News August 27, 2024

హైడ్రా కమిషనర్‌కు భద్రత పెంపు

image

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. హైదరాబాద్ మధురానగర్‌లోని ఆయన ఇంటి వద్ద ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసింది. రంగనాథ్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతోనే భద్రత పెంచినట్లు తెలుస్తోంది. కాగా నగరంలోని చెరువులు, నాలాలు, కుంటల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన నివాసం వద్ద సెక్యూరిటీ పెంచినట్లు సమాచారం.

News August 27, 2024

అస్పష్టంగా IMA అధ్యక్షుడి క్షమాపణ: సుప్రీంకోర్టు

image

IMA అధ్యక్షుడు RV అశోకన్ ప్రచురించిన క్షమాపణ అస్పష్టంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. వాటిని ప్రచురించిన హిందూ పేపర్ 20 ఎడిషన్ల కాపీలను వారంలోగా సమర్పించాలని ఆదేశించింది. ‘భౌతికంగా పత్రికల్లో క్షమాపణా ప్రకటనలు, వాటి సైజుల్ని చూసేవరకు మేం ఊరుకోం’ అని తెలిపింది. పతంజలి కేసులో కోర్టును ఎగతాళి చేసేలా మీడియాలో మాట్లాడారని ఆయనపై సుప్రీం గతంలో సీరియస్ అయింది. క్షమాపణ చెప్పాలని ఆదేశించింది.

News August 27, 2024

యూట్యూబ్ యూజర్లకు షాక్

image

యాడ్స్ లేకుండా కంటెంట్ వీక్షించే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ల ధరలను యూట్యూబ్ పెంచింది. గతంలో రూ.129 ఉన్న వ్యక్తిగత ప్రీమియం నెల ప్లాన్ ధర ఇప్పుడు రూ.149కి చేరింది. ఫ్యామిలీ ప్రీమియం ధర రూ.189 నుంచి రూ.299కి, ప్రీమియం స్టూడెంట్ ప్లాన్ రూ.79 నుంచి 89కి పెరిగాయి. ప్రీపెయిడ్‌తో పాటు రెన్యువల్ సబ్‌స్క్రిప్షన్ ధరల్ని కూడా యూట్యూబ్ సవరించింది.

News August 27, 2024

నిర్లక్ష్యం చేయకండి!

image

ప్రస్తుతం డెంగ్యూ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండోసారి డెంగ్యూ బారిన పడటం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. వారిలో తీవ్రమైన కడుపు నొప్పి, నిరంతర వాంతులు, శ్వాస ఇబ్బందులు, చిగుళ్లు& ముక్కు నుంచి రక్తస్రావం, అలసట లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ వైరస్ సోకిన ఆడ ఏడిస్ దోమలు కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. సరైన చికిత్స ద్వారా రోగి ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు.

News August 27, 2024

కవితకు బెయిల్.. మాట్లాడకుండా వెళ్లిపోయిన కేటీఆర్

image

కవితకు బెయిల్ మంజూరు కాగానే కేటీఆర్, హరీశ్ రావు తదితర బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టు నుంచి బయటికి వచ్చారు. మీడియా ఆయనను చుట్టుముట్టగా కేటీఆర్ ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. అయితే కాసేపటి తర్వాత ఆయన దీనిపై స్పందించే అవకాశం ఉంది.

News August 27, 2024

ఇవాళే జైలు నుంచి కవిత విడుదల!

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు <<13949913>>బెయిల్ <<>>మంజూరు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ సాయంత్రంలోపు తిహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ధర్మాసనం తీర్పు పత్రాలను ఆమె తరఫు లాయర్లు వెంటనే జైలు అధికారులకు అందించనున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు కేటీఆర్, హరీశ్ రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే.

News August 27, 2024

దగ్గు శబ్దాన్ని విని రోగాన్ని నిర్ధారించే AI మోడల్

image

ప్రాథమిక దశలోనే రోగనిర్ధారణ చేయడం ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి హెల్త్ ఎకౌస్టిక్ రిప్రజెంటేషన్స్ (HeAR) అనే టెక్నాలజీని గూగుల్ రూపొందించింది. ఇది దగ్గు ధ్వని నమూనా ఆధారంగా శరీర అంతర్గత సమస్యలను విశ్లేషిస్తుంది. HYD బేస్డ్ కంపెనీ రూపొందించిన ‘శ్వాస’ అనే AI పరికరానికి HeARను గూగుల్ అనుసంధానం చేయనుంది. దీంతో టీబీ, COPD వంటి లంగ్ డిసీజెస్‌ను ముందుగానే గుర్తించవచ్చు.

News August 27, 2024

Mr.ఎన్టీఆర్ క్రేజ్.. 5 నిమిషాల్లో ‘దేవర’ టికెట్లు క్లోజ్

image

Mr.ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ వచ్చే నెల 27న రిలీజ్ కానుండగా, యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. పికాడిల్లీ సినీ మల్టీప్లెక్స్‌లో 2 ప్రీమియర్స్ టికెట్లు కేవలం 5 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. ఇక రిలీజ్ రోజు తెల్లవారుజామున 1.08 గంటలకు ఇండియాలోని అన్ని థియేటర్లలో షోలు ప్రారంభించేలా మేకర్స్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అదే టైమ్‌లో USలోనూ బెనిఫిట్ షో ఉంటుందని సమాచారం.

News August 27, 2024

కవితకు బెయిల్‌.. ఈ మూడు అంశాలే కారణం

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె బెయిల్ మంజూరులో కోర్టు మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంది. సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేయడం, ఈడీ దర్యాప్తు పూర్తి చేయడం, మహిళగా కూడా పరిగణించి బెయిల్ ఇస్తున్నట్లు ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. కాగా కవిత 5 నెలలు తీహార్ జైలులో ఉన్నారు.

News August 27, 2024

ఊహించినట్లే కవితకు బెయిల్

image

BRS శ్రేణులు ఊహించినట్లే MLC కవితకు బెయిల్ వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న అరెస్టైన ఆమె పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈసారి పకడ్బందీగా వాదనలు వినిపించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈమేరకు కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీ వెళ్లి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. కేసులో కవితకు వ్యతిరేకంగా ఈడీ ఎలాంటి ఆధారాలు చూపలేదని ఆమె లాయర్ వాదించి సక్సెస్ అయ్యారు.