India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేశ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. జంషెడ్పూర్ XLRI మేనేజ్మెంట్ స్కూల్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. $3 ట్రిలియన్ల పరిమాణంతో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందన్నారు. మరో 3 ఏళ్లలో $5 ట్రిలియన్లతో 3వ స్థానానికి చేరుతుందని, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా నిలుస్తుందన్నారు.

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ టికెట్ల ధరలు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని – మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150-100 మేర తగ్గాయి. రేపటి నుంచి ఈ ధరలు అందుబాటులోకి రానున్నాయి. బుకింగ్ సైట్లలో తగ్గించిన ధరలు అందుబాటులో ఉన్నాయి. కాగా మూవీకి టికెట్ ధరలు భారీగా పెంచడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

ఇండియాకు ఉన్న భౌగోళిక వైవిధ్యం దృష్ట్యా శీతాకాలంలో కొన్ని పక్షులు వందల, వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్కు వస్తుంటాయి. వాటి స్వస్థలాల్లో వాతావరణం ఇబ్బందిగా ఉండటం ఈ వలసలకు కారణం. వాటిలో సైబీరియన్ క్రేన్, డన్లిన్, బార్ హెడెడ్ గూస్, నార్తర్న్ పిన్టెయిల్, కామన్ రెడ్షాంక్, గ్రేటర్ ఫ్లెమింగో, రోజీ పెలికాన్, బ్లాక్ టెయిల్డ్ గాడ్విట్, బ్లూ థ్రోట్, బ్లాక్ క్రౌన్డ్ నైట్ హెరోనా తదితర పక్షులు ఉన్నాయి.

దేశంలోని థియేటర్లలో ‘పుష్ప-2’ హవా కొనసాగుతున్న నేపథ్యంలో బాలీవుడ్పై పరోక్షంగా దర్శకుడు ఆర్జీవీ సెటైర్లు వేశారు. ‘బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిందీ ఫిల్మ్గా డబ్బింగ్ చిత్రం ‘పుష్ప-2’ నిలిచింది. బాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద హిందీ నటుడు ఆ భాష మాట్లాడలేని తెలుగు యాక్టర్ అల్లు అర్జున్. ఇకపై పాన్ ఇండియా కాదు. ఇది తెలుగు ఇండియా’ అని తనదైన స్టైల్లో Xలో రాసుకొచ్చారు.

TG: ప్రజల అంచనాలను చేరుకుంటే తప్ప పార్టీల మనుగడ కొనసాగదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ పదవిపై తనకు సమాచారం లేదని చెప్పారు. రాజకీయనేతగా ఏ పార్టీలోనైనా ఉండగలనని తెలిపారు. రేవంత్ తనకు సీఎంగా వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నారని అన్నారు. రాజకీయాలు ప్రజాసేవ కోసమన్నది తన ఫిలాసఫీ అని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలు లేని పార్టీ ఉండదన్నారు.

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 17న ఏపీలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరై ప్రసంగిస్తారు. దీంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా శీతాకాల విడిదిలో భాగంగా ముర్ము ఈ నెల 16 నుంచి 21 వరకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో బస చేయనున్నారు.

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్లో సమావేశమయ్యారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు శాసనసభ సమావేశాలకు కేసీఆర్ వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇంగ్లండ్ ఆల్రౌండర్ గుస్ అట్కిన్సన్ అరుదైన రికార్డు సృష్టించారు. టెస్టుల్లో అత్యంత వేగంగా ఓ సెంచరీ, హ్యాట్రిక్, ఒకే మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా నిలిచారు. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో హ్యాట్రిక్ వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధ్యమైంది. కేవలం 10 టెస్టుల్లోనే అతను ఈ ఫీట్ నమోదు చేశారు. గతంలో ఇర్ఫాన్ పఠాన్ 26 టెస్టుల్లో ఈ రికార్డు సాధించారు.

AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత <<14819228>>బుద్దా వెంకన్న<<>> పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయవాడ సీపీ రాజశేఖర్బాబుకు లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే VSRను అరెస్టు చేయాలని కోరారు. కాకినాడ పోర్టు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.

అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ను 198 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆ జట్టులో రిజాన్(47), జేమ్స్(40), ఫైజల్(39) ఫర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో యుధజిత్, చేతన్, హర్దిక్ రాజ్ తలో 2, కిరణ్, కార్తికేయ, ఆయుశ్ చెరో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 199.
Sorry, no posts matched your criteria.