India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

* 2025 జనవరి 4న ‘రఘువరన్ బీటెక్’ రీరిలీజ్
* పుష్ప-2 మరో రికార్డ్.. బుక్ మై షోలో ఫాస్టెస్ట్ 2 మిలియన్ టికెట్స్ సేల్
* ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఓటీటీలోకి అమరన్(నెట్ఫ్లిక్స్), మట్కా(అమెజాన్)
* 12వేలకు పైగా థియేటర్లలో పుష్ప-2 విడుదల
* డ్రగ్స్ కేసులో తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కొడుకు అలీఖాన్ తుగ్లక్ అరెస్ట్

TG: గ్రూప్-4 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. పెద్దపల్లిలో నిర్వహించిన ‘యువ వికాసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాగా ఏటూరు నాగారం, పెద్దపల్లికి బస్ డిపోలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

TG: CM రేవంత్ దేవుళ్లపై ఒట్లు వేయడం వల్లే రాష్ట్రంలో భూకంపం వచ్చిందని BRS MLA పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. CM పాపాల నుంచి ప్రజలను దేవుళ్లే కాపాడాలన్నారు. మరోవైపు తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారని కౌశిక్ ఆరోపించారు. ఇటీవల తాను ఓ మిత్రుడి పార్టీకి వెళ్తే ఫోన్ ట్యాప్ చేయించి, అక్కడికి పోలీసులను పంపించారన్నారు. తన వద్ద డ్రగ్స్ పెట్టించి కేసులో ఇరికించాలని చూశారని మండిపడ్డారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు ఏక్నాథ్ శిండే అంగీకరించారు. ఆయన ఇంటికి వెళ్లి సీఎం అభ్యర్థి ఫడణవీస్ చర్చించడంతో బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పుకున్నారు. రేపు ఆయన ఫడణవీస్తో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజిత్ పవార్ కూడా డిప్యూటీగా ప్రమాణం చేయనున్న సంగతి తెలిసిందే.

రేపు పుష్ప-2 రిలీజ్ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించే సినిమా విజయం కావాలని కోరుకుందామన్నారు. ‘అందరినీ అలరించే సినిమాని సినిమాలానే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని, ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను’ అని పోస్ట్ చేశారు. కాగా, అల్లు-మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా ఫైట్ జరుగుతోన్న వేళ ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

AP: రేపు అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ట్వీట్ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, చిత్తూరులో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అమ్మాయిలు ఇంటి పని చేయాలని, అబ్బాయిలు బయట ఆడుకోవచ్చనే కోణాన్ని పిల్లల నుంచి తొలగించేందుకు చెన్నై కార్పొరేషన్ ముందుకొచ్చింది. వారికి లింగ సమానత్వాన్ని నేర్పించేందుకు జెండర్ ఈక్వాలిటీ ల్యాబ్స్ను ఏర్పాటు చేసింది. ఇందులో ఇంట్లో పనులు, గిన్నెలు తోమడం, వంట చేయడం వంటివి నేర్పుతారు. అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో చెప్తారు. చిన్నప్పుడే పిల్లల ఆలోచనా విధానం మార్చితే మార్పులొస్తాయని ఈ నిర్ణయం తీసుకున్నారు.

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమాకు కర్ణాటకలో షాక్ తగిలింది. బెంగళూరులో ‘పుష్ప-2’ మూవీ మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు ప్రదర్శించవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటలకు ముందు షోలు ప్రదర్శించడం చట్టవిరుద్ధమని కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే షోలు వేసేందుకు పలు చోట్ల మూవీ యూనిట్ ఏర్పాటు చేసింది. తాజా ఆదేశాలతో అభిమానులకు నిరాశే ఎదురైంది.

విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువయ్యారు. BGT సిరీస్లో మరో సెంచరీ చేస్తే వేరే దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ రికార్డును సమం చేస్తారు. డాన్ ఇంగ్లండ్లో 11 సెంచరీలు చేశారు. ప్రస్తుతం కోహ్లీకి ఆస్ట్రేలియాలో 10 సెంచరీలున్నాయి. ఈ సిరీస్లో మరో రెండు సెంచరీలు చేస్తే బ్రాడ్మన్ను అధిగమిస్తారు. కాగా.. ఆస్ట్రేలియాలో కోహ్లీ 43 మ్యాచులాడి 54.20 సగటుతో 2710 రన్స్ చేశారు.

భారత టెస్టు జట్టు అంతా సూపర్ స్టార్లతో నిండి ఉందని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ కొనియాడారు. వారిని తామెప్పుడూ గౌరవిస్తామని వ్యాఖ్యానించారు. ‘భారత జట్టు బ్యాలెన్స్డ్గా ఉంది. అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ ఆ జట్టు ఆటగాళ్లు రాణిస్తుంటారు. బుమ్రా, కోహ్లీ టీమ్ ఇండియాకు తురుపుముక్కలు. అయితే మేం వెనక్కి తగ్గం. అడిలైడ్ టెస్టులో కచ్చితంగా విజయం సాధించేందుకు ట్రై చేస్తాం’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.