News October 13, 2024

బ్రహ్మోత్సవాలు విజయవంతం.. టీటీడీకి సీఎం అభినందనలు

image

తిరుమల బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ‘తిరుమలలో ఏటా 450 ఉత్సవాలు జరుగుతాయి. అన్నింటికంటే బ్రహ్మోత్సవాలు ముఖ్యమైనవి. గతంలో 16 లక్షల మందికి అన్నప్రసాదం అందించగా ఈసారి 26 లక్షల మందికి అందించారు. పండుగ విశిష్టత, వైభవం తెలిసేలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్న టీటీడీకి అభినందనలు’ అని సీఎం తెలిపారు.

News October 13, 2024

రైతులకు శుభవార్త

image

TG: రైతుల బోరు బావులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకోసం ఎనర్జీ పాలసీపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ‘ఈ సోలార్ పంపు సెట్లతో రైతులకు కరెంట్ ఖర్చు ఉండదు. మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం వల్ల అదనపు ఆదాయం వస్తుంది. పంట, పవర్‌తో రైతులు అదనపు లాభం పొందేలా కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టులు చేడతాం’ అని ఆయన ప్రకటించారు.

News October 13, 2024

రేపు గ్రూప్-1 హాల్‌టికెట్లు విడుదల

image

TG: రాష్ట్రంలో ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. అభ్యర్థులు <>tspsc.gov.in<<>> వెబ్‌సైట్‌లో తమ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. మెయిన్స్‌కు మొత్తం 31,382 మంది అర్హత సాధించారు. ఇందులో జనరల్ ఇంగ్లిష్ సహా మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఈనెల 27 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి.

News October 13, 2024

ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు.. విశేషాలు

image

తిరుమల బ్రహ్మోత్సవాలు నిన్నటితో విజయవంతంగా ముగిశాయి. మొత్తం 8 రోజుల్లో శ్రీనివాసుడిని 6 లక్షల మంది దర్శించుకున్నారని, 15 లక్షల మంది శ్రీవారి వాహనసేవలు వీక్షించినట్లు TTD అధికారులు తెలిపారు. ఒక్క గరుడసేవలోనే సుమారు 3.5 లక్షల మంది పాల్గొన్నారు. రూ.26 కోట్ల హుండీ ఆదాయం రాగా మొత్తం 30 లక్షల లడ్డూలు విక్రయించారు. 2.60 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. 8 రోజుల్లో 26 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు.

News October 13, 2024

చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

image

బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసి టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిరీస్‌లు క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు మొత్తం 34 సిరీస్‌లు ఆడి 10 సిరీస్‌ల్లో ప్రత్యర్థిని వైట్ వాష్ చేసింది. టీమ్ ఇండియా తర్వాత పాకిస్థాన్ (8), అఫ్గానిస్థాన్ (6), ఆస్ట్రేలియా (5), ఇంగ్లండ్ (4) ఉన్నాయి.

News October 13, 2024

WC.. ఇవాళ భారత్ VS ఆసీస్

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. గ్రూప్ ఏ నుంచి ఆసీస్ ఇప్పటికే సెమీస్ చేరగా.. మరో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, పాక్ మధ్య పోటీ నెలకొంది. షార్జా వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ALL THE BEST INDIA

News October 13, 2024

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

సాధారణంగా దసరా రోజు తెలంగాణలో నాన్‌వెజ్ వంటకాలే చేస్తారు. అయితే నిన్న శనివారం కావడంతో ఎక్కువశాతం మంది వెజ్‌కే పరిమితమయ్యారు. ఇవాళ ఆదివారం కావడంతో చికెన్, మటన్ కోసం మార్కెట్లకు క్యూ కడుతున్నారు. దీంతో HYDతో పాటు APలోని విజయవాడ సహా ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లలో రద్దీ కనిపిస్తోంది. అయితే 2 రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. స్కిన్‌లెస్ కేజీ రూ.240-260 మధ్య పలుకుతోంది.

News October 13, 2024

టీతోపాటు సిగరెట్ తాగుతున్నారా?

image

చాలా మంది టీ తాగుతూ సిగరెట్ కాలుస్తుంటారు. కానీ దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో క్యాన్సర్, నపుంసకత్వం, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవి శరీరంలో జీర్ణ కణాలనూ దెబ్బ తీస్తాయి. దీంతో అజీర్తి, మలబద్దకం, అల్సర్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ అలవాటు మానలేకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి.

News October 13, 2024

వీరిలో పర్మినెంట్ వికెట్ కీపర్ ఎవరో?

image

ప్రస్తుతం టీమ్ ఇండియాలో వికెట్ కీపర్ స్థానానికి విపరీతమైన కాంపిటీషన్ ఉంది. టీ20ల్లో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యంగా నలుగురు పోటీ పడుతున్నారు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రేసులో ఉన్నారు. నిన్న బంగ్లాతో జరిగిన చివరి టీ20లో విధ్వంసకర సెంచరీతో చెలరేగడంతో శాంసన్ ఈ రేసులో మరింత ముందుకు దూసుకొచ్చారు. ఈ నలుగురిలో మీ ఓటు ఎవరికో కామెంట్ చేయండి.

News October 13, 2024

డ్వాక్రా మహిళలకు రూ.5 లక్షల వడ్డీ లేని రుణం

image

AP: డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో రూ.50 వేల రాయితీ కూడా ఇవ్వనుంది. రాయితీ పోనూ మిగతా రుణంపై వడ్డీ ఉండదు. వ్యాపారం, చిన్నతరహా కుటీర పరిశ్రమలు, తయారీ, సేవా రంగంలో ఉన్నవారికి ఈ రాయితీ రుణాలు ఇవ్వనుంది. తీసుకున్న మొత్తాన్ని 24 నుంచి 60 నెలల్లో వాయిదా పద్ధతుల్లో తీర్చాల్సి ఉంటుంది. రాయితీని చివర్లో మినహాయిస్తారు.