India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వాయిదాలతో అంతరాయాలు ఏర్పడితే లోక్సభను ఆదివారాలూ నడిపిస్తానని స్పీకర్ ఓం బిర్లా వార్నింగ్ ఇచ్చారు. నష్టపోయిన సమయం మేరకు ఇలా నిర్వహిస్తానని తెలిపారు. అదానీ అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో క్రితంవారం సభ సాగలేదు. దీంతో ఉభయ సభల్లోనూ రెండ్రోజులు రాజ్యాంగంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. ‘డిసెంబర్ 14న 11AMకు సభ మొదలవుతుంది. మళ్లీ వాయిదాలు పడితే సభ్యులు ఆదివారాలూ రావాల్సి వస్తుంది’ అని అన్నారు.

‘పుష్ప-2’ సినిమాపై వస్తోన్న క్రేజ్పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘పుష్ప-2కు వస్తోన్న మెగా క్రేజ్ చూస్తుంటే తదుపరి మెగా అల్లునే. బన్నీ మీరు బాహుబలి కాదు. కానీ, స్టార్స్లో మెగాబలి’ అని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్కు ఆయన తీస్తోన్న ‘శారీ’ మూవీ పోస్టర్ను అటాచ్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటోనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

బంగ్లాదేశ్ అరెస్టు చేసిన హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్కు ఇప్పట్లో ఊరట దొరికేలా లేదు. అతడి బెయిల్ విచారణ వాయిదా పడింది. ఆయన తరఫున వాదించేందుకు లాయర్లు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. ఆయన నియమించుకున్న లాయర్ రామెన్ రాయ్పై ఇస్లామిస్టులు నిన్న <<14775519>>మూకదాడి<<>> చేయడం తెలిసిందే. తీవ్రగాయాల పాలైన ఆయన ఇప్పుడు ICUలో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో మరే లాయరూ కేసు వాదించడానికి ముందుకురావడం లేదు.

TG: సచివాలయంలో CM రేవంత్ ఏర్పాటు చేసేది తెలంగాణ తల్లి విగ్రహం కాదని.. సవతి తల్లి విగ్రహం అని BRS MLC శంబీపూర్ రాజు అన్నారు. తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించేలా విగ్రహ రూపురేఖలు మారుస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల తల్లి విగ్రహాలు నగలు, కిరీటంతో ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం పేదరికంలో కనబడాలా? అని ప్రశ్నించారు. తాము రూపొందించిందే అసలైన తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పారు.

‘పుష్ప-2’ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించడంపై తెలంగాణ ప్రభుత్వానికి హీరో అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినిమా, ఇండస్ట్రీకి సపోర్ట్గా నిలుస్తోన్న సీఎం రేవంత్కు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.

పుష్ప-2 టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. చివరి నిమిషంలో రిలీజ్ను ఆపలేమని స్పష్టం చేసింది. దీంతో సినిమాకు లైన్ క్లియరైంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. బెనిఫిట్ షోల పేరుతో రూ.800 వసూలు చేయడం అన్యాయమని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.

AP: ఓ నెటిజన్ వ్యక్తిగత సమాచారాన్ని జనసేన అభిమాని సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై YCP తీవ్రంగా స్పందించింది. ‘రాష్ట్రంలో పెద్దఎత్తున డేటా ఉల్లంఘన జరుగుతోంది. సున్నితమైన సమాచారం జనసేన అభిమానుల చేతుల్లోకి వెళ్లింది. వేధింపుల కోసం దాన్ని ఉపయోగిస్తున్నారు. పోలీస్ శాఖ నిర్లక్ష్యంతో ప్రజల భద్రత ప్రమాదంలో పడింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్షాను కోరుతున్నాం’ అని ట్వీట్ చేసింది.

TG: ఎదురు కాల్పులన్నీ ప్రభుత్వ హత్యలే అని CPI ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ‘ములుగు ఎన్కౌంటర్పై జ్యుడీషియల్ విచారణ జరపాలి. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సింగరేణి, కాంట్రాక్ట్ కార్మికులకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలి. రేషన్ కార్డులు, పెన్షన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి. బీఆర్ఎస్కు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత లేదు’ అని కూనంనేని విమర్శించారు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత బిలియనీర్ ఎలాన్ మస్క్ సంపద రాకెట్లా దూసుకెళ్తోంది. నవంబర్ 5 నుంచి టెస్లా షేర్ల విలువ 42 శాతం పెరగడంతో చరిత్రలోనే తొలిసారి ఆయన మొత్తం సంపద $350 బిలియన్లను దాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయన సంపద $124 బిలియన్లు పెరగడం విశేషం. మస్క్ తర్వాతి స్థానాల్లో జెఫ్ బెజోస్($231B), జుకర్బర్గ్($210B), ఎల్లిసన్($198B), బెర్నార్డ్ ఆర్నాల్ట్( $171B) ఉన్నారు.

బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టిన ‘పుష్ప’ మూవీ సీక్వెల్ ‘పుష్ప-2’ మరో రెండ్రోజుల్లో విడుదల కానుంది. అయితే, ‘పుష్ప-3’ కూడా ఉండనుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ‘పుష్ప-2’ టైటిల్ ఎండ్ కార్డులో ‘పుష్ప-3.. ది ర్యాంపేజ్’ అని పోస్టర్ రివీల్ చేస్తారని తెలిపాయి. ఎడిటింగ్ రూమ్లో దిగిన ఫొటోను చిత్రయూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల ‘పుష్ప-3’ పోస్టర్ ఉండటం గమనార్హం. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
Sorry, no posts matched your criteria.