్టిపడి వేల ఏళ్లకు శిలాజంగా మారుతుంది. దాన్ని అంబర్ అంటారు. ఇది ఎంతో విలువైనది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద అంబర్లలో ఒకదాన్ని రొమేనియాలో గుర్తించారు. ఓ బామ్మ ఇంటి వాకిట్లో దాన్ని మెట్టుగా వాడేవారు. కొడుకూ దాన్ని సాధారణ రాయిగానే చూశాడు. తర్వాత దాని విలువను గుర్తించి ప్రభుత్వానికి విక్రయించాడు. దాని బరువు 3.5KG. వయసు 7 కోట్ల ఏళ్లని, విలువ ₹9cr ఉంటుందని అంచనా.
యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ ముషీర్ ఖాన్ సెకండ్ ఇన్నింగ్స్లో నిరాశపర్చారు. దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-A, ఇండియా-B జట్లు తలపడుతున్నాయి. ఇందులో ఇండియా-B బ్యాటర్ ముషీర్ ఖాన్ తొలి ఇన్నింగ్స్లో 181 రన్స్ చేసి సంచలనంగా మారారు. దీంతో ఆ జట్టు 321 రన్స్ చేసింది. కాగా రెండో ఇన్నింగ్స్లో ఒక్క పరుగు కూడా చేయకుండానే ఆకాశ్ దీప్ బౌలింగ్లో ఔటయ్యారు. ప్రస్తుతం 33/3గా ఉన్న ఇండియా-B 123 రన్స్ లీడ్లో ఉంది.
నగరాలు, పట్టణాల్లో క్విక్ కామర్స్ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టా మార్ట్ వంటి కంపెనీలు 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తుండటంతో కొందరు వినియోగదారులు అటువైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇవాళ వినాయక చవితికి కావాల్సిన విగ్రహాలు, పత్రులు, పుష్పాలు, మామిడి ఆకులు, కుంకుమ.. ఇలా ప్రతి ఒక్క వస్తువును విక్రయించారు. వీటితో కిరాణాషాపులు, వీధి వ్యాపారులపై ప్రభావం పడుతోంది.
TG: TPCC నూతన అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ను నియమించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. ‘రెడ్డి వర్గానికి పదవి ఇవ్వాలనుకుంటే జగ్గారెడ్డి చర్చలోకి వస్తాడు. నేను కాంగ్రెస్లో సంతోషంగానే ఉన్నా. సామాన్యుడైన మహేశ్ కుమార్కు అవకాశం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ గొప్పతనం’ అని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన వినాయకచవితి వేడుకల్లో జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పోస్టులపై తాను చర్చించనని అన్నారు.
Sorry, no posts matched your criteria.