India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్రవ్యాప్తంగా 53 నూతన జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా పంపిన ప్రతిపాదనలకు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆమోదం తెలిపారు. 37 మండలాల్లో 47, రెండు పట్టణ ప్రాంతాల్లో 6 కాలేజీలను ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 480 జూనియర్ కాలేజీలున్నాయి.

చిన్న, మధ్యతరహా కంపెనీలకు స్థిరమైన పరిస్థితులను భారత ప్రభుత్వం, అక్కడి నాయకత్వం సృష్టించిందని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. PM నరేంద్రమోదీ చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ బాగుందని ప్రశంసించారు. ‘రష్యా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ప్రోగ్రామ్లాగే మేకిన్ ఇండియా ఉంటుంది. భారత్లో తయారీ ప్లాంట్లను నెలకొల్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అక్కడ పెట్టుబడులు లాభయదాకమని మేం విశ్వసిస్తున్నాం’ అని అన్నారు.

TG: ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మంది ట్రాన్స్జెండర్లు ఎంపికయ్యారు. నిన్న హైదరాబాద్ గోషామహల్ మైదానంలో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ లాంటి ఈవెంట్స్ నిర్వహించగా 58 మందిలో 44 మంది పాస్ అయ్యారు. వీరికి త్వరలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అనంతరం సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ మానిటరింగ్తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ సేవలకు వినియోగించుకోనున్నారు. వీరికి ప్రత్యేక యూనిఫామ్, స్టైఫండ్ అందిస్తారు.

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశాలను ఇకపై నెలకు రెండుసార్లు(మొదటి, మూడో గురువారం) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు CS నీరభ్కుమార్ ఉత్తర్వులిచ్చారు. గురువారం ప్రభుత్వ సెలవు ఉంటే శుక్రవారం భేటీ జరగనుంది. సమావేశాలకు 3 రోజుల ముందుగానే అన్ని శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖకు పంపాలని CS సూచించారు. కాగా ఈ నెల 19న రెండో మంత్రివర్గ సమావేశం జరగనుంది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్లో జరిగే పింక్ బాల్ మ్యాచుకు వరుణుడి ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తర్వాతి నాలుగు రోజుల్లో వాన పడే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పిచ్పై కవర్లు కప్పి ఉంచారు. కాగా తొలి టెస్టులో భారత్ గెలిచి సిరీస్లో 1-0 తేడాతో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.

AP: శ్రీహరికోటలోని షార్ నుంచి నేడు సా.4.12 గంటలకు PSLV C59 రాకెట్ను ఇస్రో ప్రయోగించనుంది. నిన్న జరగాల్సిన ప్రయోగం సాంకేతిక కారణాలతో ఇవాళ్టికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ESAకు చెందిన ప్రోబా-3 శాటిలైట్ను సైంటిస్టులు నింగిలోకి పంపనున్నారు. దీనిద్వారా సూర్యుడి వాతావరణంలోని అత్యంత వేడి పొర అయిన సోలార్ కరోనాను అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రయోగంలో స్పెయిన్, పోలాండ్, ఇటలీ శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు.

AP: EWS 10% కోటాలో కాపులకు 5% కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై తమకు సందేహాలున్నాయని హైకోర్టు తెలిపింది. ఈ కోటాలో ఓ వర్గానికే సగం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. కాపులకు 5% కోటా అమలు చేయాలని హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని పలువురు సవాల్ చేశారు. ఈ విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు JAN29కి వాయిదా వేసింది.

జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని విషయాలను అలవర్చుకోవాలి. లేదంటే పురోగతి సాధించలేరు. నెగటివ్గా ఆలోచించేవారు వెంటనే దానిని వదిలించుకోవాలి. ఇతరులతో పోల్చుకుని నిరాశ పడకూడదు. గతాన్ని తలచుకుని వర్తమానాన్ని వదిలేస్తే ఎందుకూ పనికిరారు. సోమరితనాన్ని వదిలేస్తేనే లక్ష్యాల్ని సాధిస్తారు. ఒకరిపై అసూయ పడుతూ ఉంటే అక్కడే ఉండిపోతారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. భవిష్యత్ గురించి ఆందోళన పడకూడదు.

AP: పుష్ప-2 టికెట్ ధరలను ఈ నెల 17 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయనుకుంటే మూవీకి వెళ్లొద్దని పిటిషనర్కు ధర్మాసనం సూచించింది. సినిమా టికెట్లపై కాకుండా విస్తృత ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశాలతో వ్యాజ్యాలు వేయాలంది. ఈ పిల్పై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంటూ తీర్పును రిజర్వ్ చేసింది.

పుష్ప-1లో ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ లీడర్గా ఎదిగిన పుష్పరాజ్ అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరాడన్నదే కథ. జాతర సీక్వెన్స్, క్లైమాక్స్లో బన్నీ నటవిశ్వరూపం చూపించారు. శ్రీవల్లి నటన, ప్రీ ఇంటర్వెల్, సాంగ్స్ ప్లస్. సెకండాఫ్లో ఎమోషన్లకు పెద్దపీట వేసిన డైరెక్టర్ స్టోరీలో కీలకమైన స్మగ్లింగ్ను పక్కనబెట్టారు. సాగదీత సీన్లు, రన్టైమ్, విలనిజంలో బలం లేకపోవడం మైనస్. సుక్కు మార్క్ మిస్ అయింది.
RATING: 3/5
Sorry, no posts matched your criteria.