India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కోట్లాది తెలుగు ప్రజలకు జీవనాధారంగా మారిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు నేటితో 69 ఏళ్లు పూర్తి అయ్యాయి. 1955 డిసెంబర్ 10న అప్పటి ప్రధాని నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి జలాశయాల్లో ఒకటైన దీని విస్తీర్ణం 110చ.మైళ్లు కాగా, గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు. ప్రాజెక్ట్ కుడి కాలువను జవహర్ కాలువగా, ఎడమ దాన్ని లాల్ బహదూర్ కాలువగా పిలుస్తారు.

TG: నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. కాగా, BRS అధినేత KCR సభకు వస్తారా? రారా? అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన అసెంబ్లీకి రావాలని, ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇవ్వాలని CM పలుమార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. KCR సభకు వస్తారా? రారా? Comment చేయండి.

AP: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేలా నేడు, రేపు రాష్ట్రస్థాయి ‘కళా ఉత్సవ్’ పోటీలు విజయవాడలో జరగనున్నాయి. మిమిక్రీ, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, ఓకల్ మ్యూజిక్, జానపద కీర్తనలు- నృత్యం, క్లాసికల్ డాన్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. 9, 10, ఇంటర్ విద్యార్థులు వ్యక్తిగత, గ్రూప్ విభాగాల్లో పాల్గొంటారు. సత్తా చాటిన వారిని జనవరి 2 నుంచి 7 వరకు భోపాల్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపుతారు.

మంచు కుటుంబంలో <<14827893>>విభేదాలు<<>> చర్చనీయాంశంగా మారాయి. మోహన్బాబు తన ముగ్గురు పిల్లలకు ఆస్తులు పంచేయగా, విద్యాసంస్థల్లో వాటాపై మనోజ్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ అంశంపైనే శనివారం రాత్రి డైలాగ్ కింగ్ నివాసంలో భేటీఅయ్యారు. గొడవ జరగడంతో మోహన్బాబు అనుచరుడు వినయ్ మనోజ్పై దాడి చేసినట్లు సమాచారం. దీంతో అతను ఫోన్ చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారని, తర్వాత కాంప్రమైజ్ అయినట్లు చెప్పడంతో వెళ్లిపోయారని టాక్.

దేశవ్యాప్తంగా రబీ సీజన్లో పంటల సాగు గణనీయంగా పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఏడాది 4.11 కోట్ల హెక్టార్లలో సాగవగా, ఈ ఏడాది డిసెంబర్ తొలి వారానికే 4.28 కోట్ల హెక్టార్లకు చేరుకుందని తెలిపింది. గోధుమలు 2 కోట్ల హెక్టార్లు, పప్పు ధాన్యాలు 1.08 కోట్ల హెక్టార్లు, వరి 97.5 లక్షల హెక్టార్లలో సాగైనట్లు పేర్కొంది.

AP: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కాకినాడ జేఎన్టీయూలో 14 రౌండ్స్లో 9 టేబుల్స్పై అధికారులు ఉదయం 8నుంచి ఓట్లను లెక్కించనున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో ఐదుగురు అభ్యర్థులు నిలిచిన విషయం తెలిసిందే. డిసెంబర్ 5న ఓటింగ్ జరగ్గా, 15,490 మంది ఓటేశారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో స్పష్టమైన మెజారిటీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

అడిలైడ్ టెస్టు ఓటమితో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశారు. టెస్టుల్లో వరుసగా 4 పరాజయాలు చవిచూసిన మూడో కెప్టెన్గా.. ధోనీ, కోహ్లీ, దత్తా గైక్వాడ్ సరసన రోహిత్ నిలిచారు. టెస్టుల్లో అత్యధిక వరుస ఓటములు చవిచూసిన కెప్టెన్ల జాబితాలో మన్సూర్ అలీఖాన్ పటౌడి (6), సచిన్(5) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టీమ్ఇండియా స్వదేశంలో రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఓడిన విషయం తెలిసిందే.

TG: CM రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఏటా డిసెంబర్ 9న అవతరణ దినోత్సవం నిర్వహించి ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ ఆలాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తొలి ప్రకటన 2009 డిసెంబర్ 9న వెలువడిన నేపథ్యంలో ఇదే రోజు పండుగలా నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడగా, CM అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.

AP: తమ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే షేర్ మార్కెట్ ట్రేడింగ్ టిప్స్ చెప్తామని, లాభాలు చూపిస్తామంటే కాల్స్ వస్తే నమ్మొద్దని VJA పోలీసులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున మోసపోతే బాధితులు వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. అలాగే, పోలీస్/సీబీఐ/ఈడీ అధికారుల పేరుతో వచ్చే వీడియో కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు. వీడియో కాల్స్, మెసేజ్ల ద్వారా అరెస్టులు చేయరని అవగాహన కల్పిస్తున్నారు.

రష్యాతో యుద్ధంలో 43వేల మంది సైనికులను కోల్పోయామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. దాదాపు మూడేళ్లుగా చేస్తున్న యుద్ధంలో మరో 3.70లక్షల మంది గాయపడ్డారన్నారు. రష్యా 1.98లక్షల మంది సైన్యాన్ని కోల్పోయిందని చెప్పారు. అటు, ఇరుదేశాలు కాల్పుల విరమణ అమలు చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జెలెన్స్కీలతో నిన్న భేటీ అయిన ఆయన ఈ యుద్ధంలో ఇరుదేశాలు నష్టపోయాయన్నారు.
Sorry, no posts matched your criteria.