India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం <<14029230>>పవన్ కళ్యాణ్<<>> ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ‘అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి. బాధితులకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలి. సూపర్ క్లోరినేషన్ చేపట్టాలి’ అని ఆయన సూచించారు.
TG: AI టెక్నాలజీ విస్తరణకు HYD కేంద్ర బిందువుగా ఉంటుందని CM రేవంత్ అన్నారు. HICC వేదికగా 2రోజుల AI గ్లోబల్ సదస్సును CM ప్రారంభించారు. తెలంగాణ AI రోడ్ మ్యాప్, AI సిటీ నమూనాలను ఆవిష్కరించారు. సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో మార్పులు అసాధ్యమన్నారు. మార్పునకు సిద్ధంగా ఉంటేనే ముందుకు వెళ్లగలమని చెప్పారు. AI రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు HYD సిద్ధంగా ఉందన్నారు.
సమయాన్ని 2’0′ clock, 3’0′ clock అంటూ చెబుతుండటం తెలిసిందే. ఇలా అనడం వెనుక కారణమేంటంటే.. గడియారాలు రాకముందు సన్ డయల్ వంటి పలు రకాలైన మార్గాల్లో సమయాన్ని గణించేవారు. గడియారాలు వచ్చాక అందులో సమయం చెప్పి ‘ఆఫ్ ది క్లాక్(గడియారంలో ఇంత అయింది)’ అని చెప్పడం మొదలైంది. ఉదాహరణకు గడియారంలో 2 గంటలు అయితే ‘2 of the clock’ అనేవారు. అదే కాలక్రమంలో ‘o clock’గా రూపాంతరం చెందింది.
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ ఎంట్రన్స్ టెస్టు కోసం కోచింగ్ పొందడానికి వారం క్రితం కోటాలోని ఇన్స్టిట్యూట్లో చేరిన UPకి చెందిన పరసురామ్ తన అద్దె గదిలో ఉరివేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలపై జవహార్ నగర్ పోలీసులు విచారిస్తున్నారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులపై బాధితుడి తండ్రి చేసిన ఆరోపణలపై కూడా విచారణ చేస్తున్నట్టు వెల్లడించారు.
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భర్తతో అంబులెన్స్లో ప్రయాణిస్తున్న మహిళపై అందులోని సిబ్బంది లైంగిక దాడికి ఒడిగట్టారు. ఆమె నగల్ని దోచుకుని, భర్తకున్న ఆక్సిజన్ సపోర్ట్ తీసేసి అంబులెన్స్ నుంచి కిందికి తోసేశారు. అనంతరం ఆమె భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. యూపీలోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ <<14028580>>బెయిల్పై వాదనల<<>> సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. CBI కేసులో కేజ్రీవాల్కు బెయిల్ ఇస్తే అది హైకోర్టు నిర్ణయాన్ని నిరుత్సాహపరిచినట్టే అవుతుందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించారు. అయితే, ఈ వ్యాఖ్యలను ఆక్షేపించిన జస్టిస్ భూయాన్ ‘అలా చెప్పకండి’ అంటూ వారించారు. CM కస్టడీలో ఉన్నందున సెక్షన్41ఏ నోటీసులు అవసరం లేదని రాజు వాదించారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతూనే విజయవాడ వరదలపై సమీక్షలు నిర్వహించారు. ఇవాళ కూడా అస్వస్థతతోనే అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఆయనకు ఫీవర్ ఇంకా ఎక్కువ కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
TG: తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్ట్ అక్రమమని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని ఎక్స్లో డిమాండ్ చేశారు. ‘ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతులను నొక్కడమేనా? ఇది రేవంత్ సర్కార్ అసమర్థతకు నిదర్శనం. అక్రమ అరెస్ట్లు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చనుకుంటే అది మీ భ్రమే. రాష్ట్రంలో వాక్ స్వాతంత్ర్యం లేదు. నిరంకుశ పాలన సాగుతోంది’ అని ఫైర్ అయ్యారు.
AP: టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. ఇదే కేసులో వైసీపీ నేతలు జోగి రమేశ్, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ కోసం అధికారులు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. YCP మాజీ MP నందిగం సురేశ్కు 14 రోజుల రిమాండ్ పడింది.
తెలుగు రాష్ట్రాల్లో వరదలు రావడంతో బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్ రూ.2కోట్లు విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఇప్పుడే కాదు.. ఎప్పుడు విపత్తులు వచ్చినా విరాళమిచ్చేందుకు ముందుంటారు. అయితే ఆయన పెదనాన్న కృష్ణం రాజు కూడా తక్కువేం కాదు. ఆయన 1986లో తూ.గో, ప.గో జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువగా రూ.1.05లక్షలు డొనేట్ చేశారు. కృష్ణ, దాసరి, రాజేశ్ఖన్నా రూ.లక్ష చొప్పున ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.