India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన క్యాట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. <

* ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
* KTRపై కేసు నమోదు
* రేవంత్.. నా వెంట్రుక కూడా పీకలేవు: KTR
* రేపు ఏపీలో భారీ వర్షాలు
* తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
* బాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమే: జగన్
* రాహుల్ గాంధీపై FIR నమోదు
* భారీగా తగ్గిన బంగారం ధర
* ‘బలగం’ మూవీ నటుడు మొగిలయ్య మృతి

AP: రాయలసీమలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కుకు భారీ పెట్టుబడి రాబోతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ట్వీట్ చేశారు. సెమీ కండక్టర్ రంగంలో రూ.14వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దీని వల్ల పారిశ్రామిక వృద్ధితో పాటు ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నాయకత్వంలో రాయలసీమను ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

AP: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గత ఎన్నికల్లో గోరంట్ల మాధవ్కు జగన్ సీటు నిరాకరించారు. దీంతో ఆయన ఎక్కడా పోటీ చేయలేదు.

భూమిపై అత్యంత నిశ్శబ్ద ప్రదేశం గురించి మీరెప్పుడైనా విన్నారా? మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్లోని(USA) ఓర్ఫీల్డ్ లాబొరేటరీస్లో గల అనెకోయిక్ టెస్ట్ ఛాంబర్లో ఇది ఉంది. దీనిని నిర్మించేందుకు దాదాపు రెండేళ్లు పట్టింది. ధ్వని తరంగాలు రిఫ్లెక్ట్ అవకుండా కట్టడంతో ఈ గది లోపల ధ్వనిస్థాయి -20.3 డెసిబుల్స్ మాత్రమే. దీంతో ఈ రూమ్లో ఉన్నవారికి తమ హార్ట్ బీట్, రక్త ప్రసరణ ధ్వని కూడా పెద్దగా వినిపిస్తుంది.

వన్యప్రాణుల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో గుర్తించలేం. అలాంటిది సింహాన్ని దగ్గర నుంచి ఫొటో తీయాలంటే సాహసమనే చెప్పాలి. పైన కనిపిస్తోన్న ఫొటోలో సింహానికి కోపమొస్తే ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించారు. దీనిని ఫొటోగ్రాఫర్ అతిఫ్ సయీద్ 2015లో తీశారు. కారు నుంచి బయటకు దిగి ఫొటో తీస్తుండగా సింహం అతణ్ని గమనించింది. ఈ ఫొటో తీసిన వెంటనే సింహం అతనిపై దాడి చేసింది. కారు డోరు ఓపెన్ ఉండటంతో అతను బతికిపోయాడు.

హైదరాబాద్ జూ నుంచి సింహం తప్పించుకుని నగరంలో ప్రవేశించిందని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారంటూ వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్తలపై హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ RM దోబ్రియాల్ స్పందించారు. ‘ఇది ఓ ఫేక్ న్యూస్. సింహంపై తీసిన ఓ సినిమా ప్రమోషన్లకు దీనిని ఉపయోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ను వెంటనే డిలీట్ చేయాలని మూవీ టీమ్ను ఆదేశించాం’ అని చెప్పారు.

విపక్ష నేత రాహుల్ గాంధీపై ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదైంది. తమ ఎంపీలపై దాడి చేశారని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో <<14924533>>ఇవాళ బీజేపీ ఫిర్యాదు<<>> చేసింది. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా రాహుల్పై BNS 109, 117, 125, 131, 351 సెక్షన్ల కింద కేసు పెట్టామన్నారు. 109 అటెంప్ట్ టు మర్డర్, 117 స్వయంగా గాయపరచడం కిందకు వస్తాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ను సినీ ఇండస్ట్రీ మొత్తం తీవ్రంగా ఖండించాలని డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ‘ఏ సినీ స్టార్ అయినా, పొలిటికల్ స్టార్ అయినా పాపులర్ కావడం వారి తప్పా? అలాగైతే ‘క్షణం క్షణం’ షూటింగ్ సమయంలో శ్రీదేవిని చూసేందుకు వచ్చిన వేలాది జనంలో ముగ్గురు చనిపోయారు. మరి తెలంగాణ పోలీసులు ఇప్పుడు స్వర్గానికి వెళ్లి శ్రీదేవిని అరెస్ట్ చేస్తారా?’ అని ఆయన పేర్కొన్నారు.

TG: ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై సీఎం రేవంత్ <<14924428>>సిట్ విచారణకు<<>> ఆదేశించడంపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ రెడ్డికి దమ్ముంటే, మగాడైతే ఫస్ట్ టెండర్ రద్దు చేయమనండి’ అని సవాల్ విసిరారు. తాము శాంతియుతంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని కేటీఆర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.