India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బాల్యంలోనే అధికమవుతున్న స్థూలకాయం సమస్యల్ని కట్టడి చేయడానికి UK ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పగటిపూట జంక్ ఫుడ్పై TVల్లో వచ్చే ప్రకటనలపై నిషేధం విధించింది. గ్రానోలా, మఫిన్లు, పేస్ట్రీ ప్రకటనలపై ఈ నిషేధం కొనసాగుతుంది. 2025 Oct నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలతో ‘జంక్ ప్రకటనల్ని’ రాత్రి 9 తర్వాతే ప్రసారం చేయాలి. మన దేశంలో కూడా ఇలాంటి నిషేధం అమలు చేయాలా?

AP: ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని అధికారులకు సూచించారు. రైతులు ఏ మిల్లుకైనా ధాన్యాన్ని తీసుకెళ్లవచ్చని స్పష్టం చేశారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ చేయాలని ఆదేశించారు.

సంధ్య థియేటర్ వద్ద నిన్న జరిగిన <<14793383>>తొక్కిసలాటలో అభిమాని<<>> రేవతి మృతి చెందడంపై హీరోయిన్ రష్మిక స్పందించారు. ఇలాంటి ఘటన జరిగినందుకు చింతిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అంతకుముందు మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిన్న సంధ్యలో ప్రీమియర్ షోను అల్లు అర్జున్తో కలిసి రష్మిక చూశారు. కాగా ఈ ఘటనలో గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.

శబరిమల వెళ్లే వారి కోసం రైల్వే శాఖ మరో 28 ప్రత్యేక రైళ్లు నడపనుంది. డిసెంబర్ 11 నుంచి జనవరి 29 వరకు వివిధ తేదీల్లో నడిచే ఈ రైళ్లు మౌలాలి-కొల్లం, కాచిగూడ-కొట్టాయం, కాకినాడ-కొల్లం, నర్సాపూర్-కొల్లం మధ్య ఇరువైపులా తిరగనున్నాయి. డిసెంబర్ 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఈ రైళ్ల రిజర్వేషన్ బుకింగ్ అందుబాటులోకి రానుంది.

AP: వ్యవసాయ రంగాన్ని తమ ప్రభుత్వం గాడిలో పెడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గుంటూరులో మిర్చి యార్డును పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తాం. కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి ఏడాదికి మొత్తం రూ.20,000 అందిస్తాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5 తుఫాన్లు వచ్చాయి. ఆలస్యం చేయకుండా రైతులకు నష్ట పరిహారం అందిస్తున్నాం’ అని మంత్రి చెప్పారు.

‘పుష్ప-2’ విడుదల నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవితో పాటు డైరెక్టర్ సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే ఆయన సినిమా చూస్తారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వార్ నేపథ్యంలో వీరు ఇలా కలవడం చర్చనీయాంశంగా మారింది.

బంగ్లా మాజీ PM షేక్ హసీనా ప్రసంగాల ప్రసారాన్ని ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్(ICT) కోర్టు నిషేధించింది. ఆమెపై ఉన్న హత్యారోపణలపై దర్యాప్తు జరుగుతోందని, ప్రసారాలు సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రమాదమున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని ప్రాసిక్యూటర్ హొస్సేన్ తమీమ్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ యూనస్ బంగ్లాలో హిందువులపై దాడుల్ని ఓ కుట్ర ప్రకారం అమలు చేస్తున్నారని హసీనా ఇటీవల ఆరోపించారు.

‘పుష్ప-2’ సినిమాకు దాదాపు 90% <<14713017>>బ్యాక్ గ్రౌండ్ స్కోర్<<>> తానే ఇచ్చినట్లు మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ వెల్లడించారు. ‘నేను స్క్రిప్ట్ చదవకుండా BGM ఇచ్చిన మూవీ ఇదొక్కటే. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఎడిటింగ్ అయిపోగానే నన్ను సంప్రదించారు. మొత్తం సినిమాకు పనిచేశాను. కొన్ని చోట్ల DSP ఇచ్చిన BGM అలాగే ఉంచారు. క్లైమాక్స్ ఫైట్లో వచ్చే BGM కూడా నాదే’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

TG: HYDలోని సచివాలయ ప్రాంగణం, నెక్లెస్ రోడ్డు, బుద్ధపూర్ణిమ ప్రాంతంలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో తెలంగాణ కార్నివాల్ జరుగుతుందని CM రేవంత్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే కార్యక్రమాలు, రాష్ట్ర పిండివంటలు, డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. సాయంత్రం వేళల్లో జరిగే సంబరాల్లో TG వాళ్లే కాకుండా ఇతర రాష్ట్రాల వారూ పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

టీజీపీఎస్సీ ఛైర్మన్గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నట్లు ఆయన చెప్పారు. కమిషన్ పరిధిలోని పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా మాయమాటలు చెబితే నమ్మవద్దని సూచించారు. నిరుద్యోగుల కోసం టోల్ ఫ్రీ నంబర్ అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.