India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆచూకీపై హైడ్రామా కొనసాగుతూనే ఉంది. ఆయన ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ఓ రెస్టారెంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్జీవీ కోసం పోలీసులు అక్కడికి వెళ్తున్నారని సమాచారం. అంతకుముందు ఆర్జీవీ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా HYDలోనే ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

UP సంభాల్ హింసకు BJPదే బాధ్యతని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అడ్మినిస్ట్రేషన్ అన్ని పక్షాల వాదనను పట్టించుకోలేదని, సరిగ్గా వ్యవహరించలేదని విమర్శించారు. హిందూ ముస్లిముల మధ్య BJP విభేదాలు సృష్టిస్తోందన్నారు. సుప్రీంకోర్టు త్వరగా జోక్యం చేసుకోవాలని కోరారు. స్థానిక కోర్టు ఆర్డర్తో జామా మసీదును సర్వే చేయడానికి వచ్చిన అధికారులపై ముస్లిములు రాళ్లతో దాడిచేశారు. ఈ ఘర్షణల్లో నలుగురు మరణించారు.

TG: బీసీలకు న్యాయం జరగాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ను కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు MLC కవిత చెప్పారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ జాగృతి పోరాడుతోందని, BRS బీసీలకు న్యాయం చేసిందన్నారు. రాష్ట్రంలో కులగణన శాస్త్రీయంగా జరగాలని, కామారెడ్డి డిక్లరేషన్ యథాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని చెప్పారు.

వచ్చే ఐపీఎల్ సీజన్లో CSKకి రుతురాజ్ గైక్వాడ్, MIకి హార్దిక్ పాండ్య, SRHకు పాట్ కమిన్స్, RRకు సంజూ శాంసన్, GTకి శుభ్మన్ గిల్ కెప్టెన్లు కొనసాగడం ఖాయమైంది. ఢిల్లీకి కేఎల్ రాహుల్, LSGకి రిషభ్ పంత్, PBKSకు శ్రేయాస్ అయ్యర్ కొత్తగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. RCB(కోహ్లీ/డుప్లిసెస్), KKR(నరైన్/రసెల్) విషయంలో సందిగ్ధత ఏర్పడింది. ఇవాళ్టి వేలం తర్వాత ఓ స్పష్టత రానుంది.

అంతా ఊహిస్తున్నట్టుగా దేవేంద్ర ఫడణవీస్కు CM పీఠం దక్కకపోవచ్చని తెలుస్తోంది. మహారాష్ట్రలో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే పార్టీలు మళ్లీ పుంజుకోకుండా వ్యూహాత్మక ఎంపిక ఉంటుందని సమాచారం. ఠాక్రే మరాఠీ, పవార్ మరాఠా అస్థిత్వం ఆధారంగా పార్టీలు నడుపుతున్నారు. ఈ రెండింటినీ న్యూట్రలైజ్ చేసేలా సీఎంను నియమిస్తారని విశ్లేషకుల అభిప్రాయం. మనోహర్, శివరాజ్లా కేంద్రంలోకి ఫడణవీస్ను తీసుకుంటారన్న వాదనా తెరపైకొచ్చింది.

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ఫార్మా సిటీపై ప్రతిపక్షాల విమర్శలు, నేడు బీఆర్ఎస్ మహాధర్నా నేపథ్యంలో సీఎం రేవంత్ ఏం మాట్లాడతారనే ఉత్కంఠ నెలకొంది.

ముంబై ఇండియన్స్ ఝార్ఖండ్కు చెందిన విధ్వంసకర బ్యాటర్, కీపర్ రాబిన్ మింజ్ను రూ.65 లక్షలకు దక్కించుకుంది. గతంలో మినీ వేలంలో ఇతడిని గుజరాత్ టైటాన్స్ రూ.3.6 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే మెగా టోర్నీకి ముందు బైక్ యాక్సిడెంట్ కావడంతో సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి దేశవాళీ టోర్నమెంట్లలో అదరగొట్టడంతో ముంబై దృష్టిని ఆకర్షించారు. ఇతడికి ‘ఝార్ఖండ్ గేల్’ అనే పేరు ఉంది.

TG: ఫార్మా విలేజ్ కోసం 3వేల ఎకరాల భూములు తీసుకుంటామంటే లగచర్ల గిరిజన రైతులు సీఎం రేవంత్ మీద తిరగబడ్డారని KTR అన్నారు. 9 నెలలుగా నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడటానికి సమయం లేదా అని సీఎంను ప్రశ్నించారు. లగచర్లకు అధికారులు వెళ్తే వ్యతిరేకించారని, అదే రేవంత్ వెళ్లుంటే ఉరికించి కొట్టేవారని చెప్పారు. అదానీ, అల్లుడు, తమ్ముడు, అన్న కోసం రేవంత్ పని చేస్తున్నారని మహబూబాబాద్లో ఫైరయ్యారు.

వెంకీ అట్లూరి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్-మీనాక్షి చౌదరి నటించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ నెల 28 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. గత నెల 31న విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి సూపర్హిట్గా నిలిచిన విషయం తెలిసిందే.

పార్లమెంటు ఉభయసభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. లోక్సభ, రాజ్యసభ ఆరంభమైన కాసేపటికే ఇండియా కూటమి సభ్యులు ఆందోళనకు దిగారు. గౌతమ్ అదానీపై న్యూయార్క్ కోర్టులో అభియోగాల నమోదుపై చర్చించాలని పట్టుబట్టారు. JPC వేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి సద్దుమణగక పోవడంతో లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభలను వాయిదా వేశారు.
Sorry, no posts matched your criteria.