India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

IIT మద్రాస్లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థికి రూ.4.3 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. హాంకాంగ్లోని గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ ఈ జాబ్ ఆఫర్ను ఇచ్చింది. జీతం, బోనస్, రీలొకేషన్తో కూడిన ఈ ప్యాకేజీ ఈ సీజన్లోనే అత్యధికం కావడం విశేషం. అతని పేరు ఇంకా బయటకు రాలేదు. బ్లాక్రాక్, గ్లీన్, డా విన్సీ వంటి సంస్థలు పలువురికి రూ.2 కోట్ల కంటే ఎక్కువ ప్యాకేజీలను అందించాయి.

లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లోని ఉపగ్రహాల రద్దీ కారణంగా భూమి కక్ష్యలో ట్రాఫిక్ జామ్ను గుర్తించారు. ప్రస్తుతం భూమి చుట్టూ 14,000 ఉపగ్రహాలు తిరుగుతుండగా వాటిలో దాదాపు 3,500 ఉపగ్రహాలు క్రియారహితంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా, గత ఉపగ్రహ ప్రయోగాలు, ఘర్షణల ద్వారా 120 మిలియన్ల శిథిలాలు కక్ష్యలోనే ఉండిపోయాయని అంచనా వేశారు. భవిష్యత్తులో ఇది అంతరిక్ష కార్యకలాపాలకు ముప్పు అని హెచ్చరించారు.

TG: ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని 14 ఆర్టీసీ డిస్పెన్సరీలను యాజమాన్యం ఆస్పత్రులుగా మార్చనుంది. అత్యవసర సేవలు తప్ప మిగతా వైద్యం వీటిల్లోనే అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా వైద్యుల నియామకం జరగడంతో సాధారణ చికిత్సల కోసం HYD రాకుండా ఆయా జిల్లాల్లోనే అందించనున్నారు. అటు, తార్నాకలోని RTC ప్రధాన ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నవారు సైతం జిల్లా ఆస్పత్రుల్లో మందులు తీసుకునే సౌకర్యాన్ని తీసుకురానున్నారు.

AP: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు పడుతుండగా, మరో ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 2వ వారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఇది బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాన్గా మారే అవకాశం ఉందా? లేదా? అనే దానిపై ఈ వారం తర్వాత స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమా టికెట్ బుకింగ్స్లో రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో అత్యంత వేగంగా 10 లక్షల టికెట్స్ బుకింగ్ జరిగినట్లు మేకర్స్ వెల్లడిస్తూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈనెల 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో ఇప్పటికే తెలంగాణలో బుకింగ్స్ మొదలవగా వేగంగా అమ్ముడవుతున్నాయి.

పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ సినిమాల్లో నటిస్తారా? అనే ప్రశ్నకు కాబోయే భర్త నాగ చైతన్య క్లారిటీ ఇచ్చారు. ఆమె కచ్చితంగా నటిస్తుందని వెల్లడించారు. ‘ప్రతి తెలుగింటిలాగే శోభిత కుటుంబం కూడా చాలా సంస్కారం, ఆప్యాయతతో కూడుకున్నది. నన్ను కొడుకులా చూసుకుంటారు’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, నాగచైతన్య- శోభిత ధూళిపాళ వివాహం రేపు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుంది.

AP: ఇవాళ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారికి మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వారి పింఛన్ను రూ.6వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. విశాఖలో దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వారికి అవసరమైన త్రీవీలర్స్, పరికరాలను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.

స్టాక్ మార్కెట్లు మోస్తరు లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే అందాయి. ఈ వారం RBI MPC సమావేశాలు ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ 24,321 (47), సెన్సెక్స్ 80,400 (153) వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకు, మీడియా, PSU బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. FMCG షేర్లపై అమ్మకాల ఒత్తిడి ఉంది. ITC, TRENT, AIRTEL, SUNPHARMA టాప్ లూజర్స్.

ప్రతిష్ఠాత్మక న్యూయార్క్ వరల్డ్ స్పిరిట్స్ కాంపిటీషన్ (NYWSC)-2024లో షారుఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్ మద్దతు ఉన్న D’YAVOL విస్కీ సత్తా చాటింది. ప్రపంచంలోనే బెస్ట్ ఓవరాల్ స్కాచ్ & బెస్ట్ ఆఫ్ క్లాస్ విస్కీగా నిలిచింది. దీనిని విభిన్న పరిశ్రమలకు చెందిన నిపుణుల బృందం నిర్ణయిస్తుంది. దీనిపై D’YAVOL కో ఫౌండర్ షారుఖ్ ఖాన్ స్పందిస్తూ శ్రద్ధ, అభిరుచి, అంకితభావానికి నిదర్శనం అని తెలిపారు.

TG: విశ్వబ్రాహ్మణ కులాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోని ఉపకులాలన్నింటిని కలిపి ఒకటిగానే పరిగణిస్తామని హైకోర్టుకు నివేదించింది. సర్వేలో వేర్వేరు సబ్ కేటగిరీలుగా ఉన్నా, ఒకే కులంగా తీసుకుంటామంది. కాగా విశ్వబ్రాహ్మణులను వేర్వేరు కులాలుగా పరిగణించడంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ మేరకు వివరణ ఇచ్చింది.
Sorry, no posts matched your criteria.